• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బైకును ఢీకొట్టిన బస్సు.. ఒకరి మృతి

NZB: బైకును బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు తీవ్రగాయాలై మృతిచెందిన ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులోని అలీసాగర్ లిఫ్ట్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బోధన్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎడపల్లి నుంచి జానకంపేట వైపు వెళ్తున్న బైకును ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న పిట్ల గంగాధర్ గాయాలయ్యాయి. 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

May 7, 2025 / 08:00 AM IST

నేడు అక్బర్‌నగర్‌లో స్వామి కల్యాణ మహోత్సవం

NZB: రుదూర్ మండలం అక్బర్ నగర్ శివారులోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వేద పండితులు శ్రీనివాస్ శర్మ, విష్ణు శర్మ, రోహిత్ శర్మ ఆధ్వర్యంలో హోమం, కల్యాణ మహోత్సవ -క్రమాలు నిర్వహిస్తారని వివరించారు. ఉత్సవాలకు సమీప గ్రామాల నుండి భక్తులు హజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు

May 7, 2025 / 07:59 AM IST

కొత్త రేషన్ కార్డుదారులు.. చిగురిస్తున్న ఆశలు..!

MBNR: అడ్డాకుల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఇటీవలే తప్పులను సరి చేయడంతో కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తే ఇబ్బందులు ఉండవన్నారు.

May 7, 2025 / 07:54 AM IST

నేడు వృద్ధులకు, దివ్యాంగులకు ప్రజావాణి

MBNR: జిల్లా కేంద్రంలోని అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం సీనియర్ సిటిజన్స్ విజ్ఞప్తి మేరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు తెలిపారు. ప్రతి నెల మొదటి బుధవారం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇది జరగనుందన్నారు.

May 7, 2025 / 07:20 AM IST

కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించాలి

NZB: కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మాక్లూర్​ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ హమాలీల కొరతను వెంటనే తీర్చాలని.. ధాన్యాన్ని వెనువెంటనే తూకాలు వేసి రైస్ మిల్లులకు పంపాలని ఆదేశించారు.

May 6, 2025 / 07:41 PM IST

వడదెబ్బతో మహిళ మృతి

MHBD: జిల్లా కేంద్రంలోని లెనిన్ నగరికి చెందిన అమరావతి (40) అనే మహిళ సోమవారం రాత్రి వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి కూతురు ఉండటంతో కుటుంబ సభ్యులు దుఃఖ సంద్రంలో మునిగారు. నిరుపేదలైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె భర్త కోరాడు.

May 6, 2025 / 07:40 PM IST

వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

NRML: లక్ష్మణచంద మండలంతో పాటు రాచాపూర్, వడ్యాలలో మంగళవారం అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ మరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వరి కొనుగోలు చేయాలన్నారు. నిర్దేశిత తేమ శాతం వచ్చిన తరువాత మాత్రమే తూకం చేయాలని, ఒక్క గ్రాము కూడా అధికంగా తూకం చేయొద్దని అధికారులకు ఆదేశించారు.

May 6, 2025 / 07:08 PM IST

నాంచారమ్మ జాతరకు హాజరుకానున్న మంత్రి సీతక్క

MLG: వెంకటాపూర్ మండలం రామానుజాపురం గ్రామ శివారులో 800 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించిన ఎరుకలి నాంచారమ్మ ఆలయంలో ఈ నెల 12న జాతర నిర్వహించనున్నట్లు ఎరుకల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పల్లకొండ భాస్కర్ తెలిపారు. ఎరుకల కులస్థుల ఆరాధ్య దైవమైన నాంచారమ్మ జాతరకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు.

May 6, 2025 / 06:13 PM IST

‘రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి’

NZB: రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి MSP చట్టం చేయాలని సిరికొండ తహశీల్దార్‌కు ఖిలభారత ఐక్య రైతు సంఘం నాయకులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం బాబన్న మాట్లాడుతూ.. బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తూ రైతుల నడ్డి విరచడానికి తెచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు.

May 6, 2025 / 05:11 PM IST

పత్తి రైతు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది: జోగు రామన్న

ADB: రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా పత్తి రైతులు నిలువునా మోసపోయారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఈ మేరకు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశమై మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ హస్తంతో ప్రయివేటు డీలర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రైతులకు కుచ్చుటోపీ పెట్టారని మాజీమంత్రి జోగు రామన్న ఆరోపించారు.

May 6, 2025 / 05:10 PM IST

ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహిళా నాయకులు

BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా మహిళా నాయకులు శాలువాతో సత్కరించి పూల గుచ్చని అందజేశారు. అనంతరం మహిళా నాయకులు ఎమ్మెల్యే పాయం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అభిమానులు బైక్ ర్యాలీ, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు.

May 6, 2025 / 05:04 PM IST

‘జర్నలిస్టులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేయాలి’

BDK: ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదని TWJF రాష్ట్ర కార్యదర్శి బసవయ్య తెలిపారు. మంగళవారం పాల్వంచలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పినప్పటికి నేటికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వమైన ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.

May 6, 2025 / 04:50 PM IST

రావి ఆకుపై వాసవి మాత చిత్రం

SRD: రావి ఆకుపై నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్టు గుండు శివకుమార్ మంగళవారం రావి ఆకుపై వాసవి మాత చిత్రాన్ని గీసి ఆవిష్కరించారు. రేపు వాసవి మాత జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆర్య వైశ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తారని శివకుమార్ తెలిపారు. రావిఆకుపై ఒక చేతిలో కమలం మరో చేతిలో చిలుక చిత్రాన్ని చక్కగా గీశాడు.

May 6, 2025 / 04:46 PM IST

డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

NGKL: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భవాని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు .  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో BZC, MZC, ఎంపీసీ, ఎంపీసీఎస్ కోర్సుల్లో సీట్లు ఉన్నట్లు తెలిపారు.

May 6, 2025 / 04:14 PM IST

ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

SRD: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం ఆయన కళాశాలలో చేసుకోవాలని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం మంగళవారం ఓ ప్రకటనలు తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

May 6, 2025 / 03:31 PM IST