MBNR: జడ్చర్ల పట్టణంలో నేటి మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయమయ్యాయి. ఈ సందర్భంలో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి పట్టణంలోని నాగర్ కర్నూలు రోడ్డు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ స్థానిక ప్రజలతో కలిసి జేసీబీపై తిరుగుతూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిలిపివేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమీర్ పేట డివిజన్లోని ఎస్ఆర్ నగర్ పలుకాలనీల అసోసియేషన్ సభ్యులు మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం నిర్మించిన కమిటీ హాల్ భవనం వేలం ద్వారా విక్రయం నిలిపేందుకు అడ్డుకోవాలని కోరారు.
MBNR: నగర కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ల విభజనకు సంబంధించి పారదర్శకత లోపించిందని మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. తమకు అనుకూలంగా ఉండే విధంగా వాటిలో విభజన చేసిందని విమర్శించారు.
JN: ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని దేవుడిని ఆకాంక్షించారు.
WNP: మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి తెలిపారు. క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర రంగాల్లో ప్రతిభ చాటిన 18 ఏళ్లలోపు బాలలు అర్హులని జులై 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
JN: చిలుపూరు మండలం చిన్న పెండ్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఫర్టిలైజర్ షాప్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
HYD: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చందానగర్ ప్రధాన రహదారిలోని సెల్లార్లు నీటమునిగాయి. వేముకుంటలోని పలు ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీలో టీజీ పీఈసెట్ గురువారం ఈవెంట్స్ రెండో రోజు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా విద్యా మండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం, ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ హాజరయ్యారు. ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్ గాల్లో కాల్పులు జరిపి రన్నింగ్ పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.
KNR: చొప్పదండి సాయిబాబా మందిరంలో పౌర్ణమి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ఆలయ కమిటీ నిర్వహించింది. భక్తులు దర్శనానికి పోటెత్తారు. ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ హన్మంతరెడ్డి, నిర్వాహకులు లింగన్న, రాము, లక్ష్మణ్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MNCL: రెవెన్యూ సదస్సులతో రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. గురువారం జన్నారంలోని ఫోన్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ సదస్సులో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు రైతుల నుండి వారు దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పరుగులు పాల్గొన్నారు.
KMM: అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధన అందిస్తుందని మండల స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ముదిగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునః ప్రారంభోత్సవంలో స్పెషల్ ఆఫీసర్ పాల్గొని మాట్లాడారు. తాను చదువుకునే రోజుల్లో అనేక ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
HNK: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో సీఐగా గురువారం ఏం రంజిత్ కుమార్ పదవి బాధ్యతలను చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సత్యనారాయణ రెడ్డిని విఆర్కు అటాచ్ చేయగా వీఆర్లో ఉన్న రంజిత్ కుమార్కి సీపీ సన్ ప్రీత్ సింగ్ సుబేదారి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. నూతన సీఐని పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందించారు
BHPL: భూపాలపల్లిలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో బుధవారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. జనంసాక్షి ఎడిటర్ రహమాన్పై పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ వ్యతిరేక కవరేజ్కు ప్రతీకారంగా అక్రమ కేసు పెట్టినట్లు ఆరోపించారు. ప్రశ్నించే గొంతును అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
భూపాలపల్లి: భూపాలపల్లిలో ఎంఎస్ఓ సంఘం నేతలు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు వేషాల రమేష్ బాబు హాజరై మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్లపై టీఎస్ఎన్పీడీసీఎల్ విధించిన పోల్ టాక్స్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నష్టాల్లో నడుస్తున్న కేబుల్ పరిశ్రమకు ఇది అదనపు భారం అని తెలిపారు. ఆపరేటర్లు బోట్ల రాజు, సురేష్, సతీష్ తదితరులున్నారు.
WGL: రాయపర్తి మండలం మైలారం గ్రామంలో కాంగ్రెస్ నేతలు బుధవారం ముఖ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులున్నారు.