NRPT: వరి కోతల సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. మాగనూర్ మండలంలోని పలు గ్రామాల్లో గత 15 రోజులుగా కోతలు కొనసాగుతున్నాయి. కేంద్రాలు లేక రైతులు ధాన్యాన్ని కర్ణాటక మార్కెట్లకు తరలిస్తున్నారు. అక్కడ దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు.