SKLM: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తారు. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం హరిశ్చంద్ర పురం, మందస, పాతపట్నం రైల్వే స్టేషన్లలో పలు రైలు హాల్ట్లను ప్రారంభిస్తారు. సాయంత్రం అలికాంలోని రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్రమంత్రి కార్యాలయం గురువారం ప్రకటనలో తెలిపారు.