MNCL: ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను సాధించవచ్చని DAO సురేఖ అన్నారు. బుధవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద ఎంపికైన తాండూర్ మండలం గోపాల్ నగర్ రైతులకు ఆమె అవగాహన కల్పించారు. సేంద్రియ సాగు పద్ధతులను వివరిస్తూ రసాయనిక ఎరువులు లేని ఆహారంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు.