KMR: బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. రామారెడ్డి రోడ్డు నుంచి గుమస్తా కాలనీ వరకు బీసీ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
WGL: ఖిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్లో ఇవాళ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొండా సురేఖను సంఘం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. పద్మశాలీల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నేతలు ఉన్నారు.
HYD: హైదరాబాద్కు భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు. ఆయనకు బేగంపేట ఎయిర్ పోర్ట్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. కాగా, ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్’ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొననున్నారు.
ADB: ఈ నెల 26వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞ రత్నజాడే అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ను ఆహ్వానించారు. డా.అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని చూసి అందరు గర్వపడాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
MBNR: జిల్లాలోని 16వ నంబర్ మద్యం దుకాణానికి ఈ నెల 19న జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రీ టెండర్ నిర్వహించనున్నారు. గతంలో ఈ దుకాణాన్ని దక్కించుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని అధికారులు సస్పెండ్ చేశారు. ఆమె తన లైసెన్స్తో పాటు మద్యం దుకాణాన్ని రద్దు చేయాలని ఆమె వినతి పత్రం ఇచ్చింది. దీంతో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.
WNP: కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం వచ్చినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ అన్నారు. కేతేపల్లి కేంద్రాన్ని సందర్శించిన ఆయన ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతులను కలుపుకొని ధర్నా చేస్తామని హెచ్చరించారు. పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాలను ఇంకా ప్రారంభించకపోవడం విచిత్రమని పేర్కొన్నారు.
ASF: జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఉదయం 11 గంటలకు జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపికను అసిఫాబాద్లోని ఆదివాసీ భవన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 15 నుంచి 29ఏళ్లలోపు వారు ఈ పోటీలలో పాల్గొనవచ్చన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారిని రాష్ట్ర స్థాయి ఉత్సవాలకు పంపిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
MNCL: బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ తిరుమలలోని TTD ఛైర్మన్ బి.ఆర్. నాయుడుని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి తిరుమల దేవస్థానం అభివృద్ధి, భక్తులకు అందించే సేవలు, మౌలిక వసతుల విస్తరణ, తీర్ధప్రసాదాల వ్యవస్థ, విచారణలో ఉన్న ఇతర విధానపరమైన అంశాలపై ఇరువురు చర్చించారు. TTD అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.
KMM: కారేపల్లి మండలం సూర్యతండా గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు SI గోపి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న వారి నుంచి రూ. 23500వేల నగదు, మూడు సెల్ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెప్పారు. ఇద్దరు పరార్ కాగా, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
MHBD: డోర్నకల్ నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధిపై నిర్లక్ష్యం వీడాలని, జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని SFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతి బసు, మధు హెచ్చరించారు. ఇవాళ డోర్నకల్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో 14 మందితో నూతన మండల కమిటీ ఏర్పాటైంది. రాకేష్ అధ్యక్షుడిగా, ఉదయ్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
NLG: కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా ఆయన రచించిన పుస్తకాల ఆవిష్కరణ సభ పోస్టర్ను నకిరేకల్లోని ఇందిరాగాంధీ చౌరస్తాలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్ దర్శి అంబటి చిరంజీవి ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పుస్తకావిష్కరణ సభను ఈ నెల 19న HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
WNP: జిల్లా కేంద్రంలోని పానగల్కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఒక కాలనీలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా సీసీ రోడ్డు మధ్యలో ఉంది. దీని వల్ల కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ప్రమాదాలు జరగక ముందే, సంబంధిత అధికారులు చొరవ తీసుకొని స్తంభాన్ని తొలగించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
MDK: నార్సింగి మండల కేంద్రంలోని కాముని చెరువు సమీపంలో సీజ్ చేసిన ఇసుకను రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ గ్రేసీబాయి తెలిపారు. జిల్లా మైనింగ్ అధికారుల ఆదేశాల మేరకు అక్రమంగా నిల్వ ఉంచిన 15 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్లు వివరించారు. ఆసక్తి గలవారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు.
BDK: పాల్వంచ మండలం జగన్నాధపురంలో కొలువైన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ఈవో రజిని కుమారి తెలిపారు. సెలవు దినం కావడంతో పరిసర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని పెద్దమ్మను దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని బోనాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
KMM: వైరా రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను తీసుకెళ్లి మధిర నియోజకవర్గాన్ని తడుపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వైరా మండలం సోమవరం గ్రామ సమీపంలో ఉన్న మామిడి తోటలో ఆదివారం కమ్మ మహాజన వనసమారాధన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సంక్రాంతి కల్లా ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.