KMM: తల్లాడలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాస్తారోకో నిర్వహించారు. రాత్రి కురిసిన వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయిందని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీవ్ర నష్టం మిగిల్చిందని విలపించారు. ప్రభుత్వం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, గన్ని సంచులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
KMM: జిల్లా తెలంగాణ భవన్లో BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.
KMR: బిక్కనూర్ మండల కేంద్రంలో బుధవారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతులు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో రోహిష్మ, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ ఉన్నారు.
KMR: రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలోగల బుగ్గ రామలింగేశ్వర టెంపుల్ వద్ద గల వృద్ధాశ్రమాన్ని జిల్లా సంక్షేమ అధికారి ఏ. ప్రమీల సందర్శించడం జరిగింది. అక్కడ వారికి ఉన్న సౌకర్యాలు వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. భిక్నూర్లోని మహిళా సాధికారత కేంద్రం వారు ఏర్పాటు చేసిన నిరుద్యోగ యువతలకు మగ్గం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.
KMR: నేరడి పట్టణ కేంద్రంలోని దేవి హాస్పటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం మూడు గంటలకు ఎమ్మెల్యే మదన్ ఫర్ డేస్ ఉన్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. అనంతరం గాంధారి మండలంలోని గుర్జల్, పెట్ సంగం, నేరళ్ తండాలో సహకార సంఘం గోదాం నిర్మాణ శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు.
KMR: లింగంపేట మండలం బాలాపూర్లో ధరావత్ ఈశ్వర్(56) తాడ్వాయి మండలం కరడ్ పల్లిలో ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం బాన్సువాడ మండలంలోని అంకోల్ తాండాలోని అత్తగారింటికి వెళ్లినట్టు, బుధవారం ఉదయం గుండెపోటు రావడంతో బాన్సువాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందారని భార్య సంగుబాయి తెలిపారు.
NZB: భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పనంగా అప్పజెప్పే కుట్రలు కుతంత్రాలు మోడీ సాగించాడని.. అందులో భాగంగానే 3 రైతు వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లును ముందుకు తీసుకొచ్చారని రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు దేవారాం అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్నారు.
NZB: జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బుధవారం వివిధ కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలిస్తున్నందున ఎక్కడ కూడా జాప్యం జరుగకుండా చూడాలన్నారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా చూడాలన్నారు.
KMM: నేలకొండపల్లి మండలంలోని చెరువు మాదారం గ్రామంలో అంగన్వాడి సెంటర్లోని చిన్నపిల్లలకు డాక్టర్ రాజశేఖర్ కంటి పరీక్షలను నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇవ్వవద్దని వాటి వలన చూపు త్వరగా మందగిస్తుందని చిన్నారులకు ఆకుకూరలు ఎక్కువగా తినిపించాలని అన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ రత్నకుమారి సూపర్వైజర్ పార్వతి అంగన్వాడి టీచర్స్ పాల్గొన్నారు.
SRCL: ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను గ్రామాలకు వెళ్లి పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట్, వెల్జీపూర్, ఓబుళాపూర్ గ్రామాల్లో ఆయన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు.
KNR: జిల్లాలోని శిశు గృహలో పెరుగుతున్న 5 నెలల ఆడ శిశువును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చారు. చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్లో పెరుగుతున్న 13 సంవత్సరాల బాబును కరీంనగర్కు చెందిన పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ దత్తత కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు
PDPL: యాసంగి పంట కొనుగోలులో కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం ముత్తారం మండల కేంద్రం, మచ్చుపేట, పారుపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలన్నారు.
ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి కాళికాదేవి టెంపుల్ దగ్గరలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు వెంకటయ్య పాలెంకు చెందిన వారని స్థానికులు తెలిపారు. అనంతరం 108 ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
PDPL: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్-1లో RO ప్లాంట్ నిర్మాణం, స్మశానవాటిక ఆధునీకరణ పనులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ప్రతి కుటుంబానికి పరిశుభ్రమైన తాగునీరు అందించాలన్నదే లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి ప్రతి పౌరుడికి అందేలా చర్యలు తీసుకుంటామని రాజ్ ఠాకూర్ తెలిపారు.
SDPT: భారతదేశంపై ఉగ్రవాదం పేరిట దాడి చేస్తూ తమ శాంతిని, సహనాన్ని పరీక్షిస్తే దేశం చూస్తూ ఊరుకోదని బుధవారం MLA హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్, పీఓకేలలో చేసిన మెరుపు దాడుల పట్ల ఆయన గర్వంగా ఉన్నామన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన కుటుంబాలకు న్యాయం జరిగిందన్నారు.