PDPL: సింగరేణి యాజమాన్యం ‘నీటి బిందువు- జల సింధువు’ అనే విశిష్ట కార్యక్రమంలో భాగంగా రామగుండం GMలలిత్ కుమార్, అడ్వైజరీ ఫారెస్ట్ మోహన్ చంద్ర పరేగాన్ ఆధ్వర్యంలో మూతపడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించారు. సుమారు 6.26 హెక్టార్ల విస్తీర్ణంలో 7 ట్యాంకుల నిర్మాణం కోసం అనువైన స్థలాలను పరిశీలించి పనులు ప్రారంభించారు.
MBNR: ఎర్ర సత్యం కాలనీలో ఉన్న చెరువులో నుంచి నీటిని ఇసుక మాఫియా దారులు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇసుక ఫిల్టర్ చేసేందుకు దీనిని వాడుతున్నారని చెప్పారు. వీరి అక్రమ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
TG: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కేసరి కుస్తీ పోటీలు శుక్రవారం రాత్రి ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 450 మందికిపైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి.
SRPT: రైతులు నాణ్యమైన ధాన్యంను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చి, మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. శుక్రవారం చివ్వేంల మండలం బీబీగూడెంలో, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, దొడ్డు రకం వడ్లు కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సందర్శించారు.
SRD: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. కంది మండలం కొత్లాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు.
SRD: వర్షానికి దెబ్బతిన్న ఇండ్లకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఖేడ్ నియోజకవర్గం BRSV నియోజకవర్గ అధ్యక్షులు అంజా గౌడ్, మాజీ ZPTC రవీందర్ డిమాండ్ చేశారు. ఖేడ్ మండలం నాగపూర్లో ఈదురు గాలుల బీభత్సం వర్షానికి మారుతి, సైదులు, రాములు అనే వ్యక్తుల ఇంటిపై కప్పు ధ్వంసమై నష్టపోయారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం BRS నాయకులు బాధితుల ఇళ్లను పరిశీలించారు.
SRD: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి అన్నారు. సంగారెడ్డిలోని ఇందిరా కాలనీ రాజంపేటలో అంగన్వాడీ కేంద్రాల వార్షికోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల పిల్లలకు భోధన చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
SRD: యూటిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో స్పోర్ట్స్ మీట్ను సంఘం రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా క్రీడా పోటీల్లో నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, కార్యదర్శి సాయి తేజ పాల్గొన్నారు.
SRD: అంబేద్కర్ స్టడీ సర్కిల్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డికి సంఘం సభ్యులు శుక్రవారం సంగారెడ్డిలో వినతిపత్రం సమర్పించారు. అంబేద్కర్ వాదులు సొంత డబ్బులతో స్టడీ సర్కిల్ నడిపిస్తున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సంస్థ అభివృద్ధికి సహకరిస్తే నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచితంగా కోచింగ్ ఇస్తామని చెప్పారు.
SDPT: శుక్రవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావును దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల పరామర్శించారు. సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వారు హరీశ్ రావుకు ధైర్యం చెప్పారు.
SDPT: గజ్వేల్లో ఈ నెల 22న జరిగే సీతారామ ఉమామహేశ్వరుల కళ్యాణనికి గోటి తలంబ్రాలను అందించాలని శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టింది. దీనికి సంబందించిన గోటి తలంబ్రాలు (వడ్లు) ప్యాకెట్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రామకోటి రామరాజు సంకల్పం గొప్పదన్నారు.
SRD: మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆర్య విగ్రహానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, మాధురి పాల్గొన్నారు.
KMM: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఎర్రుపాలెం(M) జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని శుక్రవారం సుప్రీంకోర్టు మాజీప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ దంపతులు దర్శించుకున్నారు. ముందుగా మాజీ ప్రధాన న్యాయమూర్తిని అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తదనంతరం అర్చకులు మాజీ న్యాయమూర్తిని స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.
KMM: దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాకు ₹500 బోనస్ ఇస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ బాబు అన్నారు. శుక్రవారం సత్తుపల్లి (మం) కిష్టారంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ నేత దయానంద్తో కలిసి మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
KMM: రాజ్యాంగాన్ని BJP ప్రభుత్వం అవహేళన చేస్తుందని DCC అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు. శుక్రవారం ముదిగొండ (M) వెంకటాపురంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షతన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నహాక సమావేశం నిర్వహించారు. బీజేపీ పదేళ్లుగా దేశంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా నియంతలా పాలిస్తుందని కార్పొరేషన్ ఛైర్మన్ నాగేశ్వరరావు విమర్శించారు.