• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘అంగన్వాడీల ఉన్నతీకరణకు చర్యలు’

NRML: అంగన్వాడీల ఉన్నతీకరణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. అంగన్వాడీల అభివృద్ధి, ఉన్నతీకరణ తదితర అంశాలపై బుధవారం సంక్షేమ శాఖ జేడి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అంగన్వాడీలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.

February 19, 2025 / 07:14 PM IST

‘బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి’

NRML: బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. ఇవాళ జిల్లా కన్సాలిటేటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించు వివిధ రుణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు, రైతులకు అందించు రుణాల మంజూరులో ఆలస్యం చేయకూడదన్నారు.

February 19, 2025 / 07:03 PM IST

నరేందర్ రెడ్డిని గెలిపించాలి: ఆడే గజేందర్

ADB: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని బోథ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆడే గజేందర్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇవాళ తాంసీ, తలమడుగు, భీంపూర్ మండలాల కార్యకర్తలతో సమావేశం అయ్యారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.

February 19, 2025 / 06:56 PM IST

కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వర్షిత

NLG: పెద్దవూర మండలం వెల్మగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆడెపు వర్షిత, ఈనెల 9న నాగార్జునసాగర్ బీసీ గురుకులంలో జరిగిన సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కయ్యారు. ఈనెల 20 నుంచి 23 వరకు వికారాబాద్ జరుగు పోటీలలో జిల్లా తరపున పాల్గొననున్నట్లు ఇవాళ పాఠశాల PD లెనిన్ తెలిపారు.

February 19, 2025 / 06:55 PM IST

ఉద్యాన నర్సరీ సందర్శించిన విద్యార్థులు

ADB: జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు ఉజ్వల భారతదేశం కోసం ప్రధానమంత్రి పాఠశాలలు కార్యక్రమంలో భాగంగా అధికారులు విద్యార్థుల కోసం క్షేత్ర పర్యటనలు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా ఇవాళ గుడిహత్నూర్ ప్రభుత్వ మోడల్ స్కూల్, ఉన్నత పాఠశాల, యాపాల్ గూడ విద్యార్థులు ఉట్నూర్ ఐటీడీఏ ఉద్యాన నర్సరీని సందర్శించారు.

February 19, 2025 / 06:50 PM IST

‘ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి’

ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అదిలాబాద్ ఎంపీ జి.నగేష్ కోరారు. ఇవాళ జన్నారం మండల కేంద్రంలో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీల అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమురయ్యలను గెలిపించాలని కోరుతూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రామనాథ్, మండల అధ్యక్షులు మధుసూదన్ ఉన్నారు.

February 19, 2025 / 06:47 PM IST

‘విద్యార్థులకు ప్లేట్లు అందజేత’

ADB: బేల మండలంలోని కరోని (బి) గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసేందుకు విద్యార్థులకు ప్లేట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రూపేష్ రెడ్డి విద్యార్థులకు ప్లేట్లను ఇవాళ అందజేశారు. ప్రైమరీ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.

February 19, 2025 / 05:30 PM IST

పన్ను వసూలు 100% పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

NRML: పన్ను వసూలు వంద శాతం పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ఇవాళ నిర్మల్ పట్టణంలో వివిధ కాలనీలలో జరుగుతున్న పన్నుల వసూలు, వాణిజ్య లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియను మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో పనులు చెల్లించకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 19, 2025 / 05:21 PM IST

‘తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలి’

NRML: వికలాంగుల పెన్షన్ కొరకు తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందిన వారిపై, సర్టిఫికెట్లు మంజూరు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ.. జిల్లాలో వందలకు పైగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొంది అక్రమంగా పెన్షన్ పొందుతున్నారని అన్నారు.

February 19, 2025 / 04:29 PM IST

‘ఉదిత్ రాజుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి’

JN: పాలకుర్తిలో బీఎస్పీ నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అసెంబ్లీ అధ్యక్షుడు ఈదునూరి ప్రసాద్ హాజరై మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత మాయావతిపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉదిత్ రాజుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బహుజన నాయకులను టార్గెట్ చేసిందని విమర్శించారు.

February 19, 2025 / 02:07 PM IST

‘అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’

JN: ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. ఇవాళ జనగామ మండలం యశ్వంతాపూర్ వాగును డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.

February 19, 2025 / 01:59 PM IST

టాలెంట్ టెస్ట్ కరపత్రాల ఆవిష్కరణ

BHPL: ఈనెల 21, 22వ తేదీలలో ఎస్ఎఫ్ఎ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే టెన్త్ టాలెంట్ టెస్ట్ కరపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఎస్ఎఫ్ఎ నేతలు ఆవిష్కరించారు. టెన్త్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్ట్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

February 19, 2025 / 01:54 PM IST

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

BHPL: తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ నూతన భూపాలపల్లి కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిశారు. ఎమ్మెల్యే వారిని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నూతన కమిటీ కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్ ఉన్నారు.

February 19, 2025 / 01:47 PM IST

‘శివాజీ యువతరానికి ఆదర్శప్రాయం’

MNCL: జిల్లాలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్‌లో బుధవారం ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఫిట్నెస్ సెంటర్ సభ్యులు తులా ఆంజనేయులు మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ నేటి యువతరానికి ఆదర్శప్రాయం అన్నారు.

February 19, 2025 / 12:18 PM IST

జాతీయ రహదారులను పరిశుభ్రంగా ఉంచాలి

NRML: జాతీయ రహదారులను పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీఓ గోవర్ధన్ అన్నారు. బుధవారం దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామం సమీపంలోని జాతీయ రహదారులను వారు పరిశీలించారు. జాతీయ రహదారుల మార్గంలో ప్రతినిత్యం శుభ్రంగా ఉంచేలా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. వీరి వెంట పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.

February 19, 2025 / 10:22 AM IST