SRD: నిజాంపేట్ మండల కేంద్రంలో ముస్లింలకు ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నేడు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్స్ అందజేశారు. రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరీమణులను గౌరవించి ఈ తోఫాను అందించినట్లు తెలిపారు. అన్ని మతాలు సమానంగా అందరూ క్షేమంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.