TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది వేడుకల సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, పాలకమండలి సభ్యురాలు కోలా వైశాలి దంపతులను ఘనంగా సన్మానించారు. జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోలా ఆనంద్ మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలను చేకూర్చాలని ఆకాంక్షించారు.