MLG: జిల్లా కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క సూచనల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చాంద్ పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ భానోత్ రవిచందర్, నాయకులు తదితరులున్నారు.