• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

నారాయణపేట: నారయణపేట మండలం అప్పంపల్లి మెడికల్ కళాశాల వద్ద ఈనెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో మంగళవారం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పరిశీలించారు. సభ స్థలం, వేదిక, పార్కింగ్ స్థలాలను పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు.

February 18, 2025 / 07:19 PM IST

అథ్లెటిక్స్‌లో జిల్లా విద్యార్థికి బంగారు పతకం

నాగర్ కర్నూల్: హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గోరిట గ్రామానికి చెందిన పి అభిషేక్ అండర్-20 ట్రిపుల్ జంప్ విభాగంలో స్వర్ణ పథకం సాధించారు. అతని విజయాన్ని అసోసియేషన్ సెక్రెటరీ డాక్టర్ స్వాములు, అసోసియేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.

February 18, 2025 / 06:40 PM IST

నేటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు ఇవాళ వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 181.9292 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కుడి కాల్వకు 10000 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8718 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

February 18, 2025 / 04:42 PM IST

‘బీసీ రిజర్వేషన్ల చట్టబద్దతపై ప్రభుత్వ తీరు సరికాదు’

MNCL: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 డీ6 ప్రకారం స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.

February 18, 2025 / 01:32 PM IST

సమగ్ర కుటుంబ సర్వేకు సహకరిస్తాం: గ్రామస్తులు

NRML: గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిలుపుదల కోరుతూ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను దిలావర్పూర్ మండల కేంద్ర ప్రజలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం రెండవసారి అవకాశం ఇవ్వగా మంగళవారం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మండల తహసీల్దార్ స్వాతిని కలిసి సమగ్ర కుటుంబ సర్వేకు సహకరిస్తామని తెలిపారు. తమ వివరాలు ఇస్తామని పేర్కొన్నారు.

February 18, 2025 / 01:25 PM IST

కేసీఆర్ సతీమణిని కలిసిన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్

MHBD: మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మను నేడు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీలు శోభకు పూలకుండి అందించి ఆమె ఆశీస్సులు అందుకున్నారు.

February 18, 2025 / 01:19 PM IST

ఏరియా ఆసుపత్రిలో త్రాగునీరు కరువు

మంచిర్యాల: బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రిలో RO ప్లాంట్ ఆలనాపాలన కరువైంది. ప్లాంట్ చెడిపోయి నెల రోజులు కావస్తున్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. చల్లటి శుద్ధి జలాన్ని అందించే ఆర్వో ప్లాంట్ సేవలకు ఉద్యోగులు, వైద్య సిబ్బంది రోగులు దూరమయ్యారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి RO ప్లాంట్ బాగు చేయించాలని కోరుతున్నారు.

February 18, 2025 / 01:10 PM IST

ప్రయాణికుల మన్ననలు పొందాలి: డిప్యూటీ ఆర్ఎం

NRML: ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించి వారి మన్ననలు పొందాలని ఆదిలాబాద్ రీజినల్ డిప్యూటీ ఆర్ ఎం ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బస్ డిపోలో ఆర్టీసీ ఆధ్వర్యంలో పవర్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి పవర్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

February 18, 2025 / 01:08 PM IST

వైన్ షాపులో చోరీ

ADB: వారం రోజుల కిందట ప్రముఖ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగిన ఘటన మరువకముందే నార్నూర్‌లో మరో చోరీ జరిగింది. శ్రీనివాస వైన్ షాపులో సోమవారం రాత్రి దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు. దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకున్న యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

February 18, 2025 / 12:43 PM IST

‘ఇంగ్లీష్ విద్యా బోధన మెరుగుపరచాలి’

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని స్కూల్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఇంగ్లీష్ విద్యా బోధన విధానంపై సమావేశం నిర్వహించారు. మండల విద్యాధికారి నాగారం శ్రీనివాస్ ఇంగ్లీష్ విద్యా బోధనలో మెళుకువలపై ఇంగ్లీష్ బోధకులకు పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. విద్యార్థుల అభ్యాసనలో ఇంగ్లీష్ బోధన సామర్ధ్యాలు మెరుగుపరిచి, పటిష్టం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో SA టీచర్లు ఉన్నారు.

February 18, 2025 / 11:15 AM IST

పెద్దగట్టు జాతరకు కొనసాగుతున్న భక్తుల రద్దీ

NLG: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. సూర్యపేటలోని లింగమతుల స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. తమ మొక్కులు చెల్లించుకొని స్వామి కృపకు పాత్రులవుతున్నారు. భారీగా వాహనాలు తరలివస్తుండటంతో అధికారులు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. HYD నుంచి VJWD వెళ్లే వాహనాలను NKP వద్ద దారి మళ్లిస్తున్నారు.

February 18, 2025 / 11:15 AM IST

నేడు మార్కెట్ లో మిర్చి ధరల వివరాలు

WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా తేజ మిర్చి ధర సోమవారం రూ.13,800 పలకగా.. నేడు రూ. 13,600 పలికింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ.16 వేలు ధర రాగా.. ఈరోజు రూ. 16,200 కి పెరిగింది. మరోవైపు 341 మిర్చికి నిన్న రూ.13,500 ధర రాగా ..నేడు రూ .13,400 తగ్గింది.

February 18, 2025 / 11:06 AM IST

‘రెండో రోజు కొనసాగుతున్న కంటి వైద్య శిబిరం’

KMR: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం రెండో రోజు కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు పాఠశాలల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు అద్దాలు వాడాలని సూచిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్లు రవీందర్, లింబాద్రీ ఉన్నారు.

February 18, 2025 / 11:03 AM IST

గగన్ పహాడ్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

మేడ్చల్: రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్ పారిశ్రామికవాడలో మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. గగన్ పహాడ్‌లోని ఓ లారీ మెకానిక్ షెడ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించి స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి  సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది.

February 18, 2025 / 10:31 AM IST

నేటి నుంచి TGCSB షీల్డ్ కాంక్లేవ్

HYD: నేటి నుంచి 2 రోజుల పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో షీల్డ్ కాంక్లేవ్ 2025 జరగనుంది. సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించే ఆవిష్కరణలపై కాంక్లేవ్‌కు సీఎం రేవంత్, పోలీస్ ఉన్నత అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు 1,200 సైబర్ భద్రత నిపుణులు దరఖాస్తులు చేసుకోగా 590 మందిని TGCSB సెలెక్ట్ చేసింది.

February 18, 2025 / 10:26 AM IST