మేడ్చల్: ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి తామునిత్యం అందుబాటులో ఉంటామని బోయినపల్లి సీఎంఆర్ ఉన్నతపాఠశాల డైరెక్టర్ ఎస్కే రెడ్డి తెలిపారు. బోయినపల్లిలోని బాపూజీనగర్ ప్రభుత్వగిరిజన సంక్షేమఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ లాలునాయక్కు సీఎంఆర్ విద్యాసంస్థల అధిపతి సీహెచ్ గోపాల్ రెడ్డి సహకారంతో గిరిజన ఆశ్రమ పాఠశాలకు శుక్రవారం బెంచీలు అందజేశారు.
SDPT: రేపు పిడిచేడ్లోని హనుమాన్ దేవాలయంలో భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం ఉందని శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు. భక్తులందరు పాల్గొనాలని కోరారు. భద్రాచలం కళ్యానానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత సిద్దిపేట గ్రామం భక్తులదే అన్నారు. అందుకే తలంబ్రాలు అందిస్తున్నామన్నారు.
HYD: నిషేధిత విదేశీ సిగరెట్లు అనుమతి లేకుండా విక్రయిస్తున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. టోలిచౌకి మొరాజ్ కాలనీకి చెందిన తాహిర్ అలీ అనే వ్యక్తి తన పాన్ షాప్లో విదేశీ సిగరెట్లు విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి సిగరెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం అతనిని రిమాండ్కి తరలించారు.
SRD: కంది మండలం కలివేముల గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ఏపీఎం సమత శుక్రవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ మేరకు స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వడ్లు తూకం చేసేందుకు గన్ని సంచులు అవసరమని స్థానిక సీసీ లక్ష్మీనారాయణ, రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీవోఏ మల్లేశ్వరి, వీవో ఏ మంగమ్మ ఉన్నారు.
KNR: కరీంనగర్లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ని కలెక్టర్ ప్రమీల సప్తతి మర్యాదపూర్వకం కలిశారు. జిల్లా కలెక్టర్ పమేలా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఈ సందర్భంగా జస్టిస్ సుజయ్ పాల్కి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.
NLG: నేరేడుచర్ల పట్టణంలోని గ్రంథాలయం వీధిలో వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి బంగారపు గొలుసును అపహరించిన మహిళా దొంగను 24 గంటల్లోనే అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు హుజూర్నగర్ సీఐ చరమందరాజు తెలిపారు. శుక్రవారం నేరేడుచర్లలో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
MNCL: మంచి భవిష్యత్తు కోసం చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిద్దామని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం గిరిధర్ అన్నారు. విద్యా శాఖ ఆదేశాల మేరకు గురువారం ఆ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ఉత్తమ విద్యను బోధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్ ఉన్నారు.
MNCL: సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి విజయవాడ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సోదాలు చేయడంపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ మీడియా జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
MHBD: జిల్లా గార్ల మండలం పాత పోచారం గ్రామానికి చెందిన పసుపులేటి నరేష్ (26) ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగించేవాడు. మద్యపానం ఎక్కువైందని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన నరేష్ పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రామయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్కో రియాజ్ పాషా తెలిపారు.
WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీనేత అనిమిరెడ్డి కృష్ణారెడ్డిని శుక్రవారం వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్గా వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వారు తెలియజేశారు
SRPT: ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. శుక్రవారం మునగాల మండలం కలకోవా గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడారు.. ఉపాధి హామీ కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పించాలని ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
BHPL: జిల్లాలో 33 కేవీ లైన్ మరమ్మతుల కారణంగా కాళేశ్వరం సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు శుక్రవారం ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు మహాదేవ్పూర్ అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సమయంలో విద్యుత్ వినియోగదారులు గమనించి, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు
NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 10న రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి సంఘం ఛైర్మన్, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని అన్నారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలు కావాలని డాక్టర్ శివరాం కోరారు.
NGKL: అమ్రాబాద్ మండలంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని శుక్రవారం అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా గిరిజల వికాసం అనే పథకాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా నల్లమలకు వస్తున్నారు.
BDK: దమ్మపేట మండలం గండుగులపల్లిలో సీతారామ ఎత్తు పోతల పథకం పనులను శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. వ్యవసాయ సీజన్కి నీరు అందించాలని, రైతులను ఇబ్బంది పెట్టకూడదని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.