JGL: ప్రతి గర్భిణీ ప్రసవానికి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆస్పత్రులల్లో మాత్రమే ప్రసవాలు చేసుకుని ప్రభుత్వాసుపత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని పెగడపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ నరేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో గర్భిణులకు ఏఎన్సీ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
KMR: మున్సిపల్ అథారిటీ లేకుండా అనధికార మ్యాప్ చూపించి చిరు వ్యాపారులను ఆగం చేయవద్దని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నూతన మడిగెలు పూర్తయ్యాకే వారిని తరలించాలని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ ఆనుకుని ఉన్న మడిగెలు ఖాళీ చేసే అంశంపై నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
KMM: డిసెంబర్ 11, 14, 17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని సోమవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. డిసెంబర్ 11న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 9వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 11న ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెల్లడించే వరకు మద్యం విక్రయాలు నిలిపివేయాలన్నారు.
MDK: సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారామయ్య జెండా ఆవిష్కరించారు. సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత, సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్సేన్, జాతీయ కోశాధికారి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి మల్లేష్, మల్లేశం, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
BDK: కూనవరం రోడ్లో ఎస్సై సతీష్ నిర్వహించిన వాహన తనిఖీల్లో 222.966 కేజీల గంజాయి లభ్యమైనట్టు ఎస్పీ రోహిత్ రాజు సోమవారం తెలిపారు. కూనవరం నుంచి భద్రాచలం వైపుగా వెళ్తున్న లారీని ఆపి తనిఖీలు చేయగా ప్రభుత్వ నిషేదిత 110 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1,11,48,300 ఉంటుందని చెప్పారు.
NLG: కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకుల జీపీ పరిధిలోని ఇస్లావత్ తండాకు చెందిన 20 కుటుంబాలు కాంగ్రెస్కు రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. బీఆర్ఎస్ కండువా కప్పి వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. బీఆర్ఎస్తోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే అన్నారు.
HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలోని శివాలయం ప్రాంగణములో గల శ్రీ గణేశ ఆలయంలో ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించనున్నారు. సంకటహర చతుర్ధి సందర్భంగా గణపతి స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నట్లు, ఆలయ కార్య నిర్వహణ అధికారి పార్థ సారధి ఒక ప్రకటనలో తెలియజేశారు. భక్తులు పాల్గొని, గణపతి కృపను పొందగలరని కోరారు.
WNP: ఉప్పరిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నరసింహ గౌడ్ ను గెలిపించుకుంటే ఉప్పరిపల్లిలో ఏ సమస్య ఉన్న వెంటనే పరిష్కరిస్తామని సోమవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. మండలం ఉప్పరిపల్లిలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు ,కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రతి ఒక్కటి గెలిచిన వెంటనే నెరవేరుస్తామని హామీచ్చారు.
SRPT: ఈనెల 14న జరగనున్న స్థానిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడితే. అట్టి అభ్యర్థులు, వారి అనుచరులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మోతే మండల ఎస్సై అజయ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా, న్యాయంగా జరిగేందుకు పోలీసులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.
KMR: ‘అన్నా కడుపు నిండా చాయ్ తాగి నాకు ఓటు వెయ్’ అంటూ భిక్కనూరు మండలం భగీరథపల్లిలో సర్పంచ్ అభ్యర్థి సంతోష్ కుమార్ గుప్తా వినూత్న ప్రచారం నిర్వహించారు. గ్రామంలో చాయి హోటల్లోకి వెళ్లి అక్కడ పలువురికి చాయి అందజేశారు. తనకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలి ఓటర్లను కోరారు.
JN: జాఫర్గఢ్ మండలం తిమ్మంపేటలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు ఇవాళ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కోసం బీజేపీ బలపరిచిన వార్డు మెంబర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్, BJYM నాయకులు శరత్ కుమార్ బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
WGL: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాయపర్తి మండలంలోని కాట్రపల్లి, పాన్య నాయక్ తండాల్లో ఇవాళ నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలు పార్టీకి పట్టం కట్టే దిశగా ముందుకు వెళ్తున్నారు అని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ గెలవబోతుందన్నారు.
NZB: ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామన్నీ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం నా లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థిగా గడ్డమీది లింగం గౌడ్ తెలిపారు. నాపై నమ్మకంతో ప్రజలు అత్యధిక ఓట్లు వేసి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామంలోని మౌలిక సదుపాయాలు కల్పిస్తానని. నా సొంత ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కలిపిస్తానని అన్నారు.
MLG: ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో సోమవారం మంత్రి సీతక్క సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కురుసం సంధ్యారాణి-మహేష్ను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులను కోరారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని, మరింత చేస్తామని హామీ ఇచ్చారు.
WGL: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ వహించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. ఇవాళ కార్యాలయం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించిన ఆమె, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత విభాగాల ఉన్నతాధికారులకు వాటిని అందజేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.