KMM: మధిర శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రతి శుక్రవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగినది. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు దేవిశెట్టి రంగారావు మాట్లాడుతూ.. అన్నిదానాలలో కెల్లా అన్నదానం మిన్న అని, అన్నం పరబ్రహ స్వరూపమని పేర్కొన్నారు.
SRCL: చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పొందటం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లను పంపిణీ చేసి, టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జంబి హనుమాన్ ఆలయం వద్ద శుక్రవారం ఏఎస్సై వెంకట్ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాట్సప్లో వచ్చే లింక్లు తెరవొద్దని, ఏ పోలీస్ అధికారి నేరుగా వీడియో కాల్స్ చేయరని తెలిపారు. ‘డిజిటల్ అరెస్టు’ కాల్స్ వస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల బలహీనతలే సైబర్ నేరగాళ్లకు బలం అవుతున్నాయని పేర్కొన్నారు.
MHBD: నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో తొర్రూరు మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఇవాళ రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ నాయకులు నాగయ్య హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల పంపిణీ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
MNCL: తెలంగాణ రైతు సంఘం చెన్నూరు మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడిగా కుందారం చంద్రన్న, కార్యదర్శిగా బండారు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు నిర్వహించి పరిష్కారానికి పాటుపడతామని తెలిపారు.
SDPT: అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకట్ స్వామి గౌడ్ నిర్వహించారు. నెహ్రు 136 జయంతి పురస్కరించుకొని చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.
ADB: విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలంలో మన్నూర్ పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధి హామీ (జల్ సంచయ్ జన్ బాగిదారి) పథకం అమలులో భాగంగా న్యూట్రీ గార్డెన్, RO వాటర్ ప్లాంట్ ప్రారంభించి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
SRPT: తాము చదువుకున్న పాఠశాలకు పూర్వ విద్యార్థులు కంప్యూటర్ బహుకరించారు. నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004 – 2005 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు 35 వేల రూపాయల విలువగల కంప్యూటర్ను పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవికి ఇవాళ అందజేశారు.
SRCL: చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఇవాళ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్రలేఖనం, పాటలు పాడడం, నృత్యాలు చేయడంతో పాటు బెలూన్స్తో చేసిన జోకర్ బెలూన్ మ్యాన్తో సరదాగా ఆడుతూ పాడుతు గడిపారు.
KMM: వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మిరప పంటకు వేరు కుళ్ళు వ్యాధిపై రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పాలేరు ఉద్యానవన శాఖ అధికారి అపర్ణ ఇవాళ తెలిపారు. పంటకు ఎక్కువ నీటి తడులు ఇవ్వకుండా నియంత్రించాలన్నారు. వ్యాధి నివారణకు ట్రైకోడర్మా విరిడే, సూడోమోనస్ కలిపిన ద్రావణాన్ని పాదుల్లో తడపాలని రసాయనాలు పిచాకారి చేయాలని సూచించారు.
NLG: ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) మండల కమిటీ ఆధ్వర్యంలో, సీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాలినికి శుక్రవారం వినతి పత్రం ఇచ్చారు. ఆశల వివిధ డిమాండ్లపై నవంబర్ 17న జరిగే ధర్నాకు వెళ్ళుటకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశాల సమస్యలపై డిఎంహెచ్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు.
MBNR: ట్రాక్టర్ కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలోని సూరారం గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బిక్షపతి (53) సూరారం వాగు నుంచి ఇసుకను తీసుకుని ఫరూక్ నగర్ మండలంలోని చౌలపల్లి గ్రామానికి తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని స్ధానిక ఆసుపత్రికి తరలించారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని MLC దండే విఠల్ నివాసంలో బెజ్జూర్ గ్రామపంచాయితీ మాజీ ఉప సర్పంచ్, మాలి సంఘం నాయకులు నికాడి బాబూరావు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై శుక్రవారం ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా MLC వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని MLC కోరారు.
కరీంనగర్లోని మానేరు విద్యాసంస్థలలో, మానేరు హగ్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఇవాళ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణాలను అందంగా అలంకరించారు. విద్యార్థులకు పాఠశాలలో స్వాగతం పలుకుతూ తరగతి గదిలోకి ఉపాధ్యాయులు ఆహ్వానించారు.
BHPL: గ్రంథాలయాలు సమాజానికి జ్ఞాన దీపాలని, ప్రతి ఒక్కరూ వచ్చి విజ్ఞానం పొందాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 58వ గ్రంథాలయాల వారోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సెల్ఫోన్ అతిగా వాడితే అనారోగ్యాలు, అనవసర ఆజ్ఞానం వల్ల జీవితం అదుపు తప్పుతుందని హెచ్చరించారు. ఈ కర్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, సిబ్బంది పాల్లొన్నారు.