GDWL: హెల్మెట్లు వాడండి ప్రాణాలు కాపాడుకోండి అని కళాకారుల బృందం పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం పోలీస్ కళాబృందం కె.టి.దొడ్డి మండలం ఉమిత్యాలతండాలో ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా వారికి ఎన్నో కార్యక్రమాలను పాటలు రూపంలో వర్ణించి ప్రజలు వివరించారు. అలాగే యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు.
NGKL: జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్, విజిలెన్స్ కమిటీ సభ్యులు జిల్లెల్ల రాములు గురువారం కలెక్టర్ను కలిశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
BDK: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58 జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గురువారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ రెహమాన్, టీపీసీసీ కార్యదర్శి నాగ సీతారాములు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, గ్రంథాలయ కార్యదర్శి కరుణ కుమారి పాల్గొని వివిధ కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
KNR: రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పంటలు చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిల్లర్లు ధాన్యం దింపుకునే విషయంలో క్వింటాల్కు 8 కిలోల తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారన్నారు.
ADB: జిల్లా కలెక్టర్ రాజర్షి షాను PRTU ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో పాఠశాల సమయాన్ని మార్చాలని కోరుతూ రాజర్షి షాతో విన్నవించగా సానుకూలంగా స్పందించినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ కుమార్, సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్లో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా ఎన్జీవోలు నిర్వహించిన వాకథాన్కు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శ్రీకారం చుట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భయాన్ని వీడి ప్రశ్నించడం నేర్చుకోవాలని ఆమె బాలలకు సూచించారు. అత్యవసర సహాయం కోసం 1098 హెల్ప్ లైన్ వినియోగించాలని అదనపు కలెక్టర్ సంధ్యా రాణి కోరారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ADB: ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఉంటున్న ఆదివాసీలకు భారత రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు కల్పించాలని ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్ అన్నారు. గురువారం గాదిగూడ మండల కేంద్రంలో ఆదివాసీ పెద్దలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ‘ధర్మ యుద్ధ సభ’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్రం నాగోరావ్ పటేల్, దవలతరావు పాల్గొన్నారు.
వరంగల్ పార్లమెంట్ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) నుంచి మంజూరైన రూ.1,60,000 చెక్కును ఎంపీ కడియం కావ్య గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్పవారమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు .
జనగాం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా KVPS జిల్లా కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ.. ఈ నెల 12న మొయినాబాద్ షాద్నగర్ ప్రాంతాల్లో పోలీసులు నిర్లక్ష్యం కారణంగా అగ్రవర్ణాల దాడిలో మృతి ఎర్ర రాజశేఖర్ వృత్తికి కారకులైన వారిపై కేసు నమోలన్నారు. వారిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
SDPT: నంగునూరు మండలంలోని నర్మెట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి గురువారం సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో ధాన్యంపై టార్ఫాలిన్ కవర్లు కప్పి పెట్టాలని రైతులకు సూచించారు. ట్యాబ్ ఎంట్రీలో జాప్యం కాకుండా చూసుకోవాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు.
ADB: నార్నూర్ మండలంలోని గుండాల గ్రామంలో గురువారం CFL ఆధ్వర్యంలో కౌన్సిలర్ వెంకటేష్ గౌడ్ అశ్విన్ ప్రజలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత నెంబర్లతో బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలు అడిగితే చెప్పవద్దని సూచించారు. ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, కేవైసీ చేసుకోవాలన్నారు.
SRCL: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లా నుంచి ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గితేలు హాజరయ్యారు.
NLG: కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో సెయింట్ ఆన్స్ స్కూల్లో జరిగిన స్కూల్ బస్ల అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. వెంటనే విచారణ చేపట్టి ప్రమాదానికి కారకులు ఎవరైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ను కోరారు.
KMM: పత్తి, మిర్చి ఎలక్ట్రిక్ కాటాలు రిమోట్ కంట్రోల్తో తూకం తక్కువ చూపించి రైతులను వరుసగా మోసం చేస్తున్న దళారుల పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం రైతు సంఘం ఆఫీస్లో జరిగిన తెలంగాణ రైతు సంఘం సమావేశం వారు పాల్గొని మాట్లాడారు.
KNR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు గురువారం అట్టహాసంగా గృహ ప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమాలకు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి పథకం కింద వీరాపూర్ను పైలట్ గ్రామంగా ఎంపిక చేశామన్నారు.