SRCL: వేములవాడ సమీపంలోని నక్కవాగు వద్ద ఇసుక రీచ్ నుంచి తరలింపును నిరసిస్తూ బుధవారం రైతులు వాహనాలను అడ్డుకున్నారు. వేసవిలో భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తహాసీల్దార్ అబూబకర్ వివరణ ఇస్తూ.. కేవలం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసమే ఇసుక తీస్తున్నామని, రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.