KMM: తెలంగాణ రాష్ట్రంలో 3,300 ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో అధిక విస్తీర్ణం ఉన్నట్లు ఎంపీ రఘురాం రెడ్డి తెలిపారు. అశ్వరావుపేట, దమ్మపేటలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో కోరారు. రైతులకు సాంకేతిక సహాయం, నాణ్యమైన సాగు, మార్కెట్ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.