ADB: నార్నూర్ మండలంలోని నాగల్కొండ గ్రామంలో బుధవారం ‘పోలీస్ ఈగల్ టీం’ పర్యటించింది. ఈ సందర్బంగా మత్తు పదార్థాల నియంత్రణపై ఎస్సై శ్రీసాయి ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి, గుట్కా, మద్యం వంటి పదార్థాలను పూర్తిగా నిషేదించాలని సూచించారు. గంజాయి విక్రయించినా, తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహాదు పాల్గొన్నారు.