NZB: భారత రాజ్యాంగాన్ని రక్షించడమే సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి నిజమైన నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏచూరి తన జీవితాన్ని కార్మిక వర్గ రాజ్యం స్థాపన కోసం అంకితం చేశారని కొనియాడారు.
MHBD: డోర్నకల్ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల కోసం శుక్రవారం ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. మొత్తం 2,02,767 ఓటర్లలో పురుషులు 99,507, మహిళలు 1,03,263 మంది ఉన్నారు. మరిపెడలో 46,478, డోర్నకల్లో 29,088, దంతాలపల్లిలో 26,683, చిన్నగూడూరులో 13,097, కురవిలో 44,216, నరసింహులపేటలో 24,736, సీరోల్లో 18,469 మంది ఓటర్లు ఉన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎస్పీఎఫ్ అధికారుల నిర్లక్ష్యం కట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నెల 9వ తేదీన పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన మహిళ బిడ్డకు జన్మనివ్వగా బిడ్డ చనిపోయాడు. ఆ వెంటనే ఆమె కూడా చనిపోయింది. ఎస్పీఎఫ్ అధికారులు పట్టించుకోకపోవడంతో బంధువులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై సర్వత్రావిమర్శలు వస్తున్నాయి.
MLG: జిల్లా కేంద్రంలో శుక్రవారం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం పార్టీలు మారారని, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ద్రోహులని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.
MDK: విద్యార్థులను క్రమశిక్షణతో మెలిగే విధంగా తీర్చిదిద్దాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అధ్యాపకులకు సూచించారు. ఇవాళ చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఇంఛార్జ్ పాల్గొని విద్యార్థులకు సూచనలు చేశాడు. ఆత్మ కమిటీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సొసైటీ ఛైర్మన్ అయిత రఘురాములు, పరంజ్యోతి పాల్గొన్నారు.
SDPT: మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే డయల్ 100 లేదా 87126 67100కు కాల్ చేయాలని సూచించారు.
KMR: బాన్సువాడ నియోజకవర్గంలో BRS పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. గోవూర్ గ్రామంలో మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల శుక్రవారం సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగు చెందుతున్నారని, అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
BDK: సింగరేణి సంస్థ వ్యాప్తంగా కార్మికుల కోసం నేటి నుంచి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. 2025-26 సంవత్సరానికి గానూ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో ఫుట్బాల్ పోటీలతో ప్రారంభమై, సాంస్కృతిక కార్యక్రమాలతో ముగుస్తాయని అధికారులు వెల్లడించారు.
HYD: 2017లో L&T ఆధ్వర్యంలో నగరంలో మెట్రో ప్రారంభమైంది. ఆ రోజుకు ప్రభుత్వం కంపెనీకి ఇవ్వాల్సిన మొత్తం రూ.3,756 కోట్లు. అయితే, ఇంతవరకు ఆ మొత్తం సర్కారు చెల్లించలేదు. దీంతో ఆ సొమ్ము అంతా వడ్డీతో కలిపి 2020 నాటికి రూ.5 వేల కోట్లకు పెరిగింది. ఈ మొత్తంతోపాటు ప్రభుత్వం ఇవ్వాల్సిన వయబిలిటీ ఫండ్ రూ.254 కోట్ల ఇవ్వలేదు. దీంతో నగరంలో ఇక మెట్రో నడపలేమని L&T చెబుతోంది.
GDWL: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు ‘సేవా పక్వాడా’ పేరుతో పక్షం రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బీజేపీ యువ నాయకురాలు డీ.కే. స్నిగ్ధ రెడ్డి తెలిపారు. శుక్రవారం కేటి దొడ్డి మండలంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మోదీ 11 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తయిందన్నారు.
MNCL: ఉపాధ్యాయులు ఆటపాటల ద్వారా విద్యాబోధన చేయాలని విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని బస్టాండ్ ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శైలజ ఉన్నారు.
RR: మన్సురాబాద్ డివిజన్ కాస్మోపాలిటన్ కాలనీలో ఓపెన్ స్పేస్ బేస్మెంట్ గ్రౌండ్ అభివృద్ధి పనులు ప్రారంభమైనట్లు కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధివృద్ధిలో భాగంగా బోర్ వెల్, చైన్ లింక్ మెష్, గేటు ఏర్పాటు వంటి పనులకు రూ.15 లక్షల నిధులు కేటాయించబడ్డాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాల కోసం వాగ్ధానాలు కాదు.. పనులే నిదర్శనమని అన్నారు.
BHNG: ఆత్మకూరు మండలం కూరెళ్లలోని పల్లె దవాఖానను కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా MLHP డాక్టర్ అశోక్ విధుల్లో లేకపోవడాన్ని ఆయన గమనించారు. కాగా, ఆయన రోజూ సరిగ్గా విధులకు హాజరుకావట్లేదని తెలుసుకున్న కలెక్టర్ వెంటనే MLHPని సస్పెండ్ చేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు.
ADB: ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతంలో పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని, దీంతో దోమలు రాకుండా ఉంటాయని హెచ్ఈవో రవీందర్ సూచించారు. శుక్రవారం నేరడిగొండ మండలంలోని కుప్టి గ్రామంలో ‘డ్రైడే-ఫ్రైడే’ నిర్వహించారు. ఈ క్రమంలో నిల్వచేసి ఉంచిన వర్షపునీటిని శుభ్రపరిచారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వజ్ర కాంత, గ్రామస్థులు పాల్గొన్నారు.
KMM: నేలకొండపల్లి పట్టణ ప్రజల కల నెరవేరింది. గత కొంతకాలంగా సెంట్రల్ లైటింగ్ కోసం ఎదురు చూస్తున్న వారి కళ్ళలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆనందం నింపారు. ఇటీవల కూసుమంచి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెన్నపూసల సీతారాములు దృష్టికి తీసుకువెళ్లగా ఇవాళ పరిష్కరించినట్లు తెలిపారు.