ADB: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఇచ్చోడ మండలం ముఖరా(K) గ్రామంలో రైతులు కాంగ్రెస్ బాకీ కార్డులు పట్టుకొని శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు రూ. 4వేల పెన్షన్ అందజేయాలన్నారు. హామీలను నెరవేర్చకుంటే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని పేర్కొన్నారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్ శాఖ శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. రెండో శనివారం సెలవు దినమైనప్పటికీ, పంచమి తిథి మంచి రోజుగా భావించడంతో ఔత్సాహికులు ఎక్కువగా దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అందుకే సెలవును రద్దు చేసి దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.
NLG: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.శనివారం కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకెపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం రైతుల పక్షాన పోరాడుతుందని ఆయన అన్నారు.
WGL: పర్వతగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు పోస్టింగ్ ద్వారా వచ్చినా, రవాణా ఇబ్బందులతో నగరాలకు డిప్యూటేషన్ వేసుకుని పనిచేస్తున్నారు. దీంతో విద్యార్థుల నిష్పత్తికి ఉపాధ్యాయులు లేక, పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్రమ డిప్యూటేషన్ల పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు చర్యలు తీసుకోవాలని శనివారం కోరారు.
MBNR: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా యువత ప్రపంచ స్కిల్ కాంపిటేషన్లో పాల్గొనాలని జిల్లా ఉపాధి అధికారిణి మైత్రి ప్రియ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. నైపుణ్యాల ప్రదర్శన రెండేళ్లకు ఒకసారి జరుగుతాయన్నారు. 63 విభాగాల్లో నైపుణ్యాలు ప్రదర్శించవచ్చని, అర్హత గల అభ్యర్థులు ఈనెల 15లోగా http://www.skillindiadigital.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
SRPT: కోదాడ ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రయాణికురాలు పోగొట్టుకున్న లక్ష రూపాయల విలువైన ఐఫోన్, రూ.4 లక్షల నగదుతో పాటు మరో ఆండ్రాయిడ్ ఫోన్ను అందజేశాడు. ఇవాళ కోదాడ పట్టణంలో సంబంధిత మహిళలకు పోలీస్ స్టేషన్లో సీఐ ముందు ఇచ్చి నిజాయితీని చాటుకున్నాడు. సంబంధిత కండక్టర్ను కోదాడ డిపో మేనేజర్ శ్రీనివాసరావు అభినందించారు.
MNCL: మందమర్రి ఏరియా KK-OCలో ఆగస్టు చివరి వారంలో విధి నిర్వహణ విషయంలో కార్మిక సంఘాల నేతల మధ్య జరిగిన గొడవలో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. శనివారం SI రాజశేఖర్ ప్రకటన ప్రకారం కోర్టు అనుమతితో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది సింగరేణి చరిత్రలో మొదటి కేసుగా పలువురు పేర్కొంటున్నారు. ఈ ఘటన కేసు వరకు రావడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమంటున్నారు.
JGL: మెట్పల్లి డిపో నుంచి 16న అరుణాచల గిరి ప్రదక్షణకు సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డీఎం దేవరాజు ఓ ప్రకటనలో తెలిపారు. మార్గంలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, 18న అరుణాచలం చేరడం, తిరిగి 19న జోగులాంబ, ముచ్చింతల దర్శనంతో మెట్పల్లికి రాకెయ్యబడుతుంది. పెద్దలకు రూ. 5500, పిల్లలకు రూ. 3760 ఛార్జీలు నిర్ణయించారు.
BHPL: జిల్లా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో CM రీజినల్ కమిషనర్ హరిపచౌరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలను త్వరగా అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పెన్షన్ లావాదేవీలు సీ కేర్స్ పోర్టల్ ద్వారా జరుగుతున్నాయని, కొత్త క్లైమ్స్ కోసం ప్రయాస్ పోర్టల్ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.
సంగారెడ్డి: ధారూరు మండల పరిధిలోని రుద్రారం – నాగసమందర్ గ్రామాల మధ్య కోటపల్లి అలుగు వద్ద కొట్టుకుపోయిన రోడ్డుకు ఆర్ అండ్ బీ రోడ్డుకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. భారీ వర్షాల కారణంగా కల్వర్టు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వెంటనే మట్టి నింపి రోడ్డు వేయడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో వాహనదారులు, గ్రామస్తులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
WGL: జిల్లా కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు నేడు, రేపు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేడు వారాంతపు యార్డు బంద్, రేపు ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రైతులు విషయాన్నీ గమనించి ఈ రెండు రోజులు మార్కెట్కు సరుకులు తీసుకుని రావద్దు అని సూచించారు.
NLG: నార్కట్ పల్లి మండలంలోని గోపలాయపల్లి గ్రామస్తులు, తమ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. గ్రామం చుట్టూ ఉన్న రైస్ మిల్లుల బాయిలర్ల, నుంచి మరియు కంపెనీల నుంచి వచ్చే పొగ వలన ఇంటి పరిసర ప్రాంతాలు నల్లని దుమ్ము, ధూళి కణాలతో నిడిపోతున్నాయి. ఆ పొగతో కూడిన గాలిని పీల్చడం వల్ల తమ ఆరోగ్యాలు త్వరగా చెడిపోయే ప్రమాదం ఉందని వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ASF: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఈనెల 13 నుంచి సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్, DEO దీపక్ తివారి శనివారం ప్రకటనలో తెలిపారు. హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడాలని సూచించారు. జనవరి 9లోగా 100% సిలబస్ పూర్తి చేయాలన్నారు.
VKB: ధారూరు మండల పరిధిలోని రుద్రారం-నాగసమందర్ గ్రామాల మధ్య కోటపల్లి అలుగు వద్ద కొట్టుకుపోయిన రోడ్డుకు ఆర్ అండ్ బీ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. భారీ వర్షాల కారణంగా కల్వర్టు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వెంటనే మట్టి నింపి తాత్కాలికంగా రోడ్డు వేయడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో వాహనదారులు, గ్రామస్తులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
HYD: అమీర్పేటలో గల రెండు మొబైల్ దుకాణాలపై యాపిల్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దుకాణాలు యాపిల్ లోగో, ట్రేడ్ మార్క్లను అనుకరించి, నకిలీ iPhone, iPad, AirPods 2లను విక్రయించడం మేధో సంపత్తి హక్కుల (IPR) ఉల్లంఘనగా కంపెనీ పేర్కొంది. దీనిపై భారతీయ న్యాయ సంహిత (BNS), కాపీరైట్ చట్టం కింద SR నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.