KMM: నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లోని గిడ్డంగుల సంస్ధ గోడౌన్లను సంస్థ రాష్ట్ర ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో నిల్వ ఉన్న సన్న బియ్యం నాణ్యతను, నిల్వలను పరిశీలించారు. ఎగుమతులు, దిగుమతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బియ్యం నిల్వల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
KMM: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని కూసుమంచిలో ఇవాళ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు హాజరయ్యారు. అనంతరం కార్యకర్తలతో కలిసి టపాకాయలు పేల్చి ఆనందం పంచుకున్నారు.
MDK: చేగుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈరోజు నుంచి 21 వరకు 72వ అఖిలభారత సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సొసైటీ ఛైర్మన్ అయిత రఘురాములు పేర్కొన్నారు. సహకార వారోత్సవాలు పురస్కరించుకొని సొసైటీ వద్ద సహకార జెండాను ఆవిష్కరించారు. వైస్ ఛైర్మన్ రాములు, డైరెక్టర్స్ సిద్ధిరాములు, కుమార్, సీఈవో సందీప్ పాల్గొన్నారు.
ASF:కా గజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు SP కాంతిలాల్ పాటిల్ శుక్రవారం తెలిపారు. గద్దల కిరణ్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు SI ప్రశాంత్, పోలీస్ ప్రత్యేక బృందం గుజరాత్ రాష్ట్రానికి పంపడమైనదన్నారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు.
NRML: జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శుక్రవారం నిర్మల్ మండలం కొండాపూర్లో పర్యటించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు.
NZB: ఇంటర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంటర్ బోర్డు కమిషనర్ సూచించిన మేరకు ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆర్మూర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, గిరిజన బాలుర జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.
MNCL: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలంలోని కొలాంగూడ గ్రామంలో మండల ప్రభుత్వ ఉద్యోగులచే సేకరించిన దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చలి తీవ్రత దృష్ట్యా ప్రభావిత ప్రాంతాలలో ప్రజల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు.
ADB: ఆధార్ సేవల్లో వేగం, ఖచ్చితత్వం పెంచాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో ఆధార్ ఆపరేటర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సేవల్లో ఆధార్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దరఖాస్తులు పెండింగ్లో ఉండకూడదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవల నాణ్యతను పెంచాలని ఆదేశించారు.
KMR: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు సూచించారు. శుక్రవారం బిక్కనూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లను ట్యాబ్లో ఎంట్రీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి రమేష్, సొసైటీ వైస్ ఛైర్మన్ రాజిరెడ్డి పాల్గొన్నారు.
WNP: జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని రేవల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చట్టాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా సీనియర్ జడ్జి రజిని మాట్లాడుతూ.. 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలకు వాహనాలు ఇచ్చిన వాహన యజమానులపై కేసులు నమోదు అవుతాయని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు.
HYD: గాంధీనగర్లోని కృష్ణానగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సురవి విశాల్ గౌడ్ (30) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన కోడలు కావ్య వేధింపుల వల్లే తమ కొడుకు చనిపోయాడని విశాల్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
PDPL: రామగుండం 3 సింగరేణి డైరెక్టర్ ఎల్వీ. సూర్యనారాయణ రామగుండం 3 ఏరియాలోని ఓసీపీ–1 ఉపరితల గనిని సందర్శించారు. క్వారీలో జరుగుతున్న పనులు, భద్రతా చర్యల గురించి ఏరియా జీఎం నరేంద్ర సుధాకరరావు ఆయనకు వివరించారు. అనంతరం డైరెక్టర్ ఎస్ఎంఎస్ ప్లాంట్ను పరిశీలించి, సామర్థ్య పెంపు పనుల పురోగతిని సమీక్షించారు.
HYD: ప్రస్తుతం హైదరాబాద్లో సంవత్సరానికి సుమారు 3 వేల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అందులో 300 మంది ప్రాణాలు కోల్పోతున్నారని సీపీ వీసీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు.
KNR: రామడుగు మండలం గోపాల్రావుపేట్ అంగన్వాడీ కేంద్రంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోపాల్రావుపేట్ సర్పంచ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న వెంకటరాం రెడ్డి, గోపాలరావుపేట్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు.