E.G: రంగంపేటకు చెందిన సైకత శిల్పులు దేవిన ధన్యత, సోహిత సోదరీమణులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘ఉగాది పురస్కారం’ అందించింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరిని సత్కరించారు. ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు, శిల్పకళ ద్వారా సమాజ చైతన్యానికి చేస్తున్న కృషిని అభినందించారు