KMM: జిల్లాలో వాతావరణం మారడంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, సత్తుపల్లి, మధిర, బోనకల్, ఏన్కూరు తదితర మండలాల్లో విష జ్వరాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని స్థానికులు తెలిపారు. విషజ్వరాల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
MNCL: భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి సదస్సులని దండేపల్లి తహసీల్దార్ రోహిత్, డీటీ మాధవి అన్నారు. శుక్రవారం మండలంలోని ముత్యంపేటలో తహసీల్దార్, చింతలపల్లిలో డీటీ రెవెన్యూ సదస్సులలో పాల్గొన్నారు. ప్రజలు, రైతుల నుండి భూ సమస్యలపైన అర్జీలను స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.
NRML: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సాయి ప్రసాద్ ఆఫ్రికా లోని ఎత్తైన పర్వతం మౌంట్ కిలిమంజారోను విజయవంతంగా అధిరోహించారు. గతంలో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన సాయి ప్రసాద్, కిలిమంజారో శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు శుక్రవారం వారిని ప్రత్యేకంగా అభినందించారు.
SRD: బస్సు పాస్ చార్జీల పెంపకం నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ బస్ పాస్ చార్జీల పెంపు వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడతారని చెప్పారు. చార్జీలు తగ్గించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్లో నెలరోజులుగా కుళాయిలో మురుగునీరు సరఫరా అవుతుందని స్థానికులు ఆరోపించారు. చెత్తాచెదారం, మురుగునీరు రావడంతో నీటిని తాగలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
KMRD: నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరద నీరు చేరుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ఎగువ ప్రాంతాల నుంచి 583 క్యూసెక్కుల నీరు వస్తోందని ప్రాజెక్ట్ ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405.00 అడుగులు (17.802 టీఎంసీ)లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1,393.66 అడుగుల(5.957 టీఎంసీ)నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.
HNK: కమలాపూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి నుంచి 10వ తరగతి చదివే బీసీ విద్యార్థుల కోసం ప్రవేశ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమాధికారి కట్టయ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన పరిమిత సీట్లలో ఇతర విద్యార్థులకు కూడా అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి మంత్రిగా పశుసంవర్థకశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా ఇంఛార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్థానంలో శ్రీహరిని ఉమ్మడి జిల్లా ఇంఛార్జిగా నియమించారు.
KMM: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 14న ఆదివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. మొత్తంగా 13 బెంచ్లలు ఏర్పాటు చేస్తుండగా..రాజీపడదగిన అన్ని సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు ప్రమాదాలు, వివాహ సంబంధిత, బ్యాంక్ కేసులను పరిష్కరించుకోవచ్చునని వెల్లడించారు.
NLG: తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం గురువారం రాత్రి 9 గంటలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. ఉమ్మడి నల్లగొండ ఇన్ఛార్జ్ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించింది.
KMM: జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాదిలోపే ముజామ్మిల్ ఖాన్ బదిలీ అయ్యారు. అటు ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏడాది సర్వీస్లో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ జిల్లాలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
KMRD: పోలీసులు నిజాయితీగా వ్యవహరిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. గురువారం జిల్లాలో ఏఎస్సై, సివిల్ హెడ్ కానిస్టేబుల్స్, బదిలీల ప్రక్రియను ఎస్పీ నిర్వహించారు. బదిలీలను అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్పై పూర్తి పారదర్శకంగా కౌన్సిలింగ్ పద్ధతిలో చేపట్టారన్నారు. పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.
SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి 15 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ. 86 లక్షల 85 వేల 3 వందల ఏడు రూపాయలు వచ్చినట్లు ఈవో వినోద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బంగారం 83 గ్రాములు, వెండి 05 కిలోల 500 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపును ఈవో వినోద్ పర్యవేక్షించారు.
కామారెడ్డి: జిల్లాకు చెందిన సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ మాజీ ఉద్యోగి రూ. లక్ష విరాళం అందజేశారు. దేశరక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో దేశరక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న త్రివిధ దళాల సేవలు మరవలేనివని అన్నారు.
KMR: జుక్కల్ నియోజకవర్గం ఎరువుల దుకాణదారులు రైతులకు అమ్మే ఎరువులు ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని, అధిక ధరలతో అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం మద్నూర్ మండలంలో మద్నూర్ సొసైటీ, పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.