• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

చీటింగ్ కేసు నమోదు

KMM: తాను బతికి ఉండగానే మరణ ధ్రువీకరణ పత్రంతో తన భూమిని రెవెన్యూ అధికారులు మరొకరి పేర పట్టా చేశారని ఓ వ్యక్తి పోలీసులను ఆదివారం ఆశ్రయించాడు. ఎస్సై సాయి కిషోర్ రెడ్డి కథనం ప్రకారం.. దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన సాయిల వీర వెంకయ్య అనే వృద్ధుడికి చెందిన 2.11 ఎకరాల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ పట్టా చేయించుకుంది.

May 11, 2025 / 02:13 PM IST

ఘనంగా భూ లక్ష్మమ్మ తల్లి జాతర

SRD: నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలోని భూ లక్ష్మమ్మ తల్లి దేవాలయం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకలతో పాటు పూజా కార్యక్రమాలను జరిపించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

May 11, 2025 / 02:10 PM IST

నవాబుపేటలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

MBNR: జిల్లాలో గరిష్ఠ వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నవాబుపేటలో 40.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. భూత్‌పుర్ మండలం కొత్తమొల్గర 42.2 డిగ్రీలు, దేవరకద్ర 40.0 డిగ్రీలు, చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ 39.9 డిగ్రీలు, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.

May 11, 2025 / 11:11 AM IST

ఎంపీకి న్యాయవాదుల వినతి

KMM: 35 బీఎన్ఎస్ఎస్/41ఏ సీఆర్పీసీ, అడ్వకేట్ అమెండమెంట్ డ్రాఫ్ట్ బిల్ సవరణ చేయాలని కోరుతూ ఖమ్మం వచ్చిన పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావుకు సహస్ వెల్ఫేర్ ట్రస్ట్ నిర్వాహకులు, అడ్వకేట్ తాళ్లూరి దిలీప్ చౌదరి వినతిపత్రం అందజేశారు. సెంట్రల్ నోటరీలో తెలంగాణకు చెందిన 1,900 మంది నిరీక్షణలో ఉన్నారని, వారందరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు.

May 11, 2025 / 10:50 AM IST

రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

NRPT: మరికల్ మండలంలోని పెద్దచింతకుంట గ్రామంలో గల శ్రీ ఈశ్వర, ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమ, మంగళవారాల్లో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం జల్దిబిందె, సాయంత్రం పల్లకి సేవ ఉంటుందన్నారు. మంగళవారం ఉదయం రథోత్సవం, స్వామికి నిత్య పూజలను ఉంటాయన్నారు. రెండ్రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో అన్నదాన వితరణ ఉందన్నారు.

May 11, 2025 / 10:33 AM IST

బోర్లు రిపేర్ చేయించండి సారు..!

NRML: కుబీర్ మండల కేంద్రంలో గుక్కెడు నీటి కోసం బోర్ బావుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నామని మహిళలు వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలో ఉన్న బోర్లు చెడిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోర్లు రిపేర్ చేయించి నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నారు.

May 11, 2025 / 10:00 AM IST

‘సీతారామ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి’

KMM: గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్‌కు అనుసంధానం చేసి, సీతారామ ప్రాజెక్టును సత్వరము పూర్తిచేసి, సాగర్ ఆయకట్టు కింద సాగర్ నీళ్లు అందించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు శనివారం అన్నారు. ముష్టికుంట గ్రామంలో తెలంగాణ రైతు సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.

May 11, 2025 / 08:13 AM IST

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

KMM: పాల్వంచ మండలానికి చెందిన ఓ యువతి (19) వరంగల్లో డిగ్రీ చదువుతోంది. సెలవులు కావటంతో ఇంటికి వచ్చింది. ఇంట్లో ఏ పనులు చేయడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఆమె మన స్తాపానికి గురైంది. శనివారం ఇంటివద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే కుటుంబీకులు పాల్వంచ సీహెచ్‌సీకి తరలించగా వైద్యులు చికిత్స చేశారు.

May 11, 2025 / 08:12 AM IST

వీర జవాన్లకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ

SRD: అమీన్‌పూర్‌లో వీర సైనికులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీని శనివారం సాయంత్రం పట్టణ ప్రజలు చేపట్టారు. ఐలాపూర్ మణిక్ యాదవ్ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జై జవాన్.. జై భారత్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం భారత వీర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మున్సిపాలిటీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

May 11, 2025 / 08:08 AM IST

‘లక్ష్యసాధనకు ఐక్యత అవసరం’

MNCL: లక్ష్యసాధన కోసం బీసీ కులస్తులలో ఐక్యత అవసరమని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య కోరారు. ఆదివారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు లేకపోవడంతో నష్టపోతున్నామన్నారు. బీసీలలో చైతన్యం తీసుకువచ్చేందుకు బీసీ మేల్కొల్పు యాత్రను చేపట్టామన్నారు.

May 11, 2025 / 08:07 AM IST

సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

NGKL: అమ్రాబాద్ మండలంలో ఈనెల 18న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా శనివారం మన్ననూరు మాచారం గ్రామాలలో సభా స్థలాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, డీఎఫ్ రోహిత్ గోపిడి హేలిప్యాడ్, సభ స్థలాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

May 11, 2025 / 04:38 AM IST

విలువలతో కూడిన విద్యతోనే గుర్తింపు

JGL: విలువలతో కూడిన విద్యతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన అన్నారు. వేసవి సెలవుల్లో బాల బాలికల కోసం మాధవ సేవా పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 10 వరకు గీత విద్యాలయం ఆవరణలో నిర్వహించిన సంస్కార సాధన శిబిరం ముగింపు కార్యక్రమంలో శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

May 11, 2025 / 04:06 AM IST

రైల్వే స్టేషన్లలో పోలీస్ బృందాల తనిఖీలు

PDPL: భారత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓదెల మండలం పొత్కపల్లి, ఓదెల, కొలనూరు రైల్వే స్టేషన్లలో శనివారం పోలీస్ బృందాలు తనిఖీ నిర్వహించారు. శనివారం ఆయా రైల్వే స్టేషన్లలో బాంబ్ డిస్పోజల్ టీమ్, డాగ్స్ స్క్వాడ్ బృందాలతో లగేజ్ పార్సిళ్లు, బ్యాగులను తనిఖీలు చేశారు.

May 11, 2025 / 04:03 AM IST

కంపుకొడుతున్న కాలనీలు

NRML: కుభీర్ మేజర్ గ్రామపంచాయతీ కాలనీలు కంపు కొడుతున్నాయి. ముఖ్యంగా గణేష్ నగర్ కాలనీ అపరిశుభ్రంగా మారింది. ఇండ్ల మధ్యనే చెత్తకుప్పలు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది. గాలిదుమారం వీచినప్పుడు చెత్తాచెదారం ఇళ్లల్లోకి వస్తుందని కాలనీవాసులు మండిపడుతున్నారు. చెత్త సేకరణ బండి రాకపోవడంతో నెలల తరబడి చెత్త కుప్పలు పేరుకుపోయి డంపింగ్ యార్డును తలపిస్తోందని గ్రామస్తులు అంటున్నారు.

May 10, 2025 / 08:25 PM IST

నిబంధన ఉల్లంఘించిన RTC..!

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హెవీ వెహికల్ రిస్ట్రిక్టేడ్ బ్రిడ్జి కింద నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్సు ప్రయాణించిందని స్థానికులు తెలిపారు. భారీ వాహనాలకు అనుమతులు లేకున్నప్పటికీ ఇలా ప్రయాణించడం ఏంటని, సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులకు సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

May 10, 2025 / 08:23 PM IST