SRD: వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో దోహదపడతాయని కంగ్టి ఎస్సై దుర్గా రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని దెగులవాడి గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక సర్పంచ్ పద్మావతి బసిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రధాన కూడలిలో చలివేంద్రం ఉంటే రహదారిన వెళ్లే వాహనదారులు ఎండలో పనికి వెళ్ళిన వారికి దోహదపడుతుందన్నారు.