RR: షాద్నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అధికారితో పాటు సంబంధిత సిబ్బంది సమయానికి హాజరు కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలు వచ్చిన ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని, కనీసం కార్యాలయంలో జవాబు ఇచ్చేవారు కూడా కరువయ్యారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి సకాలంలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన అవసరం ఉందని కోరారు.
BDK: పినపాక మండలంలోని రైతు వేదికలో జరుగుతున్న ఇంటింటి సర్వే సమావేశంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం పాల్గొని సర్వే అధికారులు, సర్వే సిబ్బందితో మాట్లాడారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సమగ్ర సర్వే ఉద్యోగులు విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గొంది గోపాలకృష్ణ, వివిధ శాఖల మండల అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
SRD: కంగ్టి మండల తడ్కల్ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం ఈసీసీడే పురస్కరించుకొని పూర్వ బాల్యారంబ దశ, సంరక్షణ, విద్య దినోత్సవ కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ ప్రేమల ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి కేంద్రానికి విచ్చేసిన తల్లిదండ్రులకు చిన్నారుల ప్రతిభను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా లలిత, చిన్న పిల్లలు, తల్లులు, ఉన్నారు.
NGKL: చారగొండ మండలం శాంతిగూడెంలో మురికి కాలువలో పడి ఊపిరి ఆడక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అతని వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్పారు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. మరణించిన వ్యక్తి వివరాలు తెలిస్తే చారగొండ ఎస్సై 8712657758, వెల్దండ సిఐ 8712657755 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
MHBD: మున్సిపాలిటీ పరిధిలోని కంబాలపల్లి చెరువులో శుక్రవారం ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేపల వ్యాపారం ద్వారా మత్స్యకారులు వ్యాపారులుగా ఎదగాలని తెలిపారు. మత్స్య సంపద అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.123 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు వెల్లడించారు.
MNCL: మంచిర్యాలలోని మార్క్స్ భవన్లో ఈ నెల 26, 27 తేదీలలో జరగనున్న పీడీఎస్యూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీకాంత్ పిలుపునిచ్చారు. శుక్రవారం లక్షెట్టిపేటలో ఆయన మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాసభలలో విద్యారంగ సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
BDK: మావోయిస్టు నాయకులను, సానుభూతిపరులను, ప్రజలను పెద్ద ఎత్తున బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేస్తున్నారని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగిస్తున్న నరమేధాన్ని వెంటనే నిలిపివేయాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో టేకులపల్లి సెంటర్లో శుక్రవారం నిరసన చేపట్టారు.
NZB: ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష రక్షణ వేదిక మాజీ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, 28 తేదీల్లో విజయవాడలో జరగనున్న ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి NZB జిల్లాకు చెందిన రచయిత ప్రేమ్ లాల్ ఆహ్వానం అందుకున్నారు. ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి పిలుపు రావడం పట్ల ప్రేమ్ లాల్ ఆనందం వ్యక్తం చేశారు. సాహితీ మిత్రులు శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.
VKB: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం వయసు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని బషీరాబాద్ మండల వీఆర్ఏల జేఏసీ కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు ఇవాళ తహశీల్దార్ షాహిద్ బేగంకు వినతిపత్రం అందజేశారు. కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
KMR: ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి అన్నారు. భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డిలో లయన్స్ క్లబ్ స్నేహబంధు ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. వారికి వైద్యులు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
VKB: డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో వరంగల్లో జరగనున్న పీడీఎస్యూ 23వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొజ్జి శ్రీకాంత్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఈ సభలు కీలకమన్నారు.
HYD: విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్, కండక్టర్లపై దాడులకు పాల్పడటం సహించరాని నేరమని ఆర్టీసీ సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి హెచ్చరించారు. కార్మికులపై దాడులు చేసే వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంస్థ పరంగా కార్మికులకు పూర్తి భద్రత, భరోసా ఉంటుందని నాగిరెడ్డి హామీ ఇచ్చారు.
WNP: సెల్ఫోన్ మిస్ అయిన లేదా చోరీకి గురి అయిన సీఈఐఆర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్ స్టేషన్కు నేరగా వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. దీంతో ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించి యజమానులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి అవకాశాలను సద్వినియం చేసుకోవాలన్నారు.
GDWL: పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఓ వరం లాంటిదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవిమ్మ కుటుంబ సభ్యులకు CMRF నుంచి మంజూరైన రూ.1.50 లక్షల విలువైన LOC లెటర్ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.