E.G: దేవీపట్నం మండలం పూడిపల్లి వద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు బుధవారం గుర్తించారు. నేలకోట రామదుర్గం కొండపై పౌర్ణమి పూజలకు వచ్చే భక్తులు రాత్రి సమయాల్లో అక్కడ ఉండటం ప్రమాదకరమని హెచ్చరించారు. పోచమ్మ గండిని దర్శించుకునే వారు సాయంత్రానికే తిరిగి వెళ్లాలని సూచించారు. కొండల సమీప గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.