MHBD: సీరోలు మండల కేంద్రంలో అక్రమంగా ఓ వాహనంలో తరలిస్తున్న నిషేధిత 8 క్వింటాళ్ల నల్ల బెల్లం పోలీసులు పట్టుకున్నారు. నాటుసారా తయారీకి ఉపయోగించడం కోసం ఇద్దరు వ్యక్తులు వాహనంలో నల్లబెల్లం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
NZB: పట్టపద్దుల MLC అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు ఇవాళ మోస్రా మండల కేంద్రంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి ఇన్ఛార్జ్ పెద్దల గంగారెడ్డి తదితరులు ఉన్నారు.
MNCL: నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లితే వెంటనే 100 లేదా 112కు కాల్ చేయాలని జన్నారం ఎస్ఐ గుడెంటి రాజవర్ధన్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాపాడతారని ఆయన చెప్పారు. నేరాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించేది లేదు ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం. అలాగే పిల్లలు ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. సమాజం బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు.
JN: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య మొక్కలు నాటారు. మాజీ ఎంపీ సంతోష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విరివిగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
HYD: ఘట్కేసర్ పరిధి జగదాంబ థియేటర్ పరిసర ప్రాంతాల్లో కిన్లి డూప్లికేట్ వాటర్ బాటిళ్లలో వాటర్ పోసి పలువురు విక్రయిస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. ఇంకా వాటర్ బాటిల్ సీల్ తీసి ఉంటుందని ఆయన గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఘట్కేసర్ పోలీసు అధికారులు, డూప్లికేట్ కిన్లి బాటిల్ తీసుకొని వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
KMR: పిట్లం మండలం ఖంబాపూర్ గ్రామంలో ఈ ఏడాది వ్యవసాయ బోరు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. బోరుబావుల్లో నీరురాక వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. యాసంగిలో రైతులు ఎక్కువగా వరి, మొక్కజొన్న సాగుచేశారు. బోరుబావుల్లో నీరు తగ్గడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోవడంతో కొత్తగా బొర్లు వేసిన నీరు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
HYD:మూసీలో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపునకు చర్యలు చేపట్టామని GHMC శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అత్తాపూర్ నుంచి చాదరాఘాట్ వరకు ఈనెల 3నుంచి 14వరకు నదిని శుభ్రం చేసే పనులు చేట్టామని చీఫ్ ఎంటమాలజిస్ట్ ఎస్. పంకజ అన్నారు. గుర్రపుడెక్కను తొలగించడం,నదిలో దోమలమందు పిచికారీ,సమీప కాలనీలలో ఉస్మానియా ఆసుపత్రి, ప్రాంతాల్లో ఫాగింగ్ వంటివి నిర్వహంచామన్నారు.
HYD: పాతబస్తీలో జరిగిన ఓ విషాద గాథ ఆలస్యంగా వెలుగుచూసింది. సంతోష్నగర్ పోలీసుల వివరాలు.. PS పరిధిలో ఉండే మహ్మద్ ఇమ్రాన్, చాంద్రాయణగుట్టకు చెందిన యువతి ప్రేమికులు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తండ్రి ఇమ్రాన్ పై కోపంతో తన కూతురిని వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేయించాడు. ఈక్రమంలో మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకున్నాడు.
WGL: నల్లబెల్లి మండలంలోని ముచ్చింపుల గ్రామ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని ప్రజాసంఘాల నాయకులు నిరసన చేపట్టారు. నాయకుడు ప్రతాప్ నరేష్ మాట్లాడుతూ.. ఈ సమస్యను ఆరు నెలలుగా రవాణా శాఖ అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. స్థానికులు కలెక్టర్ తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరారు.
HNK: వరంగల్-ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో కాంగ్రెస్పై విసుగు చెందిన ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
KMM: కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ వ్యాధిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో ప్రజలు చికెన్ కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఆదివారం అయినా వైరా మున్సిపాలిటీలో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. అసత్య ప్రచారం మానుకోవాలని, దీని వల్ల తమ వ్యాపారానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందని చికెన్ షాప్ యాజమానులు మండిపడ్డారు. అలాగే ప్రజలు చేపలు, మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
MNCL: దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ మండలంలోని తాళ్లపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి పోతు సత్తయ్య తెలిపారు. గతంలో నిర్వహించిన కుటుంబ సర్వేలో పేర్లు నమోదు చేయించుకోని వారు ఆ కేంద్రంలో నమోదు చేయించుకోవచ్చన్నారు.
HYD: HYDలో చికెన్ ప్రియులకు అలర్ట్. నగరంలో ఇటీవల కల్తీ చికెన్ను గుర్తించిన పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. చికెన్ నాణ్యత విషయంలో జాగ్రత్త, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ ఆర్డర్ చేయడానికి ముందు తనిఖీ చేయండి. వైన్ షాపుల పక్కనే విక్రయించే మాంసం విషయంలో మరింత జాగ్రత్త అవసరం అన్నారు. చికెన్ విక్రయదారులపై అనుమానం వస్తే వెంటనే 100కు డయల్ చేయ్యాలన్నారు.
HYD: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ చేదువార్త తెలిపింది. సికింద్రాబాద్-నాగపూర్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు కోచ్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 కోచ్లతో నడుస్తుండగా ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 8 కోచ్లకు కుదిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్ ప్రారంభించినప్పటి నుంచి సగం సీట్లు కూడా నిండకపోవడమే కారణం అన్నారు.
మేడ్చల్: కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని 6 రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. HYDలోని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు గ్రేటర్ HYD జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, SEC రీజినల్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. శనివారం RTC ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి బస్టాప్ సిద్ధం అయింది అని తెలిపారు.