KNR: కరీంనగర్ పట్టణంలోని మహిమాన్విత భవ్య, దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో శుక్రవారం సంకష్టి చతుర్దశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సంకష్ట సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజ, గణపతి హోమ కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు. ఆయా ప్రత్యేక పూజ, గణపతి హోమ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్లతోపాటు అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు కూడా వెంటనే పరిష్కరించేటట్లు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగినట్లు ఆయన తెలిపారు.
BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు కూడా వెంటనే పరిష్కరించేటట్లు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగినట్లు ఆయన తెలిపారు.
JN: జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం పట్టణంలోని బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజా అవసరాల దృష్ట్యా అన్ని పనులను సమయానుకూలంగా పూర్తి చేయాలని వారు ఆదేశించారు. సంబంధిత జిల్లా అధికారులు, తదితరులున్నారు.
GDWL: అయిజ మారుతి అకాడమీ తైక్వాండో విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై సత్తా చాటారు. గద్వాలలో గురువారం జరిగిన జోనల్ లెవెల్ SGF తైక్వాండో పోటీల్లో అండర్ 14, 17 విభాగంలో ఉత్తమ ప్రతిభకనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విషయం తెలుసుకున్న మాస్టర్ మధు కుమార్ అయిజలో ఇవాళ వారిని అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
KMM: బోనకల్ మండలం గోవిందాపురం(L)లో చర్చ్ను కూల్చిన దుండగులుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గిరి అన్నారు. గత రాత్రి సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే మత పిచ్చితో JCB సహాయంతో చర్చ్ను కూల్చివేశారని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
RR: షాద్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాసేవలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని, షాద్నగర్ పరిధిలో ఉన్న ఎన్హెచ్-44లో ప్రమాద బ్లాక్ స్పాట్లను సందర్శించి ప్రమాదాలను తగ్గించడానికి గల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రికార్డులను పరశీలించారు.
MDK: అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం హవేలీ ఘనపూర్ మండలం కూచన్ పల్లి గ్రామం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలకు న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్ఎం సుభవల్లి హాజరయ్యారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఉన్నత. విద్యను అభ్యసించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆమె పేర్కొన్నారు.
NRPT: గత సీజన్లో వరి కొనుగోలు సమయంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లయి అధికారులతో వరి, పత్తి కొనుగోళ్లపై సమావేశం నిర్వహించారు. వరి, పత్తి తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
KNR: గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో గతుకులమయమైన రోడ్డును తాత్కాలికంగా మరమ్మతు చేయడానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు గుంతలమయమై ఆర్టీసీ బస్సు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో శుక్రవారం మట్టి పోసి రోడ్డును చదును చేసే పనులు ప్రారంభించారు.
PDPL: బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నిరసిస్తూ కమాన్పూర్లో అంబేడ్కర్ చౌక్లో బీజేపీ నేతలు రాస్తారోకో చేపట్టారు. మండల అధ్యక్షుడు కొయ్యడ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మచ్చగిరి రాము, దండే లక్ష్మీనారాయణ, బొంపల్లి మొండయ్య, జంగాపల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు.
HYD: 2023 ఏడాదికి సంబంధించి NCRB రిపోర్టు విడుదల చేసింది. తెలంగాణలో నమోదైన నేరాలు 1,56,737 కాగా.. అత్యధికంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 23,289.. ‘సైబరాబాద్’లో 22,398, హైదరాబాద్లో 21,774 నేరాలు నమోదయ్యాయని పేర్కొంది. తాజాగా విడుదల చేసిన రిపోర్టులో అనేక విషయాలను పొందుపరిచి, కొన్ని కేసులకు సంబంధించిన కారణాలను సైతం వివరించింది.
PDPL:పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ నేతృత్వంలో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యతని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ లింగయ్య, ఏఈ సతీష్, అధికారులు పాల్గొన్నారు.
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర ఓబీసీ వర్కింగ్ ఛైర్మన్ వినయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీసీలు వెనకబడ్డారనే విషయాన్ని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 42 శాతం బీసీలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.
NLG: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. MLG క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రైస్ మిల్లర్స్ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో కంటే ఎక్కువ పంట దిగుబడి రానందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.