NLR: తోటపల్లి గూడూరులో ప్రజాదర్బార్ శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఆయనకు అర్జీలు ఇచ్చారు. సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కూటమి నాయకులు ఎస్. సురేష్ రెడ్డి, బి. సురేంద్ర పాల్గొన్నారు.