W.G: మొగల్తూరు మండలం కేపీ.పాలెంలో వీధి కుక్కలు దాడి చేయడంతో 20 మేకలు ప్రాణాలు కోల్పోయాయి. రైతు కొండేటి చినబాబుకు చెందిన మేకల దొడ్డిలోకి ఇవాళ తెల్లవారుజామున కుక్కలు చొరబడి విచక్షణారహితంగా కరిచి చంపేశాయని స్థానికులు తెలిపారు. మృతి చెందిన మేకల విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని సదరు రైతు కోరుతున్నాడు.