కృష్ణా: గుడివాడ టిడ్కో గృహ లబ్ధిదారులకు మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 8,904 మందికి ఇళ్లు కేటాయించగా, 950 మందికి ఇళ్ల కేటాయింపు పూర్తయినా రుణాల మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 228 మంది మాత్రమే రుణ సౌకర్యం పొందారున్నారు. మిగిలిన లబ్ధిదారులు ఈ నెల 31 లోపు రుణాలు మంజూరు చేయించుకోవాలన్నారు.