MBNR: పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్పీ జానకి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో మొదలయ్యే ఈ తెలుగు నూతన సంవత్సరం, ప్రజలందరి జీవితాలలో శాంతి, సుఖ సంతోషాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉగాది తెలుగు ప్రజలకు నూతన సంవత్సర ఆరంభమని, పోలీస్ సిబ్బంది, మీడియా, జిల్లా ప్రజలకు మంచి జరగాలని ఆమె పేర్కొన్నారు.