SRPT: సరైన పోషకాహారం ఉంటే రక్తహీనతను నివారించవచ్చు అని అంబేద్కర్ నగర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రమ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆకుకూరలు, పాలు అధికంగా తీసుకోవాలని సూచించారు.
HYD: JNTUH కాలేజీలో పలు ఇంజినీరింగ్ విభాగాలకు హెచ్ఐడీలను మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్ హెచ్ఐడీగా ప్రొ.జనార్ధన్ యాదవ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనేషన్ విభాగాధిపతిగా అసోసియేట్ ప్రొఫెసర్ మాధవీ కుమారి, మెటలర్జికల్ హెచ్ఐడీగా ప్రొఫెసర్ దేవకి రాణిలను నియమిస్తూ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రావు ఆదేశాలు జారీ చేశారు.
SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను గురువారం ప్రజాప్రతినిధులు అధికారులు పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి పంటల నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈ అకాల వర్షం వల్ల తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందన్నారు.
KMM: నేలకొండపల్లి, ముదిగొండ మండలంలో ధాన్యం అమ్ముకునేందుకు తిప్పలు తప్పడం లేదని రైతులు వాపోయారు. గురువారం పలువురు రైతులు మాట్లాడుతూ.. మిల్లర్లు తాము పండించిన ధాన్యాన్ని నేరుగా మిల్లుకు తీసుకురావాలని చెప్తున్నట్లు పేర్కొన్నారు. మిల్లుకు ధాన్యం తరలిస్తే రూ.1800లకు కొనుగోలు చేస్తామని, ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్ అందిస్తామని చెప్తున్నట్లు తెలిపారు.
MNCL: జన్నారం మండలంలోని దేవునిగూడ గ్రామంలో మండల అధికారులు సన్న బియ్యం భోజనం చేశారు.. ఆ గ్రామానికి చెందిన లబ్ధిదారులు మడావి బాదిరావు, లింగారెడ్డితో కలిసి గురువారం మధ్యాహ్నం తహసీల్దార్ రాజా మనోహర్ రెడ్డి, ఎంపిడిఓ షరీఫ్, డిప్యూటి తహసీల్దార్ రామ్మోహన్, ఆర్ఐ భానుచందర్ సన్న బియ్యం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్, కార్యదర్శి సరితా ఉన్నారు.
NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పీఏపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, పీఏపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అదనపు గదుల ప్రారంభోత్సవం, కొండమల్లేపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, దేవరకొండలో పోషణ్ అభియాన్ కార్యక్రమం, మైనంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ చేస్తారు.
SRD: హత్నూరలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలకు 10 కంప్యూటర్లను కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జేఈఈ, నీట్ కోచింగ్ కోసం ఈ కంప్యూటర్లను అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన్, వైస్ ప్రిన్సిపల్ శ్రీకాంత్, ఫిజికల్ డైరెక్టర్ గణపతి పాల్గొన్నారు.
KMM: వేసవి తీవ్రత నేపథ్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ గురువారం మార్కెట్ కమిటీ చైర్మన్ను కలిశారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ.. రైతులు, కూలీల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వెంటనే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
SRD: రాష్ట్రీయ సప్తహ్ ఆవిష్కార కార్యక్రమానికి ఎంపికైన 78 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వినియోగ పత్రాలు సమర్పించాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన నిధులను నేరుగా ఆయా పాఠశాల ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు.
SRD: జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్కు వచ్చిన వారికి చలివేంద్రం ద్వారా చల్లని నీరు అందించడం అభినందనీయం అని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పాల్గొన్నారు.
KNR: ట్రాక్టర్తో పాటు ఓ చిన్నారి బావిలో పడి మృతి చెందిందని రూరల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన కరీంనగర్ రూరల్లో బహదూర్ ఖాన్ పేటలో చోటుచేసుకుంది. బొమ్మరెడ్డిపల్లెకు చెందిన జశ్విత బంధువుల ఇంటికి బహుదూర్ ఖాన్ పేటకు వచ్చింది. వ్యవసాయ బావి వద్ద ట్రాక్టర్ సీటులో కూర్చుని తాళం తిప్పడంతో ట్రాక్టర్తో సహా బావిలో పడి మృతి చెందింది.
PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG-1 ఏరియాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గోదావరిఖని RCOA క్లబ్ ఆవరణలో క్వార్టర్స్ కౌన్సెలింగ్ నిర్వహించారు. అధికారులు గోపాల్ సింగ్ పాల్గొని ఉద్యోగులకు క్వార్టర్లను కేటాయించారు. ఈ కౌన్సెలింగ్ పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. నాయకులు ఆరెల్లి పోషం, అధికారులు శ్రావణ్ కుమార్, హనుమంత రావు పాల్గొన్నారు.
వరంగల్: ఎంపీ కడియం కావ్య పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘డా. కడియం కావ్య మీకు హృదయపూర్వక పుట్టినరోజుకు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మీ జీవితం ఆనందం, శాంతి మరియు శ్రేయస్సుతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను’ అని శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాసారు.
WGL: చెన్నారావుపేట మండలం ఝల్లి పరిధి బోడతండాకు చెందిన మోహన్ అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. మోహన్ CMRF కోసం దరఖాస్తు చేసుకోగా.. రూ.40 వేల చెక్కు మంజూరైంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి గురువారం ఉదయం బాధితుడి ఇంటికి వెళ్లి ఈ చెక్కును అందించారు.
జనగామ: ప్రభుత్వ నిషేధిత అంబర్, గుట్కాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీదేవి తెలిపారు. తరిగొప్పులలోని ఓ కిరాణ దుకాణంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.13వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని దుకాణ నిర్వాహకుడు నర్సింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు