NLG: కవులు సమాజంలోని ప్రజలను చైతన్యవంతం చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని పేర్కొన్నారు. యువకులు కూడా సాహిత్యంపై ఆసక్తిని పెంచుకోవాలని అన్నారు. నకిరేకల్ లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించి కవులను సత్కరించారు. ఈ సందర్భంగా సమస్యలు, అభివృద్ధిపై కవులు తమ కవితలను వినిపించారు.