HNK: భీమ్ దీక్షను పురస్కరించుకుని ఈనెల 22వ తేదీన కాకతీయ యూనివర్సిటీలో జ్ఞాన ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు జ్ఞానముగ్గుల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నేడు కేయూలో ఆవిష్కరించారు. ఈనెల 22వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమానికి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావాలని నేతలు కోరారు.