KMR: జన గణన-2027లో భాగంగా కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తన కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ‘స్వీయ గణన’ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ మే 10లోపు వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు తర్వాత వచ్చే 12 అంకెల IDని ఎన్యూమరేటర్లకు అందజేయాలన్నారు. డిజిటల్ గణన ద్వారా సంక్షేమ పథకాల రూపకల్పన సులభతరమవుతుందని పేర్కొన్నారు.
SRD: జడ్పీహెచ్ఎస్ నాగారం పాఠశాలలో ఎస్ఎస్సీ ఫలితాలు శాతం వందకు చేరాయి. మొత్తం 33 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఇందులో వి. నిత్య 539 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, ఎస్. మనోజ్ కుమార్ 524 మార్కులతో ద్వితీయ స్థానం, ఎన్. హారిక 512 మార్కులతో తృతీయ స్థానం పొందారు. పాఠశాల ఉపాధ్యాయులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.
WNP: జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పెషల్ ఆఫీసర్ చెన్నయ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బొచ్చు లెవెల్ ఆఫీసర్లతో సమీక్షించారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో ఓటరు మ్యాపింగ్ 70 శాతం మాత్రమే పూర్తయిందని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
NLG: చిట్యాల పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో సత్తా చాటింది. పరీక్షకు హాజరైన 38 మంది విద్యార్థులూ పాస్ అయ్యారు. వీరిలో జి.సంకీర్తన (548), సాహిన్ (531), శ్రావణి (522), భవాని (520), శివకుమార్ (512), పూజ (507), వందనకుమారి (501) ఉత్తమ మార్కులు సాధించి పాఠశాల పేరు నిలబెట్టారు. వీరిని ఉపాధ్యాయులు అభినందించారు.
BHPL: రేగొండ మండలం కోటవంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు ఘనంగా నిర్వహించారు. వివాహాల అనంతరం 5000 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
MNCL: బెల్లంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాల పదవ తరగతి విద్యార్థినులు 2025-2026 సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు విశేష ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల శ్రమ, తల్లిదండ్రుల సహకారంతో, ఈ ఘన విజయం సాధ్యమైందని పాఠశాల ప్రిన్సిపల్ నీలు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి కొనసాగుతుందన్నారు.
PDPL: అంతర్గం మండలం పరిధిలోని నూతన దారి మైసమ్మ ఆలయంలో నిర్వహించిన దారి మైసమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎమ్. ఎస్ రాజ్ ఠాకూర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అమ్మవారి కటాక్షంతో ప్రజలందరికీ, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.
MBNR: వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు ఇళ్ల భద్రతపై జాగ్రత్తగా ఉండాలని మహబూబ్నగర్ ఎస్పీ డి. జానకి సూచించారు. పిల్లలను చెరువులు, కాలువలకు దూరంగా ఉంచాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు. ఎండల దృష్ట్యా ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు.
WNP: దేశంలో పెట్రోల్ డీజిల్ కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని వనపర్తి జిల్లా సీపీఐ నాయకులు రమేష్ అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం వస్తుందని ముందు తెలిసిన ఇంధనాన్ని నిలువ చేసుకోవడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతతో వినియోగదారులు అల్లాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ, మోష శేఖర్ శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు.
KMM: పెనుబల్లి మండలం గణేషన్పాడు గ్రామంలో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు.
BHPL: రేగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, MLA గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్ పాణి, మండల అధ్యక్షుడు కోయిల క్రాంతి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పార్టీ బలోపేతంపై చర్చించి కార్యాచరణ రూపొందించారు.
MDK: రుణమాఫీ దక్కని రైతుల కోసం మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలో 22,849 మందికి రుణమాఫీ కాలేదని, ప్రభుత్వం కేవలం 47 శాతం మందికే అమలు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపిస్తూ, అన్నదాతలకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.
NRML: జిల్లాలో SSC ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం సాధించిన సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్, DEO కేక్ కట్ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. జిల్లాకు గర్వకారణమైన ఈ విజయానికి శ్రమించిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఖమ్మంలో హమాలీ కార్మికులతో కలిసి మేడేను జయప్రదం చేయాలంటూ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి. లక్ష్మీనారాయణ నినాదాలు చేశారు. బుధవారం కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. 8 గంటల పని దినం, హక్కుల సాధన కోసం కార్మికులు చేసిన వీరోచిత పోరాటాలకు మేడే ప్రతీక అని కొనియాడారు.
సూర్యాపేట: పదో తరగతి ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు ఎస్పీ నరసింహ శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాలు ఎలా ఉన్నా పిల్లలను నిందించవద్దని, తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలని సూచించారు. మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా, ఆత్మవిశ్వాసం పెంపొందించాలని కోరారు. విద్యార్థులు అనాలోచిత నిర్ణయాలకు తావులేకుండా, లక్ష్యాల దిశగా ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు.