KDP: ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం తమ బాధ్యతని వేంపల్లి అగ్నిమాపక కేంద్రాధికారి బి.శివరామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవా పథకం అవార్డు ఆయనకు లభించింది. ఈ గురువారం అగ్నిమాపక కేంద్రంలో సిబ్బంది శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డు మొత్తం విభాగానికి దక్కిన గౌరవమని, భవిష్యత్తులో మరింత సేవలు అందిస్తామని తెలిపారు.