PDPL: రామగిరి మండలం సెంటినరీ కాలనీ సీ 2 క్వార్టర్స్ వద్ద న్యూమారేడుపాక పోతన కాలనీకి చెందిన కోట చిరంజీవి అనే మీసేవా నిర్వాహకుడు హత్యకు గురయ్యాడు. సెంటినరీ కాలానీలోని ఐకేపీ కార్యాలయానికి వచ్చిన చిరంజీవిపై అక్కడే ఉన్న ముగ్గురు ఇనుప రాడ్, కత్తితో దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఈ హత్య కలకలం సృష్టించింది
KMR: రామారెడ్డి మండలంలోని ఇస్సన్నపల్లి (రామారెడ్డి)లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు దర్శించుకున్నారు.
SDPT: హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని గోదాం గడ్డ బస్తీ దవాఖానను జిల్లా కలెక్టర్ కే.హైమావతి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. మెడికల్ ఆఫీసర్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని సిబ్బంది కలెక్టర్కు తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ.. త్వరలోనే డాక్టర్ వచ్చేలా చూస్తానని, అప్పటివరకు రోగులకు ఓపికగా వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
JN: అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలు, పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్లో అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై శుక్రవారం సమీక్ష నిర్వహించి వారు మాట్లాడారు. సిబ్బంది పనితీరును మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యతను నిరంతరం పరిశీలించాలన్నారు. పిల్లలకు వైద్య పరీక్షలు చేయాలన్నారు.
HYD: అఫ్టల్గంజ్ ప్రాంతంలో కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఈస్ట్ జోన్ టీమ్, స్థానికపోలీసుల సంయుక్తదాడిలో భారీగా ఫైర్ క్రాకర్స్ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.18 లక్షల విలువైన 100 కార్టన్ల ఫైర్ క్రాకర్స్ను సీజ్ చేసినట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా నివాసప్రాంతంలో పేలుడు పదార్థాలను నిల్వఉంచిన శ్యామ్ కుమార్ సుగంధీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
NZB: మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టకూడదని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. ప్రశాంతంగాఉన్న పట్టణ వాతావరణాన్నికలుషితంచేయవద్దని సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
SRCL: జిల్లా ప్లంబర్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించింది. 50% రాయితీతో మందులు అందించి, అవసరమయినవారికి ఉచిత ఆపరేషన్లు అందిస్తామని తెలిపారు. యూనియన్ అధ్యక్షులు ప్రజల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. స్థానికులు ఈ కార్యక్రమానికి చురుకైన స్పందన చూపారు.
MHBD: గార్ల రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ను పొడిగించాలని, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మించాలని, రద్దు అయిన నాగపూర్ ప్యాసింజర్ పునరుద్ధరించాలని కోరుతూ.. రైల్వే ఉన్నతాధికారులకు స్థానికులు శుక్రవారం వినతి పత్రం అందించారు. రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
BDK: భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయానికి నూతన శోభ సంతరించుకోనుంది. ప్రజల మనసుల్లో అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది. పనులు శరవేగంగా చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
KMM: ఖమ్మం జిల్లాలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పీఏ ఒక ప్రకటన విడుదల చేశారు. కూసుమంచి, నేలకొండపల్లి, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం నగరం, తిరుమలాయపాలెం మండలాల్లో మంత్రి పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
BDK: ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించుకుని దాని ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందడమే కాకుండా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వామ్యులవ్వాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పిలుపునిచ్చారు. సమాచార హక్కు చట్టం 2005 అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం IDOCలో సదస్సు నిర్వహించారు.
JGL: మెట్పల్లిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించబడింది. సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు మాట్లాడుతూ..యాంత్రిక జీవితంలో మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం అత్యవసరమని, మానసికంగా ఆరోగ్యంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు.
GDWL: NITI ఫర్ స్టేట్స్’ డేటా ఆధారిత యూజ్ కేస్ పోటీ 2024-25లో గద్వాల కలెక్టర్ సంతోష్ విద్యా రంగంలో 2వ స్థానంలో అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయం తెలుసుకున్న డీఈవో విజయలక్ష్మి, ఏసీఈ శ్రీనివాసులు శుక్రవారం కలెక్టరేట్లో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అవార్డుతో పాటు ప్రభుత్వం నుంచి రూ. లక్ష నగదు బహుమతి లభించిందని కలెక్టర్ తెలిపారు.
MDK: పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లి తండాలో కేతావత్ విజయ్ కుమార్ (32) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. రెండు రోజులుగా దిగులుగా ఉన్న విజయ్ గురువారం ఇంటి నుంచి బయటకు వెల్లి తిరిగి రాలేదు. శుక్రవారం తండా సమీప అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నట్లు కుటుంబీకులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
WGL: వరంగల్కి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ఇటీవల తమిళనాడులో జరిగిన కరాటే మహోత్సవంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి ప్రపంచస్థాయి గౌరవం సంపాదించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆ బాలుడిని వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ అభినందించారు. అద్భుత ప్రదర్శనతో జిల్లాకు, రాష్ట్రానికి పేరు తేవడం గర్వకారణమని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.