KMM: వాకీ టాకీల వినియోగం ద్వారా వ్యవస్థీకృతంగా డేటాను పొందవచ్చని ఖమ్మం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో 60 డివిజన్లకు చెందిన శానిటరీ జవాన్లకు వాకీ టాకీలు పంపిణీ చేశారు. ప్రతి జవాన్ ఎక్కడ ఉన్నాడో అనే విషయంపై స్పష్టత ఉండటంతో పాటు సమయపాలనపై పర్యవేక్షణ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
KMM: పోక్సో కేసులో మామిడి పాపారావు(30) నిందితుడికి 20 సం.రాల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ FTC-II న్యాయమూర్తి ఉమాదేవి శుక్రవారం తీర్పునిచ్చారు. సత్తుపల్లి (M)కి చెందిన 7 ఏళ్ల బాలిక పై 2023 AUG 13న ఇంటి బయట అడుకుంటున్న చిన్నారిపై పాపారావు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులకు ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో గల దర్గా చెరువు శిఖంలో జేసీబీ ద్వారా కొందరు అక్రమంగా మట్టిని తవ్వి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో సాగు చేయడానికి సర్వే నంబర్ల 489/5, 489/6, 489/7భూములలో తమకు హక్కులు ఇచ్చారని గ్రామానికి చెందిన దళిత రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. తవ్వకాలను నిలిపివేయాలని వారు డిమాండ్
WGL: మహానగరంలో ముంపు ప్రాంతాలు ఏటేటా పెరుగుతున్నాయని, నాలాల కబ్జా, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో చినుకుపడితే నగరవాసులు జంకుతున్నారని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం GWMC కమిషనర్కు బీజేపీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు.
KMM: ఆర్ధికంగా వెనుకబడి, న్యాయ సహాయం కొరకు ధనాన్ని వెచ్చించ లేని వారి కోసం అందించే అందించే ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని లా కాలేజీలో నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. లా విద్యార్థులకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గురించి వివరించారు.
MLG: విద్యార్థులను చదువుతో పాటు కళాత్మక రంగాలలో ప్రోత్సహించాలని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలల కాళేశ్వరం జోనల్-1 అధికారిని అరుణ కుమారి అన్నారు. జనవరిలో కాళేశ్వరం జోనల్ లోవర్ డ్రాయింగ్ అర్హత పోటీలలో ములుగు సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన 30మంది విద్యార్థిలు ఉత్తీర్ణత సాధించారు. శుక్రవారం పాఠశాల సందర్శన వచ్చిన అరుణ వారిని అభినందించి, పథకాలు అందించారు
HYD: వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా బాలాజీ నగర్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వంగవీటి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, భరత్ కుమార్, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
NGKL: నాగర్కర్నూల్ జిల్లాలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వెంకట్ రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన భూ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో ఎంతో మంది రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వాటి పరిష్కారానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు.
WNP: కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ ఇవ్వాలని సీపీఐ పట్టణ కార్యదర్శి రవీందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం అమారచింత మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, భాస్కర్, శ్యాం సుందర్, పలువురు పాల్గొన్నారు.
KMR: గాంధారి మండలంలోని వివిధ పెస్టిసైడ్ షాప్లలో శుక్రవారం ఎల్లారెడ్డి వ్యవసాయ శాఖ అధికారి నదీమ్, మండల వ్యవసాయ అధికారి రాజలింగం, స్థానిక ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ.. అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
MBNR: మిడ్జిల్ మండలం రాణిపేట్లో డ్రైడే-ఫ్రైడే కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి సుదర్శన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్, అంగన్వాడీ టీచర్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
WGL: సంగెం మండలం గవిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను కలెక్టర్ సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల పంట రుణాల వివరాలు తెలుసుకుని ఒక్క రైతుకు ఎన్ని బస్తాలు యూరియా ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. యూరియా బస్తాలను ఎమ్మార్పీ ధరకే విక్రయించాలి స్టాక్ ఎప్పటికప్పుడు అందుబాటులోకి ఉంచుకోవాలని సూచించారు.
BDK: ఆర్టీసీ బస్టాండ్లో పెట్రోల్ బంక్ నిర్మిస్తే సహించబోమని దమ్మపేట బస్టాండ్ సాధన కమిటీ సభ్యులు అన్నారు. పెట్రోల్ బంక్ నిర్మాణానికి వ్యతిరేకంగా నల్ల మాస్కులు ధరించి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఆర్టీసీ ఆదాయం కోసం దిగజారుడు పనులు చేస్తుందని విమర్శించారు. ప్రయాణీకుల కోసం బస్టాండ్ను పునరుద్ధరించాలి కోరారు.
HYD: రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు లబ్దిదారులకు 426 షాదీముబారక్, 75 కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకొని ఆర్థికంగా లబ్దిపొందాలన్నారు. పేదింటి వివాహానికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో లబ్ధిచేకూరుస్తుందన్నారు.
KMR: బిచ్కుంద మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్నాయని (AISB)జిల్లా అధ్యక్షుడు రవీందర్ గౌడ్, (TNSF) రాష్ట్ర నాయకుడు పుట్ట భాస్కర్ ఆరోపించారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. అర్హత లేని టీచర్లతో బోధన, కనీస వసతులు లేకపోవడంపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు వినతిపత్రం అందజేశారు.