• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

’12 గంటల పని విధానం ఉత్తర్వులను రద్దు చేయాలి’

MNCL: 12 గంటల పని విధానాన్ని వాణిజ్య పరిశ్రమల్లో అమలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానానికి ఇది పూర్తిగా వ్యతిరేకమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో చాంద్ పాషా, మణిరామ్, రాజన్న పాల్గొన్నారు.

July 6, 2025 / 03:59 PM IST

‘బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దాం’

MBNR: బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దామని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో బాబు జగ్జీవన్ రామ్ ఎంతో చురుగ్గా పాల్గొన్నారు అని గుర్తు చేశారు.

July 6, 2025 / 02:21 PM IST

‘ఎరుకలకు ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి’

MBNR: ఎరుకలకు ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని జిల్లా ఎరుకల సంఘం చైర్మన్ వెంకటేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఏకలవ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు.

July 6, 2025 / 02:15 PM IST

రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకురావాలి

SRD: నారాయణఖేడ్‌కు రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. IIIT లో సీటు సాధించిన విద్యార్థులను నారాయణఖేడ్‌లో ఆదివారం సన్మానించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధికంగా నియోజకవర్గం నుంచి విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని చెప్పారు. బాగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.

July 6, 2025 / 11:21 AM IST

త్వరలో ORR వరకు అన్ని ఎలక్ట్రిక్ బస్సులే..!

HYD: త్వరలో అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని RTC బస్సులను పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులుగా ప్రవేశపెట్టనునట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఇప్పటికే గ్రేటర్ HYD పరిధి ఉప్పల్, ఖైరతాబాద్, నారాయణగూడ, కాచిగూడ, సికింద్రాబాద్, ప్యారడైజ్ బేగంపేట సహా అనేక ప్రాంతాలలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణ సర్వీసులు అందజేస్తున్నాయి.

July 6, 2025 / 11:18 AM IST

గుడిమల్కాపూర్ మార్కెట్ తరలింపుకు ఏర్పాట్లు..!

HYD: నగరంలో అతిపెద్ద పూల మార్కెట్ గుడిమల్కాపూర్ మార్కెట్. కానీ..ఇక్కడ ఇరుకైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్ నగర శివారుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పూలు,పండ్లు, కూరగాయల అన్నిటికి వేదికగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం 150 ఎకరాల స్థలం అవసరం ఉందని, అంచనా వేసి అధికారులు భూముల లభ్యత పరిశీలిస్తున్నారు.

July 6, 2025 / 10:54 AM IST

జాతీయ పక్షి నెమలిఅధికారులకు అప్పగింత

PDPL: అల్లూరు గ్రామంలో శనివారం రాత్రి జాతీయ పక్షి నెమలిపై కుక్కలు దాడిచేస్తుండగా స్థానికులు గుర్తించి కాపాడారు. టుటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని జాతీయ పక్షి నెమలిని స్వాధీనం చేసుకున్నారు.

July 6, 2025 / 08:29 AM IST

చేపల ధరలకు రెక్కలు

SRD: సంగారెడ్డి బైపాస్ చౌరస్తాలో ఆదివారం చేపల ధరలకు రెక్కలొచ్చాయి. వివిధ రకాలైన చేపల విక్రయాలు ఊపందుకున్నాయి. వ్యాపారులు కిలో చేపలు రూ.300-400 వరకు విక్రయిస్తున్నారు. ప్రజలు ఉదయం 6 గంటల నుంచే చేపలు కొనడానికి వచ్చారు. దీంతో డిమాండ్ బాగా పెరిగిందని పలువురు అంటున్నారు.

July 6, 2025 / 08:21 AM IST

కండక్టర్ ఉదారత.. పోగొట్టుకున్న డబ్బు అందజేత

జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ తన ఉదారతను చాటుకున్నాడు. జగిత్యాల-కడెం బస్సు శనివారం కడెంకు బయలుదేరింది. తిరిగి జగిత్యాలకు వస్తుండగా బుట్టాపూర్‌లో బస్సు ఎక్కిన దుర్గం శామ్యూల్ అనే వ్యక్తి బ్యాగును బస్సులోనే మర్చిపోయి దిగాడు. గమనించిన కండక్టర్ సుంకరపెల్లి అశోక్ బ్యాగులో రూ.27 వేలు ఉన్నట్లుగా గుర్తించి సంబంధిత వ్యక్తికి సమాచారం అందించాడు.

July 6, 2025 / 08:04 AM IST

రోడ్లపై కేజ్ వీల్స్ తో ట్రాక్టర్లు నడపొద్దు: ఎస్సై చందర్

WGL: బురద దున్నడానికి వినియోగించే కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్లను రోడ్లపై నడపొద్దని ఎస్సై చందర్ తెలిపారు. ఆదివారం వర్ధన్నపేటలో ఆయన మాట్లాడారు. కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్లు నడిపితే రోడ్లు దెబ్బతింటున్నాయని, రోడ్లపై నడుపుతూ పట్టుబడితే మొదటిసారి రూ.10 వేలు, రెండోసారి రూ.20 వేలు జరిమానా, మూడో సారి ట్రాక్టర్ సీజ్ చేస్తామని హెచ్చరించారు.

July 6, 2025 / 07:19 AM IST

‘ఆధునిక సాంకేతిక పట్ల అవగాహన ఉండాలి’

PDPL: ఆధునిక సాంకేతికత పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో జిల్లా కలెక్టర్ శ్రీహర్షతో కలిసి విస్తృతంగా పర్యటించి మంథని జూనియర్ కళాశాల మైదానంలో రూ.35 లక్షల నిధులతో చేపట్టిన సింథటిక్ టెన్నిస్ కోర్టు, రూ.10 లక్షలతో చేపట్టిన చిల్డ్రన్ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

July 6, 2025 / 06:06 AM IST

మహబూబ్‌‌నగర్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రత్యేక రైళ్లు

మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ మీదుగా ఈనెల 9వ తేదీ నుండి సెప్టెంబర్ 25 మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. 07717(తిరుపతి-హీసుర్), 07718(హిసూర్-తిరుపతి), 07653 కాచిగూడ -తిరుపతి, 01654 తిరుపతి -కాచిగూడ, 07219(నరసాపూర్-తిరువన్నామలై), 07220(తిరువన్నమలై-నరసాపూర్)ప్రత్యేక రైలు సర్వీసులు ఉంటాయని రైల్వే అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

July 5, 2025 / 08:15 PM IST

‘ఓపెన్ స్కూల్ విధానం సద్వినియోగం చేసుకోవాలి’

MDK: ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ అన్నారు. మెదక్ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో శనివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ మంది అభ్యాసకులను చేర్చుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకట స్వామి పాల్గొన్నారు.

July 5, 2025 / 08:14 PM IST

‘మాదకద్రవ్యాల నియంత్రణ అందరి బాధ్యత’

NZB: మాదకద్రవ్యాల నియంత్రణ మన అందరి బాధ్యతని భీమ్​గల్​ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్​ సీ. జైపాల్ రెడ్డి అన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ, నివారణపై కళాశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును చిన్నాభిన్నం చేసుకుంటున్నారన్నారు.

July 5, 2025 / 08:11 PM IST

ట్రీపుల్ ఐటీకి ఐదుగురు విద్యార్థులు ఎంపిక

MDK: అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ హై స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ట్రీపుల్ ఐటీ బాసరకు ఎంపికైనట్లు HM రమేష్ తెలిపారు. పాఠశాలకు చెందిన ఇప్ప తేజశ్రీ, అఖిల్, నందు, చాకలి కీర్తన, స్రవంతి ట్రీపుల్ ఐటీకి ఎంపికైనట్లు వివరించారు. ఐదుగురు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

July 5, 2025 / 07:47 PM IST