• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

BHPL: సీసీఐ కేంద్రాల్లో పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు. BHPL లోని మంజునగర్ కాటన్ మిల్లులో గురువారం సీసీఐ కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర ప్రారంభించారు. క్వింటాకు రూ.8,010 మద్దతు ధర చొప్పున కొనుగోలు చేయాలని సూచించారు. ఎకరాకు 7 క్వింటాళ్ల నిబంధన సడలించి 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని ఆదేశించారు.

November 13, 2025 / 03:23 PM IST

పోలీస్ ఉత్తమ పీఆర్‌వోగా నాగరాజు ఎంపీక

SRD: పోలీస్ ఉత్తమ పీఆర్‌వోగా సంగారెడ్డి జిల్లా పోలీసు పీఆర్‌వో నాగరాజు డీజీపీ శివధర్ రెడ్డి కేతనం మీద హైదరాబాద్‌లోని సిటీ పోలీస్ ఆడిటోరియంలో ప్రశంసా పత్రాన్ని గురువారం ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. వీఆర్‌వోగా శిక్షణ తీసుకోవడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. తన విధులు మరింత సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.

November 13, 2025 / 03:14 PM IST

‘బహుజనుల ఆర్థిక సహాయంతోనే అభివృద్ధి’

GDWL: లోక కళ్యాణం కోసమే ‘జన కళ్యాణ్ దివాస్’ కార్యక్రమం చేపట్టినట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు తెలిపారు. గురువారం ఇటిక్యాల మండల కేంద్రంలో కార్యకర్తలతో కలిసి ఆయన విరాళాలు సేకరించారు. బహుజనుల ఆర్థిక సహాయంతో ఏర్పడిన ప్రభుత్వాలే వారి అభివృద్ధికి దోహదపడతాయని, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.

November 13, 2025 / 03:10 PM IST

ఉపాధి హామీ ప్లానింగ్ ప్రాసెస్ గ్రామసభ

NZB: మోపాల్ మండలం ముదక్‌పల్లిలో ఉపాధి హామీ ప్లానింగ్ ప్రాసెస్ గ్రామసభ ఇవాళ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి 2026 – 27 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టబోయే పనులు గురించి గ్రామ ప్రజలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సూర్య, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.

November 13, 2025 / 03:09 PM IST

డీకే అరుణకు కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు

MBNR: ఎంపీ డీకే అరుణకు గురువారం కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025పై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)లో ఆమెను సభ్యురాలిగా నియమించారు. జమ్మూ కశ్మీర్ పునశ్చరణ సవరణ బిల్లుకు సంబంధించిన అంశాలనూ ఈ కమిటీ పరిశీలిస్తుంది.

November 13, 2025 / 03:08 PM IST

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్: జాయింట్ సీపీ

HYD: రేపు యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని HYD నగర జాయింట్ CP తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

November 13, 2025 / 03:06 PM IST

గంజాయి అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవు: ఎస్సై

MDK: గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి సూచించారు. చేగుంట మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో గురువారం డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, పేలుడు పదార్థాల రవాణా అడ్డుకునేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

November 13, 2025 / 03:06 PM IST

2కే రన్ పోస్టర్ ఆవిష్కరణ

KNR: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 6:30 నిమిషలకు 2K రన్ నిర్వహిస్తున్నట్లు HZB IMA అధ్యక్షుడు డాక్టర్ కనవేన తిరుపతి తెలిపారు. జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ 2K రన్ పోస్టర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. వరల్డ్ డయాబెటిక్స్ డే సందర్భంగా JMKT అంబేద్కర్ చౌక్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

November 13, 2025 / 03:03 PM IST

వికలాంగులకు సదరం యూడీఐడీ క్యాంపులు

పెద్దపల్లి జిల్లాలో సదరం యూడీఐడీ క్యాంపులు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ తెలిపారు. ఈనెల 17, 24, 28, 29 తేదీల్లో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ కేటగిరీల దివ్యాంగులకు క్యాంపులు ఉంటాయన్నారు. హాజరయ్యే వారు పూర్తి వివరాలతో రావాలని సూచించారు. ఎవరైనా డబ్బు అడిగితే తమకు తెలియజేయాలన్నారు.

November 13, 2025 / 03:01 PM IST

శివాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

KMR: ఎల్లారెడ్డి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ నేడు శివాలయాన్ని దర్శించుకుని స్వామివారి దీవెనలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు ఆలయానికి సీసీ రోడ్లు నిర్మాణం అవసరం ఉందని విజ్ఞప్తి చేయగా ఎమ్మెల్యే మదన్ సానుకూలంగా స్పందించి నిర్మాణానికి అవసరమా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

November 13, 2025 / 03:01 PM IST

‘నూతన గ్రంథాలయం నిర్మించండి’

KMM: ముదిగొండ మండలంలో గ్రంథాలయం శిథిలావస్థలో ఉందని స్థానిక నిరుద్యోగ యువకులు ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఈ శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాన్ని తొలగించి నూతన భవనం నిర్మాణం చేపట్టాలని వాపోయారు.

November 13, 2025 / 02:58 PM IST

రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లే..!

NLG: కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారని, రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లేనని శాలిగౌరారం ఎస్సై సైదులు అన్నారు. ఇవాళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజీ మార్గమే రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సమన్యాయం, సత్వర పరిష్కారం జరుగుతుందని పేర్కొన్నారు. ఈనెల 15న నకిరేకల్ కోర్ట్ నందు నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

November 13, 2025 / 02:53 PM IST

రామంతపూర్ అభివృద్ధికి భారీ నిధులు

MDCL: రామంతపూర్ డివిజన్ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరైనట్లుగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి  తెలిపారు. ఇందులో రూ. 3.3 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ కాల్ జరిగినట్లుగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి పరుగులు తీసేలా చూస్తామని పేర్కొన్నారు.

November 13, 2025 / 02:47 PM IST

MGM ఆసుపత్రి‌లో భారీ కుంభకోణం

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్న MGM ఆసుపత్రిలో భారీ కుంభకోణం జరిగింది. అయితే ఇటీవల HIT TV, పలు మీడియాలో వచ్చిన కథనాలకు.. విజిలెన్స్ అధికారులు స్పందించారు. గురువారం డీఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో MGM ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. 2021-2024 మధ్య 30 కోట్ల వరకు కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 13, 2025 / 02:45 PM IST

దాడులు ప్రోత్సహించడాన్ని మానుకోవాలి: రమేష్

ADB: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కాంగ్రెస్ కార్యకర్తలపై నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బత్తుల రమేష్ పేర్కొన్నారు. సోనాల మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో వ్యక్తులపై దాడుల సంస్కృతిని ఎమ్మెల్యే ప్రోత్సహించటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్య యుతంగా ముందుకు వెళ్లాలని సూచించారు.

November 13, 2025 / 02:45 PM IST