• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆర్టీసీ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే సంఘీభావం

PDPL: మంథని డిపో పరిధిలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకున్న నేపథ్యంలో కార్మికుల సమ్మె శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సందర్శించి, వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.

April 23, 2026 / 08:45 PM IST

లింగ నిర్ధారణ చట్టం అమలులో రాజీపడొద్దు: కలెక్టర్

NGKL: జిల్లాలో లింగ నిర్ధారణ చట్టం (PCPNDT) నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని కలెక్టర్ సంతోష్ స్పష్టం చేశారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లకు అనుమతులు పూర్తిగా చట్టబద్ధంగానే మంజూరు చేస్తామని తెలిపారు. అక్రమంగా లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 23, 2026 / 08:45 PM IST

‘పాఠశాల సరిహద్దు సమస్య పరిష్కరించాలి’

MNCL: చెన్నూర్ మండలం నర్సక్కపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వా‌డీ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సౌకర్యాలను పరిశీలించి, పాఠశాల సరిహద్దు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎరువుల దుకాణం తనిఖీ చేసి ట్రేడ్ లైసెన్స్ పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని యజమానికి సూచించారు.

April 23, 2026 / 08:44 PM IST

మండడి వంశస్తుల పేర్సపెన్ ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

ASF :సిర్పూర్ యు శెట్టిహడప్నూర్‌లో మండడి వంశస్తులు పేర్సపేన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ హాజరయ్యారు. ఆదివాసీ సంప్రదాయ నృత్యం చేశారు. మండడి వంశస్తులు MLA కు స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. పూర్వపు సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ నేటి యువతకు తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలదని తెలిపారు.

April 23, 2026 / 08:42 PM IST

అక్రమార్కులకు అడ్డుకట్ట వేసిన పోలీస్ యంత్రాంగం

KMM: కూసుమంచి మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులపై రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఉమ్మడిగా తెరదించారు. గురువాయి గూడెంలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులు, ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ నిర్వహించి ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

April 23, 2026 / 08:40 PM IST

జగిత్యాల జిల్లాలో 10,860 ఇందిరమ్మ ఇండ్లు పెండింగ్

జగిత్యాల జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను 100 శాతం గ్రౌండింగ్ చేయాలని అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న 10,860 ఇండ్లకు ఏప్రిల్ 30లోగా మార్క్ ఔట్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు.

April 23, 2026 / 08:38 PM IST

సర్పంచ్ నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ADB: ఇచ్చోడ మండలంలోని దాబ (బి) గ్రామ సర్పంచ్ ఈశ్వర్ నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశానికి గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

April 23, 2026 / 08:36 PM IST

బస్టాండులకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

MDK: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బస్సుల సేవలు నిరంతరం కొనసాగేందుకు జిల్లాలోని బస్టాండ్‌ల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. గురువారం పట్టణంలోని బస్టాండును సందర్శించారు. ఎలాంటి అవాంఛనియ ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. బస్సులపై దాడి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

April 23, 2026 / 08:35 PM IST

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం

SRCL: వేములవాడ పట్టణం 12వ వార్డ్‌లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి, నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో వేములవాడ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 484 మందికి ఇళ్లు మంజూరు అయ్యాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

April 23, 2026 / 08:34 PM IST

ఘోస్ కమిషన్‌పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

PDPL: ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని BRS పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లిలో ఈరోజు ఆయన మాట్లాడారు. రాజకీయ కక్షతోనే కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని, కోర్టు తీర్పుతో సత్యం వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇకనైనా అబద్ధాలు మానుకుని ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలన్నారు.

April 23, 2026 / 08:34 PM IST

‘చెరువులతో పాటు ఎస్టీపీలు సిద్ధం కావాలి’

RR: చెరువులతో పాటు ఎస్టీపీలు సిద్ధం కావాలని, అప్పుడే చెరువుల పునరుద్ధరణ ప్రయోజనం ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. రాజేంద్రనగర్ మండలం ఇబ్రహీంబాగ్ చెరువును సందర్శించి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పూడిక ఏమాత్రం లేకుండా తొలగించాలని అప్పుడే చెరువుల దుర్గంధం వదులుతుందన్నారు.

April 23, 2026 / 08:33 PM IST

‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేది ఎప్పుడు’

KNR: గంగాధర మండలం ముప్పిడి నర్సయ్యపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు గడిచినా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వద్దే ధాన్యం పోగై ఉండటంతో వర్షాలు పడితే నష్టపోతామనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిపోతే నాణ్యత తగ్గి ధరలు పడిపోతాయని చెబుతున్నారు.

April 23, 2026 / 08:32 PM IST

యాంటీ ర్యాగింగ్ పై అవగాహన

NZB: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్, మత్తు పదార్థాల నివారణ, సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పాల్గొన్నారు. ర్యాగింగ్ నేరమని, డ్రగ్సు దూరంగా ఉండాలని, సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

April 23, 2026 / 08:30 PM IST

గాలివానకు ప్రమాదకరంగా ఫ్లెక్సీ సైన్ బోర్డులు

RR: మొయినాబాద్‌లో గాలివాన బీభత్సానికి బీజాపూర్ రహదారిపై ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు చినిగి ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఇవి ఎప్పుడైనా వాహనదారులపై పడే అవకాశం ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, ఆ బోర్డులను తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

April 23, 2026 / 08:28 PM IST

సన్న వరి సాగు పెంపుపై అదనపు కలెక్టర్ సూచనలు

జగిత్యాలలో గురువారం జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. మార్కెట్‌లో గిరాకీ ఉన్న సన్నరకం వరి సాగు విస్తరణ, ఆయిల్ పామ్ పెంపు, యూరియా బుకింగ్ యాప్ వినియోగం, సహజ వ్యవసాయంపై చర్చించారు. సమావేశానికి అదనపు కలెక్టర్ బి.ఎస్. లత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు సమయానికి అందించాలని అన్నారు.

April 23, 2026 / 08:24 PM IST