HYD: జీఎమ్ఆర్ హైదరాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని సాధించింది. ఇండియా అండ్ సౌత్ ఏషియా విభాగంలో ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ స్టాఫ్ 2025’ అవార్డు నాలుగోసారి అందుకుంది. ఇది ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో, అతిథి సేవలు, కార్యకలాపాల్లో సమర్థతకు గుర్తింపుగా అందించారు.
MBNR: చంటి బిడ్డలకు తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు మానవ డోనర్ మిల్క్ను అందించే సదుపాయాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా MBNR ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన అవకాశమని కలెక్టర్ విజయేంద్ర బోయి కొనియాడారు. సుశేషణ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమగ్ర లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్ను ఎంపీ, కలెక్టర్ ప్రారంభించారు.
SRD: జిల్లాలో 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసులు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
SRPT: తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా నరసింహారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
NLG: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అందరూ సహకరించాలని కోరారు.
SRD: కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ MRO జుబేర్ బదిలీ అయ్యారు. అయితే గురువారం స్థానిక కార్యాలయంలో MRO భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీ ఓ.సుభాష్, కార్యాలయం అధికారులు, సిబ్బంది కలిసి ఆత్మీయ సన్మానం చేశారు. గత కొన్నేళ్ల నుండి బాధ్యతతో విధులు నిర్వహించిన డిప్యూటీ MRO జుబేర్ సేవలను అధికారులు కొనియాడారు. అనంతరం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
MDK: మెదక్ మండలం పాతూర్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వారి ప్యాడి క్లీనింగ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీఆర్డీవోలు పాల్గొన్నారు.
SRPT: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తుందనితెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వీరయ్య అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
MNCL: జిల్లా తాండూర్ మండల కేంద్రం లోని SC కాలనీలో CPM మండల కమిటీ ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా కట్టెల పోయ్యి పై నాయకులు వంట వండడం జరిగింది. గురువారం మండల కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై రూ.50 పెంచడం దారుణమన్నారు. క్రడ్ ఆయిల్ ధరలు తగ్గినందున గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
SRPT: సరైన పోషకాహారం ఉంటే రక్తహీనతను నివారించవచ్చు అని అంబేద్కర్ నగర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రమ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆకుకూరలు, పాలు అధికంగా తీసుకోవాలని సూచించారు.
HYD: JNTUH కాలేజీలో పలు ఇంజినీరింగ్ విభాగాలకు హెచ్ఐడీలను మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్ హెచ్ఐడీగా ప్రొ.జనార్ధన్ యాదవ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనేషన్ విభాగాధిపతిగా అసోసియేట్ ప్రొఫెసర్ మాధవీ కుమారి, మెటలర్జికల్ హెచ్ఐడీగా ప్రొఫెసర్ దేవకి రాణిలను నియమిస్తూ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రావు ఆదేశాలు జారీ చేశారు.
SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను గురువారం ప్రజాప్రతినిధులు అధికారులు పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి పంటల నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈ అకాల వర్షం వల్ల తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందన్నారు.
KMM: నేలకొండపల్లి, ముదిగొండ మండలంలో ధాన్యం అమ్ముకునేందుకు తిప్పలు తప్పడం లేదని రైతులు వాపోయారు. గురువారం పలువురు రైతులు మాట్లాడుతూ.. మిల్లర్లు తాము పండించిన ధాన్యాన్ని నేరుగా మిల్లుకు తీసుకురావాలని చెప్తున్నట్లు పేర్కొన్నారు. మిల్లుకు ధాన్యం తరలిస్తే రూ.1800లకు కొనుగోలు చేస్తామని, ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్ అందిస్తామని చెప్తున్నట్లు తెలిపారు.
MNCL: జన్నారం మండలంలోని దేవునిగూడ గ్రామంలో మండల అధికారులు సన్న బియ్యం భోజనం చేశారు.. ఆ గ్రామానికి చెందిన లబ్ధిదారులు మడావి బాదిరావు, లింగారెడ్డితో కలిసి గురువారం మధ్యాహ్నం తహసీల్దార్ రాజా మనోహర్ రెడ్డి, ఎంపిడిఓ షరీఫ్, డిప్యూటి తహసీల్దార్ రామ్మోహన్, ఆర్ఐ భానుచందర్ సన్న బియ్యం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్, కార్యదర్శి సరితా ఉన్నారు.
NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పీఏపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, పీఏపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అదనపు గదుల ప్రారంభోత్సవం, కొండమల్లేపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, దేవరకొండలో పోషణ్ అభియాన్ కార్యక్రమం, మైనంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ చేస్తారు.