NRPT: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ప్రోత్సహించి, వారికి మంజూరైన ఇళ్లను త్వరితగతిన నిర్మించుకునేలా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నర్వ మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, నర్వ యాస్పిరేషన్ బ్లాక్పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇళ్ల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
KMR: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇవాళ హైదరాబాద్లో మాజీ ఐఏఎస్ అధికారి, రాజకీయ విశ్లేషకులు జయప్రకాశ్ నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే, జయప్రకాశ్ నారాయణ స్థాపించిన ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ కార్యాలయంలో పరిశోధన విద్యార్థులతో సమావేశంలో పాల్గొన్నారు. డబ్బు,మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించడంపై ఆయన విద్యార్థులకు వివరించారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలోని గచ్చుబావి వద్ద ఉన్న శివాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన మహా రుద్రాభిషేకం కార్యక్రమంలో బీజేపీ నేత తల్లోజు ఆచారి పాల్గొన్నారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఎంతో పురాతనమైన గచ్చుబావిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని తెలిపారు.
KNR: TDP సీనియర్ నేత, ఎన్టీఆర్ వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య మరణం విచారకరమని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు X లో ట్వీట్ చేశారు. TDP ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తోన్న ఆగయ్యను ఈ మధ్యనే మహానాడు వేదికగా తాను, బాలకృష్ణ సత్కరించుకున్నామన్నారు. ఎంతో అంకితభావంతో పార్టీకి కోసం పనిచేసిన ఆగయ్య కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
KMM: సత్తుపల్లి మండలంలోని యాతాలకుంటలో సీతారామ ఎత్తిపోతల పథకం 9వ ప్యాకేజీలో భాగమైన టన్నెల్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం పరిశీలించారు. సీతారామ ఎత్తిపోతల పథకం ఖమ్మంలో నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ స్థిరీకరణ చేస్తూ కొత్తగా మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్ల కోసం కేసీఆర్ డిజైన్ చేశారని అన్నారు.
WNP: పెబ్బేరు మండలంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత సుగూరుకి చెందిన చనమోని రమేష్ సోమవారం పొలం నుంచి ఇంటికి తిరిగి రాగా భార్య కవిత, కూతురు ఐశ్వర్య (5), కొడుకు శివం తేజ్ (3) కనిపించలేదు. తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
HYD: జపాన్లో జరిగిన డెఫ్లింపిక్స్లో 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణపతకం సాధించిన HYD షూటర్ ధనుష్ శ్రీకాంత్ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. సంకల్పం ఎదురు వచ్చే ప్రతి అడ్డంకిని జయిస్తుందని ధనుష్ నిరూపించాడని, యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలిచాడని చెప్పారు.
GDWL: అలంపూర్ 5వ శక్తిపీఠం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానంలో ఈనెల 21వ తేదీ శుక్రవారం బహిరంగ టెండర్ల వేలం పాట నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో దీప్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వేలంలో పార్కింగ్ వసూలు, చీరలు, టెంకాయలు అమ్ముకొనుటకు బహిరంగ, సీల్డ్ టెండర్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెండర్లలో పాల్గొనాలంటే ఆలయ అధికారులను సంప్రదించాలన్నారు.
BDK: భద్రాద్రి పత్తి రైతులకు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నరేందర్ రైతులు పత్తి అమ్మడానికి సీసీఐ కేంద్రానికి వెళ్లకూడదని సోమవారం సూచించారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల సంఘం పిలుపు మేరకు రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిన్నింగ్ మిల్లులు బంద్లో పాల్గొననున్నాయి. కావున రేపు సీసీఐ సీఎండీతో రాష్ట్ర జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్తో చర్చిస్తామన్నారు.
WGL: ఏనుమముల మార్కెట్ను సందర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు వస్తున్నట్లు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. పత్తి కొనుగోలులో సీసీఐ తీరుని నిరసిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాలోని BRS కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా పిలిపించారు.
KNR: పోలీస్ అధికారుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా, కరీంనగర్ పట్టణంలోని ఆస్ట్రా కన్వెన్షన్లో సోమవారం ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డీఎంహెస్వో డా. వెంకటరమణ, కట్టరాంపూర్ ఆరోగ్య కేంద్ర వైద్య బృందంతో కలిసి 50 మంది మహిళా పోలీసు అధికారులకు పరీక్షలు నిర్వహించారు. సీబీపీ, విటమిన్ డి, కాల్షియం, లిపిడ్ ప్రొఫైల్, రక్తపోటు, డయాబెటిస్ సహా అన్ని పరీక్షలు నిర్వహించారు
PDPL: జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ మినీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృత సమీక్ష సమవేశం నిర్వహించారు. నవజాత శిశువుల వారోత్సవాలు, వెసెక్టమీ పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. క్షయ నిర్ధారణ, జ్వరాల సర్వే, డ్రై డే కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఓపీ కేసులు, సిబ్బంది సమయపాలన ఉండాలన్నారు.
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో గొలుసు దొంగను రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 29 గ్రాముల విలువ చేసే బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారుగా రూ.3,33,500 వరకు ఉంటుందని అధికారులు తెలియజేశారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో దొంగల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
BHNG: ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల ఐలయ్య తెలిపారు. సోమవారం రాజాపేట మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రాజాపేటలో బీసీ, కురుమ కమిటీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు రాజాపేట శివాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
MDK: కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ ఆలయంలో సాయంకాల ప్రదోషకాల వేళలో దీపాలంకరణ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. శివలింగం ఆకారంలో దీపోత్సవం చేశారు. అనంతరం స్థానిక మంజీరా నది పాయలో గంగాహారతి, ఆలయ ప్రాంగణంలో ఆకాశదీపం ఆవిష్కరించి దర్శించుకున్నారు.