SDPT: భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాల పంపిణీ శనివారం నాడు శ్రీరామకోటి భక్త అధ్యక్షులు రామకోటి రామరాజు గజ్వేల్ మండల పిడిచేడ్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో దగ్గర తలంబ్రాల విశిష్టత వాటి పవిత్రత తెలియజేసి భక్తులందరికి అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. భద్రాచలం రామయ్య కళ్యాణనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 250కిలోల గోటి తలంబ్రాలు అందజేశారు.
WGL: వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారదాదేవి వర్ధన్నపేట మండలంలో పర్యటించారు. భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ అమలవుతున్న ల్యాబర్తి గ్రామాన్ని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించిన భూభారతి సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని రైతులకు, స్థానికులకు చట్టంపై అవగాహన కల్పించారు. వీరి వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
SRD: సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటాచలం క్షేత్రంలో ఈనెల 15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు శనివారం తెలిపారు. ఈ మేరకు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈనెల 15న గురువారం స్వామివారి అభిషేకం, పల్లకి సేవ, అంకురార్పణం, 16న ద్వజారోహణ, శేష వాహన సేవ, 17న శ్రీవారి కళ్యాణం, గరుడ వాహన సేవ, 18న శ్రీ పుష్పయాగం ఉంటుందన్నారు.
WGL: హెరిటేజ్ టూర్లో భాగంగా ఈ నెల 14న వరంగల్ ఖిలాకు ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్నారు. వారి భద్రత కోసం వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ శనివారం కోటను సందర్శించి, ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా సిబ్బంది నియామకం, సుందరీమణులు ప్రయాణించే మార్గంలో భద్రతా చర్యలపై పోలీసు, రెవిన్యూ అధికారులతో చర్చించారు.
KMR: ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యాబోధన చేయడం జరుగుతోందని, తెలంగాణ టీచర్స్ యూనియన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ ముజిబొద్దీన్ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి మండల కొట్టాల్ గ్రామ ఎంపిపిఎస్ పాఠశాల ఆవరణలో మెగా పి. టి. యం. సమావేశము నిర్వహించారు. గ్రామంలోని 5 నుండి 14 ఏండ్ల వయస్సు గల పిల్లలందరు బడిలో చదువుకోవాలన్నారు.
NZB: చందూర్లో రేపటి నుంచి ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి 9గంటలకు ఎల్లమ్మ తల్లి వివాహం, సోమవారం రాత్రి 1గంటకు షిడ ఉత్సవం, మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
kMM: ఉమ్మడి జిల్లా పరిధిలో డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, బీఎస్సీ 2, 4, 6 సెమిస్టర్లు చదువుతున్న విద్యార్థులు సకాలంలో రుసుములు చెల్లించాలన్నారు. ఈనెల31లోగా పరీక్షల రుసుమును చెల్లించాలని ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ డా.మొహ్మద్ జాకిరుల్లా, ప్రాంతీయ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డా.బి.వీరన్న తెలిపారు.
NGKL: అమ్రాబాద్ మండలం మన్ననూర్ నిరంజన్ శావలి దర్గా, లింగమయ్య దేవాలయం వద్ద శనివారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసులు కార్య కర్తలు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
MBNR: నవాబుపేట మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చే తాటి ముంజలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇది వేసవి కాలంలో మాత్రమే లభిస్తుంది. ఎండాకాలంలో ఎంత నీరు తాగిన.. దప్పిక వేయటం పరిపాటే. తాటి ముంజలు తినడంతో వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి. తాటి ముంజలు తినడంతో అనేక లాభాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
KMM: మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడిపల్లి గ్రామంలో ఆరో వార్డులో డ్రైనేజీలో గడ్డి ఎక్కువగా పెరిగి నీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతుంది. దోమలు, క్రిమికీటకాలు చేరి జనావాసాల్లోకి వస్తున్నాయి. కావున మున్సిపల్ కమిషనర్, అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏఐటీయూసీ మధిర మండలం కార్యదర్శి వూట్ల రామకృష్ణ శనివారం డిమాండ్ చేశారు.
KMM: యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశించారు. పెనుబల్లి మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని, రైతులకు ఎటువంటి కోతలు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 12న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా ఉంటుందని శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ స్వామి తెలిపారు. ఐటీఐలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వివిధ పరిశ్రమలో ఉపాధి, శిక్షణ పొందుటకు అర్హులని తెలిపారు. ఈ అవకాశం అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
GDWL: ఇందిరమ్మ ఇండ్ల పనుల లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గద్వాల ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం, ధ్యానం కొనుగోలు కేంద్రాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులు పాల్గొన్నారు.
మేడ్చల్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, బస్తీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని స్టాండింగ్ కమిటీ సభ్యుడు జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ భోర్ఖడే కలిసిన ఆయన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు. స్పందించిన కమిషనర్ అభివృద్ధికి సహకరిస్తారని హామీ ఇచ్చారు.
మేడ్చల్: బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమిస్తున్నానని పశ్చిమ బెంగాల్కు చెందిన మైనర్ బాలికపై(16) అత్యాచారానికి ఓ యువకుడు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఆ యువకుడు ఓంరాజ్ సైని(20)పై ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తిరుపతి రాజు, ఎస్సై నాగేంద్రబాబులు తెలిపారు.