NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణం ఖాజా నగర్లోని మైనార్టీ సోదరుడు ఖాదర్ భాషా ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి 50 మంది నిరుపేద కుటుంబాలను గుర్తించి చీరలను అందజేశారు. రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతో పేదవారికి చీరలు అందించడం జరిగిందని ఆయన తెలిపారు.