అనంతపురంలోని BJP కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు గురువారం వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. జిల్లా ప్రజలందరికీ బీజేపీ నేతలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.