• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. వెలవెలబోయిన చికెన్ షాపులు

KMM: కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ వ్యాధిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో ప్రజలు చికెన్ కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఆదివారం అయినా వైరా మున్సిపాలిటీలో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. అసత్య ప్రచారం మానుకోవాలని, దీని వల్ల తమ వ్యాపారానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందని చికెన్ షాప్ యాజమానులు మండిపడ్డారు. అలాగే ప్రజలు చేపలు, మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు.

February 16, 2025 / 11:01 AM IST

దండేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రం

MNCL: దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ మండలంలోని తాళ్లపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి పోతు సత్తయ్య తెలిపారు. గతంలో నిర్వహించిన కుటుంబ సర్వేలో పేర్లు నమోదు చేయించుకోని వారు ఆ కేంద్రంలో నమోదు చేయించుకోవచ్చన్నారు.

February 16, 2025 / 10:05 AM IST

HYDలో చికెన్ తింటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి: పోలీసులు

HYD: HYDలో చికెన్ ప్రియులకు అలర్ట్. నగరంలో ఇటీవల కల్తీ చికెన్‌ను గుర్తించిన పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. చికెన్ నాణ్యత విషయంలో జాగ్రత్త, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ ఆర్డర్ చేయడానికి ముందు తనిఖీ చేయండి. వైన్ షాపుల పక్కనే విక్రయించే మాంసం విషయంలో మరింత జాగ్రత్త అవసరం అన్నారు. చికెన్ విక్రయదారులపై అనుమానం వస్తే వెంటనే 100కు డయల్ చేయ్యాలన్నారు.

February 16, 2025 / 10:00 AM IST

సికింద్రాబాద్ నుంచి నడిచే ఆ ట్రైన్‌కు కోచ్‌ల కుదింపు

HYD: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ చేదువార్త తెలిపింది. సికింద్రాబాద్-నాగపూర్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 కోచ్‌లతో నడుస్తుండగా ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 8 కోచ్‌లకు కుదిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్ ప్రారంభించినప్పటి నుంచి సగం సీట్లు కూడా నిండకపోవడమే కారణం అన్నారు.

February 16, 2025 / 09:39 AM IST

కీసరగుట్ట లో బస్టాప్ ఏర్పాట్లు

మేడ్చల్: కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని 6 రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. HYDలోని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు గ్రేటర్ HYD జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, SEC రీజినల్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. శనివారం RTC ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి బస్టాప్ సిద్ధం అయింది అని తెలిపారు.

February 16, 2025 / 08:33 AM IST

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

JGL: మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామ శివారులోని చెరువు వద్ద శనివారం రాత్రి ట్రాక్టర్, బైక్ ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ముద్దంగుల కిష్టయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 16, 2025 / 08:12 AM IST

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మంచిర్యాల జిల్లా వాసి

MNCL: చెన్నూర్కు చెందిన లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఏల్పుల పోచం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించుకున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లైవ్ డ్రాయింగ్ యాత్ర పూర్తి చేసిన తొలి ఆర్టిస్టుగా ప్రఖ్యాతి గాంచారు. భారతదేశ నలుమూలల తిరుగుతూ చిత్రకళ ద్వారా ప్రాచీన ప్రస్తుత వారసత్వ సంపదను, లైవ్ డ్రాయింగ్ అధ్యయనం చేసి రికార్డు నెలకొల్పాడు.

February 16, 2025 / 07:01 AM IST

క్రమంగా తగ్గుతున్న ఎస్సారెస్పీ నీటిమట్టం

NZB: మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 1078.30 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో 40.583 టీఎంసీల నీటి నిలువ ఉంది. మిషన్ భగీరథ కోసం 231 క్యూసెక్కుల నీటిని కేటాయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు నుంచి నీటి ఆవిరి రూపంలో 309 క్యూసెక్కులు క్రమంగా తగ్గుతుందన్నారు.

February 16, 2025 / 06:20 AM IST

మార్చి 2న కామారెడ్డిలో హాఫ్ మారథాన్

కామారెడ్డి: చైల్డ్ హుడ్ కేన్సర్ పై అవగాహన కోసం పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హాఫ్ మారథాన్ నిర్వహించనున్నట్లు పద్మపాని సొసైటీ చైర్మన్ సత్య నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. విద్యా సంస్థల సహకారంతో మార్చి 2న స్టేట్ లెవల్ కామారెడ్డి హాఫ్ మారథాన్ కార్యక్రమం ఉంటుందన్నారు.

February 16, 2025 / 06:01 AM IST

దర్గా స్థలాన్ని కాపాడండి: ఎంఐఎం

NZB: నగరంలో ఎంఐఎం నగర అధ్యక్షుడు మహమ్మద్ షకీల్ అహ్మద్ శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలోని దర్గా, స్మశాన వాటిక స్థలంలో అక్రమంగా మొరం తవ్వుతున్నారన్నారు. స్థలాన్ని కాపాడాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్‌కు వివరించారు.

February 16, 2025 / 05:49 AM IST

భోజనంలో బొద్దింక

HYD: గచ్చిబౌలిలోని ఓ రెస్టారెంట్‌లో ఆహారంలో బొద్దింక దర్శనమిచ్చింది. బాధితుడు రాజేశ్ వివరాలు.. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినే సమయంలో ప్లేట్‌లో చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయాడు. దీనిపై GHMC అధికారులు చర్యలు తీసుకోవాలి అని రాజేశ్ కోరాడు.

February 15, 2025 / 08:19 PM IST

ఓపెన్ జిమ్‌లో ఇదీ పరిస్థితి సారూ..

HYD: ఉప్పల్ జీహెచ్ఎంసీ మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు కొన్ని పనిచేయడం లేదని అక్కడికి వెళ్లిన ప్రజలు తెలిపారు. వెంటనే రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని, లేదంటే ఎవరైనా తెలియకుండా ఉపయోగిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాపోయారు.

February 15, 2025 / 08:09 PM IST

విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న మంత్రి పొన్నం

SDPT: హుస్నాబాద్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 15, 2025 / 08:07 PM IST

డీఎస్సీ 2008 అభ్యర్థులకు పోస్టింగ్

SRD: డీఎస్సీ 2008 అభ్యర్థులకు కలెక్టర్ కార్యాలయంలో శనివారం పోస్టింగ్ ఉత్తర్వులను అదనపు కలెక్టర్ మాధురి చేతుల మీదుగా ఇచ్చారు. మొత్తం 62 మందికి ఉపాధ్యాయ ఉద్యోగుల పోస్టింగ్ ఇచ్చినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వర్లు, DCEB కార్యదర్శి లింభాజీ, సెక్టోరియల్ అధికారులు వెంకటేశం, అనురాధ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

February 15, 2025 / 08:05 PM IST

SKLలో వివరాలను నమోదు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

KMR: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఇటీవల పాల్గొనని కుటుంబాల వివరాలు ఈ నెల 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో నమోదు చేసుకొనని కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుకునే విధంగా ప్రభుత్వం మరొక అవకాశం కల్పించిందని తెలిపారు.

February 15, 2025 / 07:10 PM IST