KMM: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ అన్నారు. సత్తుపల్లి ద్వారకపూరి కాలనీ రోడ్డులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. అనారోగ్యంతో బాధపడే వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తారన్నారు.
KMM: మధిర మండల పరిధిలోని దేశాన్ని పాలెం గ్రామంలో గల శ్రీ కోదండరామ స్వామి వారి దేవాలయంలోని హుండీని శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది. దీంతో శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన దేవాలయ నిర్వాహకులు విషయం తెలుసుకొని మధిర పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు.
MBNR: జడ్చర్ల పట్టణంలోని 7వ వార్డు బూరెడ్డిపల్లిలో మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ రూ.4 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులను శనివారం మున్సిపల్ ఛైర్పర్సన్ కోనేటి పుష్పలత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఉమాదేవి, మల్లె బోయినపల్లి సింగిల్ విండో ఛైర్మన్ పడాల మల్లేశ్, వార్డు అధ్యక్షుడు కరుణాకర్, వెంకటేశ్ కాలనీవాసులు పాల్గొన్నారు.
BHPL: టేకుమట్ల మండలానికి మంజూరైన 245 కుట్టుమిషన్లు ఎన్నికల కోడ్ కారణంగా ఏడాదిన్నరగా పంపిణీ కాకుండా నిలిచిపోయాయి. అప్పటి BRS ప్రభుత్వ హయాంలో వీటిని మంజూరు చేశారు. కొంత పంపిణీ జరిగినా, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ మిషన్లు తుప్పు పట్టే స్థితిలో ఉన్నాయని, వెంటనే పంపిణీ చేయాలని శనివారం లబ్ధిదారులు కోరుతున్నారు.
KMM: ఖమ్మంలో మున్సిపల్ శాఖ అధికారులు కుక్కలను పట్టుకుని దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 19వ డివిజన్లో వీధికుక్కల బెడదకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు, ప్రజల నుంచి వినతులు రావటంతో స్పందించిన కాంగ్రెస్ కార్పొరేటర్ చామకూరి వెంకటనారాయణ, మున్సిపల్ అధికారులను పిలిపించి కుక్కలను ఇక్కడి నుంచి తరలించాలని సూచించారు.
HNK: పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శాయంపేట మండలంలోని 23 మంది లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, నేతలు ఉన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా చేపట్టనున్న విశాలమైన రహదారుల నిర్మాణానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ శనివారం ప్రకటనలో కోరారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అన్నారు. ఇరుకు రోడ్లు విశాలంగా అభివృద్ధి చెందితే రవాణా కష్టాలు తొలగిపోతాయన్నారు. శంకుస్థాపన జరిగిన రోడ్లు త్వరగా పూర్తి చేస్తామన్నారు.
NGKL: లింగాల మండలం అప్పాపురికి చెందిన తోకల పెద్ద మల్లయ్య అటవీ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నాలుగు రోజులుగా అధికారులు, కుటుంబ సభ్యులు అడవిలో వెతికినా ఆచూకీ దొరకడం లేదు. అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని శనివారం కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
KMR: తెలంగాణ యూనివర్సిటీ సహకారంతో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను PHD అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రొఫెసర్ రేవతి తెలిపారు. ఎకనామిక్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, సోషల్ వర్క్, పొలిటికల్ సైన్స్, కామర్స్ తదితర విభాగాల్లో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 31 చివరి తేదీ అని పేర్కొన్నారు.
MHBD: పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ ఘటనలో తొర్రూరు మండలం మడిపల్లి వాసి మృతిచెందాడు. మోత్కూరి అఖిల్ 2ఏళ్ల నుంచి ఈ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందారు. అయితే మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో DNA పరీక్షలకు పంపించి అఖిల్గా నిర్ధారించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.
GDWL: వడ్డేపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బోయ నాగరాజు శనివారం కార్యకర్తలతో సమావేశయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయన మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా ఉపకార వేతనాలు ఆలస్యం కావడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని వాఖ్యానించారు.
MNCL: ఈనెల 6న మొహర్రం పురస్కరించుకొని సింగరేణి కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు సింగరేణి యాజమాన్యం శనివారం ప్రకటనలో తెలిపింది. మంచిర్యాల జిల్లాలో ప్రతి సంవత్సరం కార్మికులు, వారి కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో మొహర్రం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని యాజమాన్యం పేర్కొంది. ఇందుకోసం సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.
WGL: వర్ధన్నపేట మండలంలోని కొత్తపెల్లి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. హెచ్ఎం, ఉపాధ్యా యులు ఉండే ఆఫీసును సైతం తరగతి గదిగా మార్చి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఆరుబయటే క్లాసులు చెబుతూ కాలం వెల్లదీస్తుండగా, వర్షాలు కురిస్తే ఒకే గదిలో రెండేసి క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు.
ASF: కాగజ్ నగర్ పట్టణం ESI శిథిలావస్థకు చేరింది. దీంతో కూల్చివేయాలని ఉత్తర్వులు కూడా వచ్చాయి. ప్రభుత్వం ESI కార్పొరేషన్ ఆస్పత్రికి స్థలం కేటాయించకవడం, నిధులు మంజూరు చేయకపోవడంతో ఇంకా శిథిల భవనంలోనే కొనసాగుతోంది. దీంతో కార్మికులకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. రామగుండం తరలించేందుకు సన్నాహాలు చేస్తుండడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
WNP: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఈ నెల 13లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని శుక్రవారం డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. ఆసక్తి కలిగిన ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జులై 13లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.