WNP: పెద్దమందడి మండలం దొడుగుంటపల్లికి చెందిన హెల్త్ సూపర్వైజర్ యుగంధర్ రెడ్డి రెండు రోజుల క్రితం తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. విషయం తెలుసుకున్న BRS సీనియర్ నేత, మాజీ MP రావుల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఆయన నివాసానికి చేరుకుని యుగంధర్ రెడ్డి భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రావుల ఆకాంక్షించారు.
BHPL: మండల కేంద్రంలో ఏటీఎం సెంటర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని BRS మండల యూత్ అధ్యక్షుడు అక్కల రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రమై సంవత్సర కాలం గడిచిన, ఒక్క ఏటీఎం కూడా లేక బ్యాంకు వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించి ATM సెంటర్ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు.
BHNG: బాలకార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఈ నెల 31 వరకు ఆపరేషన్ ముస్కాను జిల్లాలో పకడ్బందీగా, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సంబంధిత శాఖల అధికారులను కోరారు. మహిళా శిశు సంక్షేమ, పోలీస్, కార్మిక, విద్యా, వైద్యశాఖలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
KMR: ఎల్లారెడ్డి మున్సిపల్ ఆఫీస్ పక్కన గల గ్రంథాలయం వద్ద గత మూడు రోజుల నుండి చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలి ఇబ్బందికరంగా ఉంది. అలాగే 3 రోజులుగా చెత్త పెరుకపోయి ఉందని మున్సిపల్ అధికారులు స్పందించి ఇబ్బంది లేకుండా చూడాలని గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు కోరుతున్నారు.
ADB: గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న జైభీం, జైబాపు, జైసంవిధాన్ కార్యక్రమానికి శుక్రవారం ఉదయం బయలుదేరారు. మండల అధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి అందుతుందన్నారు. నాయకులు మాధవ్, సుశీల్, రామ్ కిషన్ కార్యకర్తలు తదితరులున్నారు.
MBNR: మతసామరస్యానికి మొహర్రం ప్రతీక అని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రామయ్యబౌలి, పాతపాలమూరు కాలనీలలో ఏర్పాటుచేసిన పీర్లను గురువారం రాత్రి ఎమ్మెల్యే దర్శించుకోని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకొని ఐక్యత చాటాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ ఒబేదుల్లకొత్వాల్, ముడాచైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
MNCL: హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహాసభ శుక్రవారం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను జీసీసీ రాష్ట్ర చైర్మన్ కొట్నాక తిరుపతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివాసి గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని కార్గేను ఆయన కోరారు.
ADB: బాసర ఆర్జీయూకేటీలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి ఎంపికైన విద్యార్థుల ప్రొవిజనల్ లిస్టును శుక్రవారం విడుదల చేయనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. బాసర క్యాంపస్ 1500 సీట్లు, మహబూబ్ నగర్ సెంటర్లో 180 సీట్లకు సంబంధించిన 1680 విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు వీసీ. ప్రో.గోవర్ధన్ సెలెక్టెడ్ లిస్టును విడుదల చేయనున్నారు.
NZB: శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మొదలైంది. గడిచిన 24 గంటల్లో ఇన్ఫ్లోగా 5,907 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దిగువకు 654 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. కాకతీయ కెనాల్కు 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని తెలిపారు. ప్రస్తుతం SRSPలో 1,066.20అడుగుల నీటిమట్టం ఉంది.
SRPT: హజూర్నగర్ పట్టణంలో H.P బంక్ ఎదురుగా ఉన్న బైపాస్ రోడ్డు వర్షాలు పడినప్పుడు గుంతలతో నిండిపోతుండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్కూల్ బస్సులు, రైతులు, ట్రాక్టర్లు, లారీలు ఈ రహదారిలో ప్రయాణించలేకపోతున్నారు. రోడ్డుపై నీళ్లు నిలిచి బురదగా మారడం వలన ప్రయాణం చాలా కష్టంగా మారింది. వాహనదారులు, ప్రజలు సంబంధిత అధికారులను స్పందించాలని కొరారు.
MNCL: కన్నెపల్లి మండలం నుంచి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే ఆత్మీయ సమ్మేళనంకు మండల కాంగ్రెస్ నాయకులు భారీగా శుక్రవారం తరలివెళ్లారు. వారు మాట్లాడుతూ.. ఎల్బీ స్టేడియంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిధిగా AICC అధ్యక్షులు ఖర్గే హాజరవుతారని పేర్కొన్నారు.
PDPL:పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో క్లిష్టమైన సర్జరీలను వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. పోతుల స్రవంతికి గాలి బ్లాడర్లో స్టోన్తో కడుపు నొప్పి, వాంతులు లాంటి సమస్యలతో బాధ పడుతుండగా, విజయవంతంగా లాప్రోస్కోపిక్ సర్జరీ నిర్వహించారు. గడ్డం కవిత గర్భసంచిలో గడ్డలతో తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతుండగా, విజయవంతంగా ఆపరేషన్ చేశారు
MDK: మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువు ఈనెల 31 తేదీ వరకు పెంచినట్లు జిల్లా ఇంటర్ అధికారి మాధవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు విడుదలైనందున గడువు పెంచినట్లు చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరారు.
BDK: పినపాక తాహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న గోపాలకృష్ణ బదిలీ అయ్యారు. తాజాగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఆయనను గుండాల తాహసీల్దార్గా నియమించారు. ఆయన స్థానంలో పినపాక తాహసీల్దార్గా అనూష నియమితులయ్యారు. ఈ బదిలీ ఉత్తర్వులు అధికారికంగా గురువారం విడుదలయ్యాయి.
KMM: తిరుమలాయపాలెం మండలానికి మంజూరైన ఐటీఐ కళాశాలను సర్వే నం. 254లోని రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మించాలని అఖిలపక్ష నేతలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. రహదారి పక్కన నిర్మాణం వల్ల విద్యార్థులు, స్టాఫ్కు రవాణా సౌకర్యం ఉండటంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు.