ADB: బేల మండలం సదల్పూర్ గ్రామంలోని మహదేవ్ భైరందేవ్ ఆలయాన్ని మాజీమంత్రి జోగు రామన్న సోమవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. BRS ప్రభుత్వ హయంలో మహదేవ్ భైరందేవ్ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. నాయకులు ప్రమోద్ రెడ్డి, దేవన్న, సతీష్ పవార్, విపిన్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు.
MNCL: విద్యార్థులకు మంచిగా విద్య బోధన చేయాలని లక్షెట్టిపేట మండల ఎంఈవో శైలజ అన్నారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలోని ఆంధ్ర కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రిజిస్టర్లను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. శిక్షణలో నేర్చుకునే అంశాల ఆధారంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలను బోధించాలని ఆదేశించారు.
KMM: కూసుమంచి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేందర్ మండలంలో ప్రజలు కోతులు, కుక్కల బెడదతో అవస్థలు పడుతున్నారని, వాటిని నిర్మూలించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. చిన్నపిల్లలు, ప్రజలు భయపడుతున్నట్లు తెలిపారు.
NRML: బ్లడ్ క్యాన్సర్ను సరైన సమయంలో గుర్తిస్తే నయమవుతుందని యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆంకాలజీ డాక్టర్ రోహిత్ రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలోని జోహ్రానగర్ కాలనీకి చెందిన అహ్మద్ బేగ్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ యశోద ఆసుపత్రిని సంప్రదించగా సరైన చికిత్స చేసి పూర్తిగా నయం చేసినట్లు డాక్టర్ తెలిపారు
SRD: అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ఖేడ్ MLA సంజీవరెడ్డి అన్నారు. సోమవారం ఖేడ్ పట్టణ పరిధి మన్సూర్ పూర్లో 15 ఇందిరమ్మ కొత్త ఇండ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గతేడాది క్రితం 15 ఇండ్లు మంజూరు చేయగా ఇల్లు నిర్మించుకున్నారని, మరో 30 ఇళ్లు కోరగా కొత్తగా 15 ఇండ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గ్రామస్తులు ఉన్నారు.
కామారెడ్డి: మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో గల శ్రీ హనుమాన్ మందిరానికి సంబంధించిన ఆలయ కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించాబడింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు.
NZB: గ్రామీణస్థాయిలో క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్ర, జాతీయస్థాయిల్లో రాణించాలని సర్పంచ్ లావణ్య భూమేశ్వర్ అన్నారు. ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో సీఎం కప్లో భాగంగా క్రీడాపోటీలను సర్పంచ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత చెడుఅలవాట్లను దూరంగా ఉండేందుకు క్రీడలవైపు మొగ్గు చూపాలన్నారు.
SRCL: ఉపాధిహామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వీర్నపల్లి మండలం వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువు తాండ గ్రామ సర్పంచ్ సుధాకర్ సూచించారు .గ్రామంలోని చీట ముఠా ఏరియాలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఉపాధి హామీ పథకంలో పనులు చేసి ఆర్థిక అభివృద్ధి చెందాలని సూచించారు.
NLG: ఈ నెల 23 నుండి జరగనున్న నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహోత్సవాల వాల్ పోస్టర్ను సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ అశోక్ నగర్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో మంగళవారం వాసవి మాత ఆత్మార్పణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 7:30 గంటల నుంచి భక్తులచే స్వయంగా మూలవిరాటు క్షీరాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తెలిపారు. అనంతరం గణపతి పూజ, కలశ స్థాపన, హోమం జరుగుతాయన్నారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలో సోమవారం మరికల్ వికాస వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్ల బండ్ల గిరుక పోటీలు ఆకట్టుకున్నాయి. 25 జతలు ఎడ్లు పోటీ పడ్డాయి. ఈ పోటిల్లో గెలుపొదిన విజేతలకు మొదటి బహుమతి రూ.20 వేలు, రెండవ బహుమతి రూ.15 వేలు, మూడవ బహుమతి రూ.10 వేలు, నాలుగవ బహుమతి రూ.5 వేల అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెన్నయ్యతో పాటు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కళ్యాణ వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మండపంలో స్వామివారిని కొలువు తీర్చి విశ్వక్సేనా పూజ, పుణ్యవాచనం చేశారు. స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ గావించి నిత్య కళ్యాణ ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
RR: ఒవైసీని ప్రశ్నించినందుకే AIMIM కార్యకర్తలు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి ఆరోపించారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె తెలిపారు. గుడులపై దాడులు చేయడమే కాకుండా ఫోన్ల ద్వారా బెదిరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు.
WGL: నర్సంపేట పట్టణ కేంద్రానికి చెందిన వడ్లకొండ సాంబయ్యకు సోమవారం సీఎం సహాయ నిధి (CMRF) చెక్కును TPCC సభ్యుడు పెండెం రామానంద్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలు, నిరుపేదలు, ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.