CTR: చిత్తూరు(M) తుమ్మిందపాళ్యం ధనకోటి గంగమ్మ ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తండ్రి, జిజేఎం ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కూటమి నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.