విజయనగరంలోని ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పైడిమాంబ ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండాలని, కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని బొత్స ఆకాంక్షించారు.