AKP: పాయకరావుపేటలో ప్రతీ ఏటా ఉగాది రోజున జరిగే చిలకల తీర్థానికి వర్షం ఆటంకం కలిగించింది. స్థానిక మంగవరం రోడ్డులో పేరంటాల అమ్మవారి తీర్థం జరిగింది. అమ్మవారిని దర్శించుకున్న వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు పంచదార చిలకలు కొని తీసుకువెళ్లడం ఆచారంగా వస్తుంది. సాయంత్రం తీర్థం ప్రారంభమైన తరువాత చిరు జల్లులు కురవడంతో వ్యాపారులు ఇబ్బంది పడ్డారు.