MDK: మెదక్లో పోలీస్, జర్నలిస్టుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. టాస్ గెలిచి జర్నలిస్టులు 15.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేశారు. తదుపరి 102 లక్ష్యంగా పోలీస్ జట్టు 11.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించారు. జట్లకు ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు.
KMM: సత్తుపల్లి పట్టణంలో పలు సామాజిక వర్గాలు నిర్వహించిన కార్తీకమాస వనసమారాధన కార్యక్రమాలకు ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మొదటగా గౌరీగూడెంలో ఉన్న మామిడి తోటలో జరిగిన రెడ్డి వారి కార్తీక మాస వనసమారాధనలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన వనసమారాధన కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాలు పంచుకున్నారు.
RR: షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం రాగ్యతండాలో లలితాంబిక దేవి 2వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని భక్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
WNP: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన తల్లిదండ్రులు కీర్తిశేషులు సాయి రెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థంగా ఆదివారం చిట్యాల చేయూత అనాధాశ్రమానికి రూ.6 లక్షల విలువైన వాహనాన్ని విరాళంగా అందించారు. ఈ వాహనాన్ని అనాధ వృద్ధులకు భోజనం పంపిణీ కోసం ఉపయోగిస్తామని అనాధాశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. MLA మాట్లాడుతూ.. పేదలకు సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.
JGL: స్పెషల్ లోక్ అదాలత్లో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 1861 కేసులను ఇరు వర్గాల సమ్మతితో పరిష్కరించినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లాలో నమోదైన 66 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులు కోల్పోయిన రూ.20 లక్షలను బ్యాంకుల సహకారం, టెక్నికల్ ట్రాకింగ్, వేగవంతమైన ఫ్రీజింగ్ చర్యలతో తిరిగి రీఫండ్ చేయించామని వివరించారు.
భువనగిరి: రాయగిరి వెంకటేశ్వర కాలనీలో వీధి కుక్కల దాడిలో ముఖముల రమేష్ అనే రైతుకు చెందిన మూడు గేదె దూడలు మృత్యువాత పడ్డాయి. గేదె దూడలు చనిపోవడంతో రైతు కన్నీరు పెట్టుకున్నారు. రైతుకు నష్ట పరిహారం చెల్లించి న్యాయం చేయాలని యాదవ సంఘం కుల పెద్ద అవిశెట్టి మల్లేష్, అధ్యక్షుడు మచ్చ రాజు మున్సిపల్ కమిషనర్ను కోరారు.
NLG: జిల్లాలో మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఖాళీ ఉన్న 150 టీచర్ పోస్టులు, 684 ఆయా పోస్టులు భర్తీ చేయాలని పలువురు ప్రభుత్వాని కోరుతున్నారు .
SRD: ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమాల అమలుకు జిల్లా ప్రత్యేక అధికారిగా ఎస్ సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ ఆదివారం నియమితులయ్యారు. ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు 10 మండలాల్లోని 10 పాఠశాలల్లో 5.0 కార్యక్రమాల అమలును పరిశీలిస్తారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
KMM: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆకర్షణీయమైన ప్రకటనలకు ఎవరూ మోసపోవద్దని సీపీ సునీల్ దత్ హెచ్చరించారు. టెలిగ్రామ్, ఇమెయిల్ ద్వారా పంపే లింకుల ద్వారా ప్రజలను నమ్మబలికి డబ్బు బదిలీ చేయించుకునే సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. వీడియో కాల్, వాట్సాప్ లేదా మెసేజ్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే కాల్ కట్ చేయాలన్నారు.
VKB: కొడంగల్ మండలం అంగడి రాయిచూర్ GP పరిధిలోని ధర్మాపూర్, ఇందనూర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన పనులను ఆదివారం AE పరిశీలించారు. వంతెన ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. నియమాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీర్ సహాయంతో గీసిన వంతెన ఊహచిత్ర నిర్మాణాన్ని విడుదల చేసి అధికారులకు వివరించారు.
ADB: కార్మికుల సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేస్తామని AITUC అనుబంధం యూనియన్ నాయకులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి బ్రాంచ్ అధ్యక్షుడిగా నల్ల శివన్నను ప్రధాన కార్యదర్శిగా పెందూర్ దిలీప్ను నియమిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ వెల్లడించారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు కోరారు.
WGL: జిల్లాలో సాగు చేసిన పత్తి పంట ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులకు సరిపడే ఉత్పత్తి అందకపోవడంతో రైతులు పత్తి పంటను డిస్మెంటల్ చేస్తున్నట్లు వారు తెలిపారు. వచ్చె కాలాన్నికి మొక్కజొన్న పంట సిద్ధం చేసేందుకు దుక్కులు చదును చేస్తున్నట్టు వెల్లడించారు.
SRPT: చివ్వెంల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభాకర్ గంజాయి, డ్రగ్స్ వల్ల జరిగే అనార్థలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్కు బానిసై యువత, రైతులు తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారన్నారు. తన వంతు బాధ్యతగా రాష్ట్రవ్యాప్తంగా కళారూపంలో మత్తు రహిత సమాజ స్థాపన కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
NRML: తెలంగాణ BJLP నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి అంశంపై చర్చించి, రహదారుల అభివృద్ధికి కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. నిధుల మంజూరు విషయంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
SRD: సంగారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలోని సిటీ ఆడిటోరియంలో ఉర్దూ కవి సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉర్దూ కవులు తమ కవిత్వాలను వినిపించారు. ముఖ్యఅతిథిగా హాజరైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఉర్దూ కవుల కవిత్వాలు చాలా బాగున్నాయని అభినందించారు.