కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాలను బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అధికారులు సిబ్బందితో మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా వసతులు సక్రమంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
MULG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉగాది సందర్భంగా ముందస్తుగా ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. తెలుగు విభాగం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ప్రిన్సిపల్ నవీన్ అధ్యక్షత వహించారు. విభాగాధిపతి కె. సంపత్ విద్యార్థులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపి, పండుగ ప్రాముఖ్యతను వివరించారు.
NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని పలువార్డుల్లో నెలకొన్న లో వోల్టేజీ సమస్య పరిష్కరించేందుకు అదనంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాల్గవ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
MNCL: ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను సాధించవచ్చని DAO సురేఖ అన్నారు. బుధవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద ఎంపికైన తాండూర్ మండలం గోపాల్ నగర్ రైతులకు ఆమె అవగాహన కల్పించారు. సేంద్రియ సాగు పద్ధతులను వివరిస్తూ రసాయనిక ఎరువులు లేని ఆహారంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు.
RR: మియాపూర్ డివిజన్ ప్రగతి ఎనక్లేవ్ కాలనీ పార్కులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సందర్శించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను, పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అట్టేపల్లి రామప్రభు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
KMM: తెలంగాణ రాష్ట్రంలో 3,300 ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో అధిక విస్తీర్ణం ఉన్నట్లు ఎంపీ రఘురాం రెడ్డి తెలిపారు. అశ్వరావుపేట, దమ్మపేటలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో కోరారు. రైతులకు సాంకేతిక సహాయం, నాణ్యమైన సాగు, మార్కెట్ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు సముచిత గౌరవం లభిస్తుందని మహబూబ్ నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ అన్నారు. బుధవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని MBNR కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్లో మైనార్టీలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. కులమతాలకతీతంగా ప్రజలంతా కూడా సంతోషంగా పండగలు జరుపుకోవాలని అన్నారు.
MDK: ప్రజలు పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి అన్నారు. పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్లో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని ప్రజలకు పలు సూచనలు చేశారు. కులమతాలకు అతీతంగా సోదరభావంతో పండుగలను జరుపుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సీఐ సూచించారు. పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.
SRD: ఖేడ్ మండలం హనుమంతరావు పేట గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బుధవారం ఆలయ వద్ద ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం శ్రీవారికి అభిషేకం, పూజలు, సాయంత్రం బండ్ల ప్రదర్శన ఉంటుంది. అలాగే రాత్రి శ్రీ మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర పౌరాణిక నాటకం మొదటి భాగం ప్రారంభమవుతుందని ఆలయ ఛైర్మన్ అర్కల అనంతయ్య తెలిపారు.
RR: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు జగన్ అన్నారు. కొత్తూరు మండల నూతన ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన ముంతాజ్ బేగంను సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు జగన్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో వారి సమస్యలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు.
KMM: ఎస్సీ యాక్షన్ ప్లాన్ను పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ డా. శ్రీజ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు జరిగిన సమీక్షలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ క్రింద ఖమ్మం జిల్లాకు రూ.5 కోట్ల 16 లక్షలతో 540 యూనిట్లను మంజూరు చేసిందని తెలిపారు. ఎస్సీ నిరుద్యోగులు మార్చి 24 లోపు ఆన్ లైన్లో నమోదు చేసుకోవాలన్నారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో రంజాన్ తోఫా పంపిణీ నిర్వహిస్తున్నామని తెలిపారు.
VKB: రంజన్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం బంట్వారం మండల కేంద్రంలోనీ మసీద్ దగ్గరలో ముస్లిం మహిళలకు బంట్వారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోచారం యాదగిరి, మాజీ సర్పంచ్ స్వామి, నర్సింహులు, ప్రభాకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
WNP: తెలుగు నూతన సంవత్సర ఉగాది(పరాభవ నామ సంవత్సర) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సుభిక్షం నిండాలని ఆకాంక్షించారు. ఆమె మాట్లాడుతూ పండుగ సందర్భాల్లో అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.
SRPT: నడిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1974-75 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన మిత్రులు తమ సహచరుడు, దివంగత షేక్ మౌలానా కుటుంబానికి అండగా నిలిచారు. బుధవారం మౌలానా భార్యను పరామర్శించి, మానవతా దృక్పథంతో రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత మిత్రులంతా కలిసి ఈ సేవా కార్యక్రమం చేపట్టారు.