BHPL: కాటారం మండలం దామెరకుంటలో ఉపాధి హామీ కూలీల ఐడెంటిఫికేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్ వినోద్ కుమార్ తెలిపారు. జాబ్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరి ఫొటో ఐడెంటిఫికేషన్ చేస్తున్నామని, ఇప్పటి వరకు 70% పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. జాబ్ కార్డు కలిగిన వారంతా తమ ఫొటో ఐడెంటిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.
రంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి తెలిపారు. పట్టణ ప్రాంతంలో 1,99,967 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 2,20,944 మంది చిన్నారులు ఉన్నారని, 0-5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆమె పేర్కొన్నారు.
KMM: ముదిగొండ మండలం పెద్ద మండవ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బైక్ను ఇసుక ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో పెద్దమండవకు చెందిన గొర్రె మచ్చు సనా(9), పేరం ప్రవీణ్ (14), అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మరో వ్యక్తి సాయికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రి కి తరలించారు.
JN: రఘునాథపల్లి మండలం బాంజీపేట గ్రామంలోనిలో లెవెల్ కల్వర్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీజన్ కావడంతో పత్తి, వరి ధాన్యాలను తరలించడానికి ఇబ్బంది కలుగుతుందని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలన్నారు.
MHBD: పెద్దవంగర మండలం గంట్లకుంట తండా శివారు రామోజీ తండాలోని అంగన్వాడి కేంద్రం చుట్టూ మురుగు నీరు నిలిచిపోయింది. దీంతో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంగన్వాడి కేంద్రం చుట్టూ నీరు నిలవకుండా పనులు చేపట్టాలని కోరుతున్నారు.
KMM: గ్రీస్లోని హాస్పిటాలిటీ, సేవా రంగాలలో 1,000 విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపారు. హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా/డిగ్రీ ఉన్నవారు, ప్రభుత్వ అనుమతితో నైపుణ్య ధ్రువీకరణ పొందిన అభ్యర్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగలవారు తమ రెజ్యూమ్లను tomcom.resume@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు.
KMM: నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నన్నట్లు మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని సంబంధిత అధికారులు గమనించి సకాలంలో హాజరు కావాలని కోరారు.
HYD: బాణాసంచా దుకాణాల నిర్వాహకులు భద్రత ప్రమాణాలు పాటించాలని డీసీపీ శిల్పవల్లి అన్నారు. శుక్రవారం బాణాసంచా దుకాణాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసేవారు 15వ తేదీలోపు పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని, ఎలాంటి సంఘటనలు జరగకుండా దుకాణాల నిర్వహణ జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
VKB: భారత్ గ్యాస్ వినియోగదారులందరూ తప్పనిసరిగా e-KYC పూర్తి చేసుకోవాలని MPDO రామకృష్ణ తెలిపారు. కుల్కచర్లలో ఇంకా చాలా మందికి e-KYC పెండింగ్లో ఉందని అన్నారు. అక్టోబర్ 31లోగా ఆధార్ కార్డుతో భారత్ గ్యాస్ ఏజెన్సీకి వచ్చి లేదా BPCL యాప్ లింక్ ద్వారా e-KYC ప్రక్రియను పూర్తి చేయవచ్చని సూచించారు. డెలివరీ బాయ్ ద్వారా కూడా ఈ సేవను పొందవచ్చని పేర్కొన్నారు.
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లిక్కర్ పంపిణీ కట్టడికి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రలోభాల కట్టడానికి కలిసికట్టుగా పనిచేయాలని, అన్ని శాఖల పరస్పర సమన్వయంతో ప్రలోభాలను కట్టడి చేయాలని సూచించారు.
ADB: భోరజ్ మండలంలోని పౌజ్పూర్ గ్రామంలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. గత మూడు నెలలుగా డ్రైనేజీలు పూడిక తీయకపోవడంతో, రోడ్లమీద నుంచి మురుగునీరు ప్రవహిస్తుందని గ్రామస్తులు తెలిపారు. పలుసార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని వాపోయారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ పూడిక తీయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గమ్మ గుడి శనివారం వరద స్వల్పంగా కొనసాగింది. ఎగో ప్రాంతమైన సింగూర్ ప్రాజెక్టు నుంచి ఒక గేట్ ద్వారా 12,000 క్యూసెక్కులు దిగువకు వదలడంతో ఆలయం ఎదుట ఉన్న వంతెనకు తాకి ప్రవహిస్తున్నాయి. అమ్మవారి గుడి ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతోంది.
KMR: జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని జిల్లా SP రాజేష్ చంద్ర హెచ్చరించారు. శుక్రవారం 42 మందికి జైలు శిక్ష, జరిమానాలు విధిస్తూ న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారన్నారు. దేవునిపల్లి, కామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి పరిధిలోని 8 మందికి ఒక్కొక్కరికీ 1 రోజు జైలు శిక్ష, వెయ్యి చొప్పున ఫైన్ విధించారు.
వనపర్తి జిల్లాలోని చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో పిర్ల చావిడిలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను శుక్రవారం చాకచక్యంగా పట్టుకున్నందుకు జిల్లా పోలీసులకు జిల్లా ఎస్బీ రావుల గిరిధర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో క్యాష్ రివార్డును అందజేశారు. నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ చూపించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్సీ అభినందిస్తూ క్యాస్ట్ రివార్డ్ అందించారు.
జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్లో నిన్న నార్కోటిక్ డాగ్, బీడీ టీం, పోలీసు సిబ్బందితో కలిసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. సీఐ పీ. కరుణాకర్ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ బారినపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ తనిఖీలు పట్టణంలో రద్దీగా ఉండే కొత్త బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో జరిగాయి.