KMR: డోంగ్లీ, మద్నూర్ మండలాల్లోని మార్కెట్లో కందుల ధర తగ్గుముఖం పట్టింది. బుధవారం కందులు క్వింటాకు రూ.7,800 ధర పలుకుతోందని అడత్ వ్యాపారులు తెలిపారు. ఒక రోజులో క్వింటాకు రూ.100 ధర తగ్గిందని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి దాదాపు నెల రోజులు కావస్తున్నా రైతులు మాత్రం అమ్మకానికి ఆసక్తి చూపడం లేదు.