RR: అమెరికాలోని డల్లాస్లో దుండగుల కాల్పుల్లో మృతిచెందిన చంద్రశేఖర్ పార్థివదేహం రేపు ఉదయం ఎల్బీనగర్లోని నివాసానికి చేరుకోనుంది. ఈ సందర్భంగా రేపు ఉదయం రాష్ట్రమంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరిలక్ష్మణ్, ఎమ్మెల్యేలు, నాయకులు అక్కడికి చేరుకొని పార్థివదేహాన్ని సందర్శించి, వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేయనున్నారు.
MBNR: మహబూబ్నగర్ శిల్పారామంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. నిర్మాణ్ ఓఆర్జీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
WGL: GWMC 37వ డివిజన్ పరిధి ఖిలావరంగల్ మండలం తూర్పు కోటలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ-సురేష్ లు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు. గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది, ప్రజలు, తదితరులున్నారు.
KMM: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లస్టర్ స్థాయిలోనే యూరియా పంపిణీ చేస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య తెలిపారు. శుక్రవారం మధిర మండలం మాటూరు రైతు వేదికలో జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. నానో యూరియా, నానో డీఏపీ వాడకం వలన మొక్కకు పోషకాలు ఎక్కువ మోతాదులో అందుతాయని రైతులకు అవగాహన కల్పించారు.
MHBD: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ వేగవంతమైంది. ఈనెలఖరులోగా నియామకాలు పూర్తి చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ పర్యవేక్షణ కోసం వివిధ జిల్లాలకు పీసీసీ అబ్జర్వర్లను నియమించారు. దీనిలో భాగంగా మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ను మేడ్చల్ మల్కాజ్ గిరి పీసీసీ అబ్జర్వర్గా నియమితులయ్యారు.
SRD: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ పరిధిలోని జేఎన్టీయూలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పేర్కొన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ నరసింహ పాల్గొన్నారు.
SDPT: జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలోని శ్రీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ హుండీ కానుకలను దేవాదాయ, ధర్మాదాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. భక్తుల నుంచి వివిధ కానుకల రూపంలో అమ్మవారి హుండీలో డబ్బులు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి 94 రోజులకు గాను రూ.4,36,090లు వచ్చినట్లు ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు.
JGL: కొడిమ్యాలలో ‘మెటాఫండ్ ఫ్రో’ యాప్ ద్వారా ప్రజలను మోసం చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసారు. యాప్లో పెట్టుబడులు పెడితే మూడింతల లాభాలు వస్తాయని, విదేశీ పర్యటనలకు పంపిస్తామని నమ్మించి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కేసులో కస్తూరి రాకేష్ కుమార్, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, వీరబత్తిని రాజును పోలీసులు రిమాండ్కు తరలించారు.
MBNR: జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బిసీ ఐక్యవేదిక నాయకులు 42% బీసీ రిజర్వేషన్ బిల్ హైకోర్టు స్టే పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర నాయకులు రవి ముదిరాజ్ మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యాకే స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలని వారి డిమాండ్ చేశారు. ఈ నిరసనలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పాల్గొన్నారు.
MDK: టేక్మాల్ మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ వాహనాన్ని జిల్లా కోఆర్డినేటర్ రవికుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను తనిఖీ చేశారు, మందుల నిల్వలు పరిశీలించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో స్పందించి వారికి సేవలందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ సురేష్, పైలెట్ ఇసాక్ పాల్గొన్నారు.
MDK: రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామ శివారులోని 881 సర్వేనెంబర్లో ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం గ్రామస్తులు ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుని కొనుగోలు కేంద్రంకు అప్పగించాలని తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన తహసీల్దార్ శుక్రవారం భూమిని స్వాధీనం చేసుకుని బోర్డు ఏర్పాటు చేశారు.
BDK: ఇల్లందు నుంచి నర్సంపేట వరకు పల్లె వెలుగు సర్వీస్ను కొత్తగూడెం మరియు ఇల్లందు డిపో మేనేజర్ S. రాజ్యలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈ సర్వీస్ ప్రతిరోజు రెండు ట్రిప్పులు తిరుగుతుందని ఉదయం 7:00 గంటలకు మరియు 11:45 నిమిషాలకు ఉంటుంది. కనుక ఇల్లందు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని డిపో మేనేజర్ తెలియజేశారు.
WGL: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ హతీరామ్ కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ కానిస్టేబుల్ భార్య కీర్తీకి శుక్రవారం అందజేశారు. ప్రభుత్వ బెనిఫిట్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, ఎస్పీ యాకుబ్ బాబా, తులసి తదితరులున్నారు.
KMM: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం దేవాదాయ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి రామాలయం అభివృద్ధి పనులకు వేగం పెంచాలని, ఆలయ విస్తరణ, ప్రాకార నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
MDK: రామాయంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని అప్పగించినట్లు తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ శివారులోని 1421 సర్వే నెంబర్లు 20 ఎకరాల విస్తీర్ణంలో స్కూల్ నిర్మాణానికి స్థలం కేటాయించి, స్థలంకు సంబంధించిన పత్రాలను డీఈవో డాక్టర్ రాధాకృష్ణకు అప్పగించినట్లు పేర్కొన్నారు.