KMM: కామేపల్లి మండలం పాత లింగాల గ్రామంలో నూతన సిసి రోడ్డు కు శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి, పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తుందన్నారు.