SRD: 2025 26 సంవత్సరానికి షెడ్యూల్ కులాలకు 409 యూనిట్లు మంజూరైనట్లు అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ కులాల సంక్షేమ పథకాలకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని చెప్పారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.