యాదాద్రి: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లింగారెడ్డిగూడెం వాస్తవ్యులైన IPS అధికారిణి సురకంటి శేషాద్రి రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించి, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
NGKL: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు గురువారం కల్వకుర్తి పట్టణంలోని శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. RSS వ్యవస్థాపకుడు డా. కేశవ్ బాలిరామ్ హెడ్గేవార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. అనంతరం ఉగాది వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.
KRM: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మాచారెడ్డి(మం) గజ్యా నాయక్ తండా చౌరస్తాలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుధనపోయిన లక్ష్మి, కర్రెప్ప, నరసవ్వల కొత్త ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు ఉన్నారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధి గోలిపర్తి కోటమ్మ దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించే ఉత్సవాలలో మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు.
KNR: కరీంనగర్లోని శివ థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానుల తీరు వివాదాస్పదమైంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదల సందర్భంగా కొందరు యువకులు జనసేనాని ఫ్లెక్సీలకు బహిరంగంగా బీరు సీసాలతో అభిషేకం చేశారు. ఈ వికృత చేష్టల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. నెటిజన్లు, మేధావులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
WNP: పెబ్బేరు పట్టణంలోని అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా మాందాపురం రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అంబేద్కర్ నగర్ కాలనీ వాసుల సమక్షంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామకృష్ణ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
WGL: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గీసుకొండ మండలంలోని ధర్మారం గ్రామంలో గల పెద్దమ్మతల్లి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనిషా- శివకుమార్ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.
JGL: పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకున్నారు.
ASF: జైనూర్ మండలంలోని భూసిమెట్ట గ్రామపంచాయతీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం సర్పంచ్ ఆత్రం సింధు నగేష్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సీసీ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, నాణ్యత లోపించకుండా చూడాలని ఆమె కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంట్రాక్టర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
BHPL: గణపురం మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు “రంజాన్ తోఫాలను” MLA గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు తోఫాలు అందజేయడం ఆనందకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వారి అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.
BDK: మణుగూరు అంబేద్కర్ సెంటర్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా DSP వంగా రవీందర్ రెడ్డి పాల్గొని పంచాంగ శ్రవణం గావించారు. ఈ కార్యక్రమంలో సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
NZM: నవీపేట్(మం) పోతంగల్లో ఇసుక బజార్ను ఎమ్మార్వో వెంకటరమణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకునే లబ్ధిదారులు, ప్రైవేట్ ఇళ్ల యజమానులు ఇసుకను సులభంగా పొందేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, అక్రమ రవాణాను అరికట్టవచ్చని తెలిపారు.
ADB: నెరడిగొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉగాది పండుగను నిర్వహించారు. అన్నదాతలు తమ బసవన్నల కొమ్ములకు రంగులు వేసి, పూలతో అలంకరించి పొలాలకు తరలివెళ్లారు. వివిధ రకాల నైవేద్యాలతో భూమాతకు, పశువులకు పూజలు చేశారు. పశు వైద్యాధికారి డాక్టర్ జీవన్ మాట్లాడుతూ.. మన పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కోరారు.
PDPL: ధర్మారం మండలం పత్తిపాకలో యువశక్తి యూత్ సభ్యులు ఉగాది సందర్భంగా ఇంటింటికి కాషాయ జెండాలు పంపిణీ చేశారు. గ్రామస్తులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూ ధర్మం ప్రకారం ఉగాది పండుగ తెలుగు నూతన సంవత్సరానికి ప్రారంభమని తెలిపారు. యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేష్, మందాల హరీష్, సభ్యులు పాల్గొన్నారు.
SRCL: వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలోని తెట్టెకుంట వద్ద బస్ స్టాప్ ఏర్పాటుకు ఉగాది పండుగ సందర్భంగా శ్రీకారం చుట్టారు. బస్టాప్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై సర్పంచ్ ముత్త సంజన మహేష్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్ధిపేట, కరీంనగర్-1, కరీంనగర్-2 ఆర్టీసీ డిపో మేనేజర్లతో సంప్రదించి బస్ స్టాప్కు అనుమతి పొందారు.