NLG: చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామ సర్పంచ్గా తన చిన్ననాటి మిత్రుడు సాగర్ల భానుశ్రీ భిక్షం ఎన్నికైన సందర్భంగా..1998 టెన్త్ బ్యాచ్కు చెందిన అసిస్టెంట్ కమిషనర్ గుత్తా శ్రీధర్ రెడ్డి, పిశాటి జంగారెడ్డి తమ స్నేహాన్ని చాటుకున్నారు. రూ.60 వేల విలువైన నూతన ఫర్నిచర్ను గ్రామ పంచాయతీకి విరాళంగా అందజేశారు. ఈ ఉదారతకు సర్పంచ్ భానుశ్రీ భిక్షం కృతజ్ఞతలు తెలిపారు.