SRCL: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ముస్లిం మహిళలకు తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ షేక్ సబేర బేగం గౌస్ చేతుల మీదుగా ఈద్ ముబారక్ ఈద్ కా తోఫాలో భాగంగా ముస్లిం పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ కానుకగా అందజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నారాయణపూర్ ఉప సర్పంచ్ మధు సూధన్ పాల్గొన్నారు.