E.G: ఆధునిక వ్యవసాయంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చింతపల్లి రామకృష్ణ అన్నారు. మండపేట మండలం వ్యవసాయ శాఖ అధికారి ప్రభాకర్ నేతృత్వంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.