RR: శంకర్పల్లి మున్సిపాల్టీ 5వ వార్డు కౌన్సెలర్ బానూరి కృష్ణ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి పెన్షన్ రాని 20 మంది అర్హులకు ఉగాది పర్వదినాన తన సొంత నిధులతో పెన్షన్ అందజేశారు. ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసే వరకు ఈ సాయం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌన్సెలర్పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.