NLG: నకిరేకల్లో ఉగాది సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయంలో పంచాంగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.