• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అంబులెన్స్‌లో ఈఎంటీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల జిల్లాలోని 108 అంబులెన్స్‌ల్లో ఈఎంటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా 108 మేనేజర్ యశోద ఐలయ్య తెలిపారు. ఎంఎల్టీ, ఏఎన్ఎం, డీఎంఎల్టీ, బీ-ఫార్మసీ, నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 23న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆస్పత్రి సమీపంలోని 108 కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.

March 19, 2026 / 07:15 AM IST

‘రాష్ట్రంలో గూండారాజ్యం నడుస్తుంది’

NLG: రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. నల్లగొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను బుధవారం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

March 19, 2026 / 07:10 AM IST

‘సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలి’

PDPL: సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఢిల్లీలో సీఎమ్పీఎఫ్ కమిషనర్ సజీశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్వల్ప పెన్షన్‌తో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్.. నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

March 19, 2026 / 07:05 AM IST

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడితే చర్యలు: కలెక్టర్

ASF: గృహ అవసరాలకు కేటాయించిన LPG సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు. జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని, అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించే వారిపై రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారుల బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తాయని స్పష్టం చేశారు.

March 19, 2026 / 07:03 AM IST

రైలు ప్రమాదంలో జిల్లా వాసి మృతి

BDK: వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఇంటికన్నె-నెక్కొండ మధ్య రైలు నుంచి జారిపడి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన పెంటయ్య (48) మృతి చెందారు. మృతుని సెల్ ఫోన్ సిమ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు జీఆర్పీ సీఐ సురేందర్ బుధవారం తెలిపారు. రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయారు.

March 19, 2026 / 07:02 AM IST

జిల్లా ప్రజలకు ప్రముఖుల ఉగాది శుభాకాంక్షలు

NZB: జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీ.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.

March 19, 2026 / 07:01 AM IST

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

KMR: ఉగాది ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. కొత్త ఆశలు, ఆశయాలతో ప్రారంభమయ్యే ఈ నూతన సంవత్సరం ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరారు.

March 19, 2026 / 07:01 AM IST

మనస్థాపంతో గడ్డి మందు తాగిన యువతి

KMM: ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానన్న భయంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లరుపల్లికి చెందిన భవాని పీజీ పూర్తి చేసి, గత కొంతకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. రెండేళ్లుగా సరైన నోటిఫికేషన్లు రాకపోవడం, ఉద్యోగం వస్తుందో లేదోనన్న ఆందోళనతో నిన్న మనస్తాపం చెంది గడ్డిమందు తాగింది. పూర్తి సమాచారం తెలియల్సి ఉంది.

March 19, 2026 / 06:56 AM IST

గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులు అరెస్టు

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని బోడాగుట్ట వద్ద పోలీసులు గంజాయి సేవిస్తున్న నలుగురిని పట్టుకున్నారు. బుధవారం రాత్రి ఎస్సై పస్తం శ్రీనివాస్ సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడిలో 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని. జన్ను ప్రణీత్ కుమార్, కొత్తూరు భాను ప్రసాద్, జంపాల లక్ష్మణ్, ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

March 19, 2026 / 06:44 AM IST

రేషన్ బియ్యం పట్టివేత.. మహిళపై కేసు నమోదు

HNK: హన్మకొండ నగరంలో పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్టు సమాచారం రావడంతో బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అంబాల ప్రాంతంలో ఒక మహిళ వద్ద సుమారు రూ. 35,000 విలువైన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి కేయూ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎసీపీ టాస్క్ ఫోర్స్ మధుసూదన్ తెలిపారు.

March 19, 2026 / 06:44 AM IST

మేడిపల్లిలో వెల్లివిరిసిన మత సామరస్యం

KMR: గాంధారి మండలం మేడిపల్లిలో మత సామరస్యం వెల్లివిరిసింది. మసీదు కమిటీ తరఫున బుధవారం సాయంత్రం హనుమాన్ మాలధారులకు రామాలయంలో భిక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం సోదరులు కలిసి పూజలు చేశారు. భారతదేశం సర్వమత సమ్మేళనమని, అందరూ ఐక్యంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాలధారులు, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

March 19, 2026 / 06:42 AM IST

రంజాన్ మాసం శాంతికి ప్రతీక: సూర్య

MHBD: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కొత్తగూడ మండల కేంద్రంలోని మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకులు కుంజా సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

March 19, 2026 / 06:38 AM IST

‘ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి’

JGL: ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచి, పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజా గౌడ్ ఆదేశించారు. బుధవారం ఎంపీడీవోలు, ఏఈలు, ఉపాధి హామీ సిబ్బందితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. పనులు పూర్తయిన వెంటనే బిల్లులను ఆన్‌లైన్‌లో జనరేట్ చేయాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయించాలని సూచించారు.

March 19, 2026 / 06:35 AM IST

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్య శారద ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నూతన ఆశలు, అభివృద్ధికి నాంది పలికే పర్వదినమని పేర్కొంటూ ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు.

March 19, 2026 / 06:35 AM IST

సాగునీరందించి పంట పొలాల‌ను కాపాడాల‌ని రైతుల నిర‌స‌న‌

SRPT: సాగునీరు అందక చివరి భూముల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, నల్లబండగూడెం, ద్వారకుంట, రెడ్లకుంట గ్రామాల రైతులు ఆర్కే మేజర్ కాలువల్లోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి వంతుల వారీగా నీరు విడుదల చేస్తున్నారని, అయితే ఆ నీరు చివరి ఆయకట్టు వరకు చేరడం లేదని వాపోయారు.

March 19, 2026 / 06:35 AM IST