GDWL: అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా చాకచక్యంగా వ్యవహరించాలి అని జిల్లా ఫైర్ ఆఫీసర్ అశోక్ ఓ ప్రకటనలో సూచించారు. బుధవారం గద్వాలలో ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.
NLG: ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నల్గొండ వైపు వచ్చే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. గురువారం ఉగాది, శనివారం రంజాన్ కావడంతో మధ్యలో శుక్రవారం సెలవు తీసుకుని ఊర్లకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.
PDPL: పర్యావరణన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, HDK యూనివర్సిటీ అసిస్టెంట్ సైంటిస్ట్ కనక జ్యోతి సూచించారు. గోదావరిఖని HDK యూనివర్సిటీ PG కాలేజ్ ఆవరణలో ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ సైంటిస్ట్ కనక జ్యోతి పాల్గొని ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే హానికర ప్రభావాలను వివరించారు.
KMM: రైతాంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట అధ్యక్షులు బాగం హేమంతరావు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని ఈ ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ధోరణి మారకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
MDK: రామాయంపేట మండలం రాయిలాపూర్ శివారులో పాడి గేదెను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం ఎదురుగా పాడి గేదేను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
WGL: భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని “బ్యాండ్ మేళం” చిత్ర యూనిట్ సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చిత్ర యూనిట్కు స్థానిక ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాండ్ మేళం చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని చిత్ర యూనిట్ సభ్యులు కోరారు.
JN: వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎంపీ కడియం కావ్య ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండుగ మన తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే రోజు అని, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంట సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం నిండాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ ప్రతి కుటుంబంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని ఎంపీ ఆకాంక్షించారు.
ASF: జిల్లా కలెక్టర్ కె. హరిత, కేంద్ర నోడల్ అధికారి అమిత్ కటోచ్తో కలిసి పీఎం శ్రీ పాఠశాలల అమలుపై ఐడీవోసీలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీఈవో, ఇతర అధికారులు పాల్గొని క్షేత్రస్థాయి పురోగతిని వివరించారు.
BHPL: మొగుళ్లపల్లి(M) ఇసిపేటలో బుధవారం ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఏ. సునిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగు, ప్రభుత్వ పథకాల పై అవగాహన, శిక్షణ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు ద్వారా స్థిర మార్కెట్, అధిక దిగుబడి, దీర్ఘకాల ఆదాయం లభిస్తాయని, ఉద్యాన శాఖ సబ్సిడీలు, డ్రిప్ ఇరిగేషన్, మినీ కిట్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
JGL: కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో ముస్లింలకు రంజాన్ కానుకలను గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం పంపిణీ చేశారు. రంజాన్ పండుగ వేళ పేద ముస్లింలు అందరితో పాటు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం రంజాన్ కానుకలను పంపించిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ లక్ష్మి, కార్యదర్శి రాజేష్, నాయకులు గంగారాం, నరేష్, రఫీ పాల్గొన్నారు.
HNK: భీమ్ దీక్షను పురస్కరించుకుని ఈనెల 22వ తేదీన కాకతీయ యూనివర్సిటీలో జ్ఞాన ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు జ్ఞానముగ్గుల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నేడు కేయూలో ఆవిష్కరించారు. ఈనెల 22వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమానికి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావాలని నేతలు కోరారు.
MHBD: బయ్యారం మండల కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించి మొక్కజొన్నను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో క్వింటాకు కేవలం రూ.1,600–1,700 మాత్రమే లభించడం వల్ల రైతులు తీవ్ర నష్టంలో ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య తెలిపారు.
SRPT: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు. ఇళ్ల వద్దనే తడి, పొడి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా రీసైక్లింగ్ ప్రక్రియ సులభతరం అవుతుందని అన్నారు. ప్రపంచ రీసైక్లింగ్ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీకి సంబందించిన జమునా నగర్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు.
వికారాబాద్ 15వ వార్డు సాకేత్ నగర్ SIC కార్యాలయం సమీపంలో 15 రోజులుగా డ్రైనేజీ పొంగి రోడ్లపై పారుతోంది. దుర్వాసనతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీకేజీలను అరికట్టి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని వారు కోరుతున్నారు.
BHNG: వలిగొండ మండల కేంద్రంలో ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికాలు చేస్తున్న దాడిని నిరసిస్తూ ప్రపంచ శాంతి ర్యాలీని బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శాంతిర్యాలీకి సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అధ్యక్షత వహించారు. అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతో ఇతర దేశాలతో యుద్ధంను ప్రోత్సహిస్తుందని విమర్శించారు.