MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధి గోలిపర్తి కోటమ్మ దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించే ఉత్సవాలలో మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు.