NRPT: ధన్వాడ మండలంలోని ధన్వాడ, మంత్రోనిపల్లి, కంసాన్ పల్లి, కిష్టాపూర్ గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరయ్యాయని సర్పంచులు జ్యోతి రామచంద్రయ్య, రవికుమార్, కొండయ్య గురువారం వెల్లడించారు. మంజూరైన నిధులతో గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణకు కృతజ్ఞతలు తెలిపారు.