MNCL: బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్ బస్తీకి చెందిన వర్షిత మరణించింది. పుట్టెడు దుఃఖంలోనూ ఆమె తల్లిదండ్రులు వర్షిత నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. LV ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు సేకరించిన ఈ నేత్రాల ద్వారా మరో ఇద్దరికి చూపు లభించనుంది. స్వచ్ఛంద సంస్థ సహకారంతో జరిగిన ఈ సాహసోపేత నిర్ణయాన్ని పలువురు కొనియాడారు.
GDWL: కొత్త ఏడాదిలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని అని కే.టి.దొడ్డి ఎస్సై శ్రీనివాసులు పేర్కొన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని, గురువారం ఆయన మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎస్సైకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
GDWL: ఉగాది పర్వదినం రోజున ధరూర్ మండల పరిధిలోని ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో శ్రీ ఆంజనేయస్వామి, సీతారామచంద్రస్వామి, వేంకటేశ్వరస్వామి, శివాలయాల నిర్మాణానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి గుడి, బడి ప్రాణాధారాలు అని అన్నారు. త్వరలో పనులు పూర్తి చేసి చేస్తామన్నారు.
SDPT: అక్కన్నపేట మండలం రామవరంలో ఉగాది పండుగను పురస్కరించుకొని బీరప్ప అక్కా మహంకాళి ఆలయం వద్ద సంప్రదాయంగా ఉగాది వేడుకలను కురుమ కుల బాంధవుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు పొన్న గంగాధర్, నరసింహ, పొన్న కర్ణాకర్ గజెల్లి పరిసరాములు తదితరులు ఉన్నారు.
MBNR: జిల్లా కోర్టులో ఈనెల 28న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ప్రేమలత తెలిపారు. రాజీ పడదగ్గ కేసులను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని,”రాజీ మార్గమే రాజమార్గం” అని ఆమె పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 1,334 కేసులను గుర్తించామని, అందులో 32 కేసులను పరిష్కరించామని వెల్లడించారు. సివిల్, కుటుంబ కలహాలు, ప్రమాద బీమా వంటి కేసులు పరిష్కరిస్తామన్నారు.
SRD: ఆధునిక విద్యా సదుపాయాలతో భవిష్యత్ తరాల అభివృద్ధికి సమీకృత పాఠశాల కీలకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. గురువారం సిర్గాపూర్ మండలం వాలు తండా వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించిన ఆయన, సంబంధిత అధికారులు మరియు కాంట్రాక్టర్లతో సైట్ ప్లాన్, డిజైన్లపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
WNP: కానాయిపల్లి కోటిలింగేశ్వర దేవస్థానం గురువారం తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు తెల్లవారుజామునే లేచి కొత్త వస్త్రాలు ధరించి దేవాలయానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో కోటిలింగేశ్వరుడిని, స్వర్ణ కవచ పంచలోహ శివలింగాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఆలయకమిటీ భక్తులకు షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని వితరణ చేశారు.
PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ రూ. 2,00,116 విరాళంగా అందజేశారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ వీర్ పాల్ ఆధ్వర్యంలో ఆలయం వద్ద నాయకులు గంగపుత్రులకు అందించారు. గతంలో సైతం రూ.1,00,000 అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి గంగపుత్రులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో AMC, VC లింగయ్య, నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్ నగరంలోని అలుగునూరు వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పురస్కరించుకుని మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
PDPL: రామగుండంలోని ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ ఉద్యోగులకు ఉగాది పచ్చడి అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో క్వాలిటీ జనరల్ మేనేజర్ సుజోయ్ మజుందార్, ఏజీఎం నాగేశ్వర్ రావు, చిలుక శ్రీనివాస్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MNCL: రంజాన్ పండుగను పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలోని పేద ముస్లిం కుటుంబాలకు రూరల్ సీఐ హనుక్ పండుగ కానుకలను అందజేశారు. గురువారం తన సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువుల తోఫాను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబంలో పండుగ సంతోషాలు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వార్డు ప్రముఖులు పాల్గొన్నారు.
BHNG: మోత్కూర్లో ఉగాది పండుగను విభిన్నంగా జరుపుకోవడం శతాబ్దాల నుంచి వస్తోన్న ఆచారం. ఉగాది వేళ గ్రామంలోని ముత్యాలమ్మకు బోనాలు సమర్పించి, కోళ్లు, మేకలను బలి ఇస్తారు. ఎడ్ల బండ్లలను తిప్పుతూ సంబరాలు చేస్తారు. పూర్వకాలంలో ఈ గ్రామంలో మశూచి తాండవించిందని, వ్యాధి నుంచి కాపాడిన అమ్మవారికి ఉగాది రోజు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు తెలిపారు.
MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట దేవాలయం అర్చకులు జక్కాపురం జయ స్వామి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. పరాభవ నామ సంవత్సరం సందర్భంగా గురువారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో అర్చకులు జక్కాపురం జయ స్వామికి దేవాదాయ అధికారులు ఉగాది పురస్కారం అందుకున్నారు. దీంతో ఆయనకు ఈవో సంకటాల శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
BDK: ఉగాది పండుగను పురస్కరించుకుని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా వారు ఉగాది పచ్చడిని కాంగ్రెస్ నాయకులకు పంచారు. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంతోషకరంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
SRCK: వేములవాడ కోర్టులో ఉగాది పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి మాట్లాడుతూ.. ఉగాది పండుగ కొత్త ఆరంభాలకు ప్రతీక అని, ఈ పండుగ అందరికీ శుభం కలిగించాలన్నారు. ఏజీపీ భాను కృష్ణ, సీనియర్ న్యాయవాదులు గడ్డం సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.