• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రైతులకు ట్రాన్స్ ఫార్మర్స్ పంపిణీ

NGKL: కొల్లాపూర్‌లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు సీనియార్టీ ప్రకారం ట్రాన్స్ ఫార్మర్స్ పంపిణీ చేస్తున్నామని జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ పౌల్ రాజ్ ఆదివారం తెలిపారు. 2024లో చేసుకున్న 148 మంది రైతులకు ట్రాన్స్ ఫార్మర్స్  పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది దాదాపు 200 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నాట్లు పేర్కొన్నారు.

July 6, 2025 / 08:27 PM IST

తెలకపల్లిలో పీర్లను సందర్శించిన ఎమ్మెల్యే

NGKL: తెలకపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలకపల్లిలో వెలసిన ఎనిమిది పీర్లను సందర్శించి దట్టి వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కులమతాలు ఏకమై జరుపుకునే మొహరం పండుగ చరిత్ర గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ వారణాసి శ్రీనివాసులు, జిలాని, నిస్సార్, మల్లేష్ గౌడ్, కిరణ్ పాల్గొన్నారు.

July 6, 2025 / 08:25 PM IST

‘వెంకటేశ్వర్లు చేసిన సేవలు మరువలేనివి’

SRPT: చిలుకూరు మండలం పాలే అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ సభ ఆదివారం మండల కేంద్రంలో, పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీఆర్టీయూ సూర్యపేట జిల్లా కార్యదర్శి నరేష్ హాజరై మాట్లాడారు.

July 6, 2025 / 08:19 PM IST

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

BHPL: కొత్తపల్లిగోరి మండలం బాలయ్యపల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి పార్టీలోకి స్వచ్ఛందంగా చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.

July 6, 2025 / 08:17 PM IST

అంధ్ర క్రీడాకారుడుని అభినందించిన మంత్రి

WNP: ఆత్మకూరులో శిక్షణ పొందిన అంధ్ర విద్యార్థి పవన్ కళ్యాణ్ ఇండియా గోల్ బాల్ భారత జట్టుకు ఎంపిక కావడంపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిడి శ్రీహరి ఆదివారం క్రీడాకారుడుని అభినందించారు. అంధ్రుడు అయినా తన ప్రతిభతో జట్టుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఆధిరోహించాలని ఆకాంక్షించారు.

July 6, 2025 / 08:16 PM IST

ప్రొఫెసర్‌గా ప్రమోషన్ పొందిన పర్వతగిరి వాసి

WGL: ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాదులో ప్రొఫెసర్‌గా పర్వతగిరి మండలం కొంకపాక చెందిన భూక్య తిరుపతి పదవి బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆదివారం స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు అచించలమైన కృషి పట్టుదల విశ్వాసంతో ముందుకు నడిచి ప్రొఫెసర్‌గా ఎదిరిన తీరు పట్ల ఇక్కడి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

July 6, 2025 / 08:07 PM IST

రేపు హనుమకొండ కలెక్టరేట్లో ప్రజావాణి రద్దు

HNK: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరుగు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరిశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలో జరుగు స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరవుతున్న నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేసినట్లు తెలిపారు.

July 6, 2025 / 07:42 PM IST

మెండోరా ఎస్సైగా జాదవ్ సుహాసిని

NZB: మెండోరా మండల ఎస్సైగా జాదవ్ సుహాసిని ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు మెండోరా ఎస్సైగా ఉన్న యాసర్ అర్ఫాత్ నిజామాబాద్ కమిషనరేట్ వీఆర్‌కు బదిలీ అయ్యారు. ట్రైనీ ఎస్సైగా ఉన్న సుహాసినికి మెండోరా బాధ్యతలు అప్పగించారు. మే 1న బాధ్యతలు చేపట్టిన అర్ఫాత్ కేవలం రెండు నెలల్లోనే బదిలీ కావడం గమనార్హం.

July 6, 2025 / 07:39 PM IST

ఘనంగా మొహర్రం వేడుకలు

MDK: పెద్ద శంకరంపేట మండలంలో ఆదివారం మొహర్రం పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పెద్ద శంకరంపేటలో దూది పీర్, లాల్ సాబ్, చాన్ సాబ్, మౌలాలి పీర్లను పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా ప్రజలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

July 6, 2025 / 07:18 PM IST

ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

MDK: పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విఠలేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

July 6, 2025 / 07:16 PM IST

పెద్ద శంకరంపేటలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి

MDK: పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో మండల అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడిన మహోన్నత వ్యక్తి ఆయన అని కొనియాడారు.

July 6, 2025 / 07:14 PM IST

మైనారిటీ హక్కుల కోసం ఆవాజ్ చైతన్య యాత్ర

GDWL: గట్టు మండలంలో ఆవాజ్ కమిటీ చైతన్య యాత్ర ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతికూర్ రహ్మాన్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులు హరించబడుతున్నాయని,పేదరికం, నిరుద్యోగం, మత విద్వేషాలతో నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 13-14న గద్వాలలో ఆవాజ్ మహాసభలు, ర్యాలీ, బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు.

July 6, 2025 / 05:24 PM IST

రైలులో నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

GDWL: రైలు డోర్ వద్ద నిద్రమత్తులో జారిపడటంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం జోగులాంబ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ నుంచి తిరుపతికి స్నేహితులతో కలిసి రైలులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుడిని నవాబ్‌పేట్ మండలం కారుకొండ గ్రామానికి చెందిన నరేందర్ (48)గా గుర్తించారు.

July 6, 2025 / 05:18 PM IST

జూరాలకు ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తివేత

GDWL: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 4 గంటల సమయానికి ప్రాజెక్టుకు 1,10,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరిందని అధికారులు తెలిపారు. దీంతో, ప్రాజెక్టులోని 12 గేట్లు ఎత్తి 1,11,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

July 6, 2025 / 05:16 PM IST

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

MDK: పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని నర్సాపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. నర్సాపూర్ మండలం అజమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు.

July 6, 2025 / 05:15 PM IST