WGL: పట్టణ కేంద్రంలోని మడికొండ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జయరాజుకు మంగళవారం సేవారత్న అవార్డు లభించింది. మనం ఫౌండేషన్ డాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జయరాజు రక్తదానం చేస్తూ, ప్రతి నెల ఒక బీద కుటుంబానికి సరిపడా బియ్యం అందిస్తున్నారు. ఆయన సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.
ADB: బోథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై స్థానిక నాయకులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుకు శాలువతో సన్మానించి స్వీట్ తినిపించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు జొన్నలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
MNCL: నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామపంచాయతీ ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డుపై మురికి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాళాలలోని మురికి నీరు రోడ్డుపై నిల్వ ఉండడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని, వాహనదారులు, విద్యార్థులు సైతం జారీ పడుతున్నారన్నారు.
NRML: నిర్మల్ పట్టణంలోని ప్రధాన రహదారుల మధ్యలో ఉన్న మొక్కలకి నీళ్ళు లేక ఇలా ఎండిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. అందమైన పూల మొక్కలు వాటితో పాటు నీడనిచ్చే మొక్కలకి సైతం నీరు లేక ఎండిపోతున్నాయి. నిర్మల్ అంటే కేవలం పన్నులు వసూలు చేయడమే కాదు అంతటి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అని పట్టణవాసులు కోరుతున్నారు.
ADB: ప్రభుత్వ నిషేధిత గంజాయితో యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొందరు గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడి జైలుపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఉట్నూర్ మండలంలోని రాముగూడలో దాడులు నిర్వహించి కుమ్ర సోనేరావు ఇంటి వెనుకాల ఉన్న అరటి పెరడిలో సుమారు 20 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. రైతుపై కేసు నమోదు చేయడమే కాకుండా ప్రభుత్వ పథకాలు రాకుండా కలెక్టర్ ప్రతిపాదించారు.
WGL: గీసుగొండ మండలం నందనాయక్ తండాకు చెందిన ఓ యువతిపై అదే తండాకు చెందిన బదావత్ రవి సోమవారం లైంగిక దాడి చేయబోయినట్లు సీఐ మహేందర్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. విషయం తెలుసుకున్న యవతి కుటుంబ సభ్యులు రవి, అతడి భార్య, తల్లిపై దాడి చేశారు. ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
MBNR: మరికల్ మండలంలో పాలమూరు ఎంపీ డీకే అరుణ పర్యటించనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం కన్మనూరులో జెండా ఆవిష్కరణ చేసి మరికల్ మండల కేంద్రంలో వాల్మీకీ సంఘం సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. మండలంలోని కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
SRPT: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం పుణ్యకార్యమని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గరిణె ఉమామహేశ్వరి, శ్రీధర్ పట్టణ ట్రాఫిక్ ఎస్సై మల్లేష్లు పేర్కొన్నారు. సోమవారం ఉమా శ్రీధర్ల 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కోదాడలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు.
WNP: పెద్దమందడి మండలం జగత్ పల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గౌనికాడి వెంకటేష్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రభుత్వఆసుపత్రికి చేరుకొని వెంకటేష్ను పరామర్శించి ఆరోగ్యపరిస్థితిలను అడిగితెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యులకు నిరంజన్ రెడ్డి సూచించారు.
GDWL: మానవపాడు మండలం తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వెళ్తున్న లారీని వెనక నుండి మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. లారీ ఓనర్ కం డ్రైవర్ షేక్ హుస్సేన్ భాష (56), క్లీనర్ ఈరన్న (58) మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRPT: ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని మంగలి తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు 70 మంది మాజీ సర్పంచ్ లునావత్ నాగరాజు నాయకత్వంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించరు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణకట్ట, వ్రతాలు, యాదరుషి నిలయం, కార్ పార్కింగ్, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.35,49,759 ఆదాయం వచ్చిందన్నారు.
WNP: చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు. రేవల్లి మండలం చెన్నారంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరి మాత విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో సోమవారం నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీమంత్రి మాట్లాడుతూ.. పండుగలు భక్తి భావం,ఐక్యమత్యం పెంపొందిస్తాయన్నారు.
PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి బెల్లంపల్లి సబ్ యూనిట్లో హోంగార్డుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రాజలింగు కుటుంబాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆత్మీయంగా సన్మానించారు. కమిషనరేట్లోని ఆయన కార్యాలయంలో రాజలింగుకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. అడిషనల్ DCP అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ACP రాఘవేంద్రరావు ఉన్నారు.
NZB: దళితులను అవమానించడమే ప్రజా పాలనా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘X’ లో ప్రశ్నించారు. లింగంపేట మండలంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో దళితులపై పోలీసుల ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నం అని కవిత అన్నారు. బట్టలు విప్పి దళితులను అరెస్టు చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.