HYD: రవీంద్రభారతిలో ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాదా బైనామా భూముల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని ప్రకటించారు. రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతును బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈనెల 22న రైతు భరోసా అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.