GDWL: నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో సీట్లు సాధించిన జిల్లాకు చెందిన 16 మంది విద్యార్థులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. గతంలో వెనుకబడిన గద్వాల నియోజకవర్గం, ప్రస్తుతం అక్షరాస్యతలో మెరుగైన ఫలితాలు సాధిస్తుండటం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.