NDL: పాములపాడు మండలంలోని ఇస్కాల గ్రామానికి చెందిన లీలావతి (30) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ నెల 18న గడ్డిమందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆత్మకూరులో ప్రథమ చికిత్స నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు తెలిపారు.