కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో రంజాన్ తోఫా పంపిణీ నిర్వహిస్తున్నామని తెలిపారు.