ADB: సిరికొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా సోమవారం తెలంగాణ సాంస్కృతిక కళాబృందం సభ్యులు కళాజాత ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, మానసిక వ్యక్తిత్వ వికాసం, విద్య ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
MNCL: MGNRES చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం VB-G రామ్ G చట్టాన్ని తీసుకొని రావడాన్ని నిరసిస్తూ CPM తాండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గ్రామీణ భారతాన్ని ఆకలితో చంపే కుట్రగా భావిస్తున్నామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలన్నారు.
GDWL: కష్టాల్లో ఉన్న బాధితుడు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు తక్షణమే న్యాయం అందించినప్పుడే పోలీస్ వ్యవస్థపై ప్రజలకు భరోసా కలుగుతుంది అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్డేలో ఆయన స్వయంగా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు మొత్తం 10 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ASF: కెరమెరి మండలంలోని కొటాపరందోలిలో ఉన్న జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని SP నితికా పంత్ సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా జాతర ఏర్పాట్లను, భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
NGKL: బిజినపల్లి మండల సర్పంచ్ మిద్దె రాములు, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన పాలకవర్గాన్ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ రమణ రావు , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
GDWL: పెరిగిన జనాభాకు అనుగుణంగా అయిజ మున్సిపాలిటీలో వార్డుల విభజన చేపట్టాలి అని బీజేపీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు వీ.లక్ష్మీనారాయణకు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల పారిశుధ్యం కుంటూ పడుతుందన్నారు.
NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామం నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో సోమవారం గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సర్పంచ్, 12 మంది వార్డు మెంబర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ చిరుమర్తి ధర్మయ్య మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి నిరంతరం నిబద్దతతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
NLG: విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా చదువు పట్ల ఆత్మవిశ్వాసం పెంచేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ త్రిపాఠి అన్నారు. ఇవ్వాళ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి ముగిసిన అనంతరం అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న కొందరు విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు బాధ కలిగిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
NLG: దేవరకొండ పెన్షనర్స్ సేవాసదనంలో అధ్యక్షుడు తాడిశెట్టి నరసింహ అధ్యక్షతన అఖిల భారత పెన్షనర్స్ డే-2025 సమావేశం సోమవారం నిర్వహించారు. జిల్లా నాయకులు గాయం నారాయణ రెడ్డి, నూనె రంగయ్య రామలింగం హాజరై మాట్లాడారు. దేవరకొండ పెన్షనర్స్ సంఘం సేవలు అభినందనీయం అన్నారు. అనంతరం 1953లో జన్మించిన 30 మంది పెన్షనర్స్ను ఘనంగా సన్మానించారు.
NLG: మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన నిరుపేదలైన మారగోని స్వామి, రమేష్కు మంజూరైన ఇందిరమ్మ గృహాల నిర్మాణం పూర్తి కావడంతో ఆయన స్వయంగా వెళ్లి రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి, గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
KNR: జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో సమ్మక్క జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
BHPL: మహదేవపూర్ GPలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ రెడ్డి, DCC అధ్యక్షుడు కరుణాకర్ పాల్గొన్నారు. సర్పంచ్ హసీనాభాను-అక్బర్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కరుణాకర్ మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని సద్వినియోగం చేసుకుని నిస్వార్థంగా సేవ చేయాలని సూచించారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుంటుంబతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా పోలీసులు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ జీ.వెంకటస్వామి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులు, సిబ్బందితో కలిసి వెంకటస్వామి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజాసేవ, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
SRCL: సేవ, క్రమశిక్షణ, నైతికతలకు జి. వెంకటస్వామి (కాకా) జీవితం నిదర్శనమని, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. జి వెంకటస్వామి (కాకా) వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా వ్యవహరించారని అన్నారు.