KNR: చొప్పదండి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నిన్న సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 87 మంది బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. వాతావరణ మార్పుల దృష్ట్యా విద్యార్థినులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమ్యూనిటీ హెల్త్ అధికారి వెంకటస్వామి సూచించారు.
SRD: సిర్గాపూర్ మండలం గోసాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్లాట్ ఫామ్ చుట్టూ పచ్చని గడ్డి తీగలు అల్లుకున్నాయి. ఇవి ప్రమాదకరంగా మారాయని స్థానికులు నేడు తెలిపారు. గాలి వీచినప్పుడు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. అధికారులు స్పందించి విద్యుత్ వైర్లకు అల్లుకున్న గడ్డి తీగలను తొలగించాలని కోరుతున్నారు.
PDPL: గోదావరిఖని ఫైవింక్లైన్కు చెందిన విద్యార్థిని కైలాస మోనా AIలో బంగారు పతకం సాధించింది. హుజూరాబాద్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఈమె బీటెక్(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్) విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్కు ఎంపికయ్యింది. త్వరలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మోనా ఈ బంగారు పతకాన్ని అందుకోనుంది.
NLG: చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ, పులిహోర విక్రయ కౌంటర్లతో పాటు ప్రసాదాల తయారీ కేంద్రాన్ని నిన్న సాయంత్రం ఈవో మోహన్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో భాగంగా సిబ్బంది ప్రసాద నాణ్యత, పరిమాణాలపై తగు సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణ పరిశుభ్రత నిర్వహణపై శివసత్తులకు అవగాహన కల్పించారు.
MHBD: తొర్రూరు పట్టణ శివారులో సోమవారం జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో అధిక లోడుతో వెళుతున్న లారీలు, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైసెన్సులు, పర్మిట్లు, ఇన్సూరెన్స్, ధ్రువ పత్రాలను పరిశీలించారు. అధిక వేగంతో, ఓవర్ లోడుతో వెళ్లే వాహనాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
HYD: బేగంపేట్ బస్ స్టాప్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ థార్ వాహనాన్ని వెనుక నుంచి హెవీ లోడ్తో వస్తున్న ట్రక్ ఢీకొట్టింది. ఈ ధాటికి థార్ వాహనం వెనుక భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NRPT: గుండుమాల్ అంగన్వాడీ-1 కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. కేంద్రంలో పరిశుభ్రత లేకపోవడం, తగినంత వెలుతురు లేని విషయంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారులు ఉండే ప్రదేశాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇకపై కేంద్రాలను సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
MBNR: పానగల్ మండలంలో ఇవాళ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, జెడ్పీటీసీ రవికుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఐకేపీ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆయన మాధవరావుపల్లిలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం చేసి, మాధవరావుపల్లి – శాఖపూర్- కదిరపాడు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.
MBNR: పానగల్ మండలంలో ఇవాళ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, జెడ్పీటీసీ రవికుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఐకేపీ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆయన మాధవరావుపల్లిలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం చేసి, మాధవరావుపల్లి – శాఖపూర్- కదిరపాడు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.
VKB: వికారాబాద్ పట్టణంలోని ప్రియదర్శిని వృద్ధాప్య హోమ్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి బృందంతో కలిసి వృద్ధులకు వైద్య సేవలు అందించారు. ప్రతి నెల ఓల్డ్ ఏజ్ హోమ్ లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. వృద్ధులు మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకొవాలని తెలిపారు.
NRPT: ఎస్పీ హెడ్ క్వార్టర్స్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీనివాసులు హెడ్ కానిస్టేబుల్గా ఉద్యోగోన్నతి పొందారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఎస్పీ వినీత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగోన్నతులు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని, అదే సమయంలో బాధ్యతలను మరింత పెంచుతాయన్నారు.
GDWL: గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ వెహికల్ పార్కింగ్ ప్రదేశంలో సోమవారం సుమారు 40 సంవత్సరాల వయస్సు గల ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తు పడితే, వెంటనే గద్వాల్ టౌన్ ఎస్సై ఫోన్ నంబర్ 87126 70297కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
WGL: నర్సంపేట (M)లోని రాజుపేటపల్లె గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖాన ప్రారంభం కోసం స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. భవనం నిర్మాణ పనులు పూర్తయ్యి నెలలు గడిచినా, దవాఖానను సేవలోకి తీసుకురావడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్య అధికారులు స్పందించి దవాఖాన ప్రారంభించాలని ప్రజలు కోరారు.
WGL: నర్సంపేట (M)లోని రాజుపేటపల్లె గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖాన ప్రారంభం కోసం స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. భవనం నిర్మాణ పనులు పూర్తయ్యి నెలలు గడిచినా, దవాఖానను సేవలోకి తీసుకురావడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్య అధికారులు స్పందించి దవాఖాన ప్రారంభించాలని ప్రజలు కోరారు.
NRML: దిలావర్పూర్ మండలం న్యూ లోలంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాలలో ఈనెల 22న ఉమ్మడి జిల్లా 18 ఏళ్లలోపు బాలబాలికలకు ఖోఖో జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఖోఖో సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గండ్రత్ ఈశ్వర్ ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ చూపిన వారిని ఉమ్మడి అదిలాబాద్ జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. వారు 44వ రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారన్నారు.