KMM: సత్తుపల్లి మండలం యాతాలకుంట అటవీ ప్రాంతంలో మంగళవారం ఓ ఆటోను అడవి దున్నలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలైయ్యాయి. చుంచుపల్లి మండలం పెనగడపకు చెందిన ఐదుగురు కూలీలు సత్తుపల్లిలో పని నిమిత్తం ఆటోలో వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ శివ, కూలి ఓదేలకు గాయాలయ్యాయి. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అదిస్తున్నారు.
HYD: షేక్పేట్ డివిజన్ MIM కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ మంగళవారం జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పెండింగ్ అభివృద్ధి పనులు, కొనసాగుతున్న పనులపై చర్చించారు. పెండింగ్ పనులను త్వరగా ప్రారంభించేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం నడుస్తున్న పనుల్లో వేగం పెంచేలా చూడాలన్నారు. గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు.
KMM: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రఘునాధపాలెం మండల పరిధిలోని మంచుకొండ గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించారు. కూలీలకు రోజుకి రూ 600 ఇవ్వాలని అన్నారు. అనంతరం కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్స్ అందజేశారు.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని 4 సంవత్సరాల బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాలమూరు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం అధికారి రాజకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ప్రకటన విడుదల చేశారు. పరీక్షల తేదీలను త్వరలో వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు పేర్కొన్నారు.
NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు మండలాల్లో ప్రతిరోజూ సాయంత్రం వరకు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అనంతరం ఆకాశంలో మబ్బులు ఏర్పడి ఒక్కసారిగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ధాన్యం తడిసిపోవడం, మామిడికాయలు రాలిపోవడంతో రైతులు నష్టపోతున్నారు.
NZB: ప్రభుత్వం ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా బెదిరింపు ధోరణితో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తప్పుపట్టారు. ఉద్యోగులను అవమానించేలా, బెదిరించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో, పునర్నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు.
ADB: నీట్లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఉట్నూరుకు చెందిన రాయి మనోజ్ కుమార్ అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై మనోహర్ తెలిపారు. మొన్న జరిగిన నీట్లో విద్యార్థి HYDలో పరీక్ష రాసి సోమవారం ఉట్నూర్ వచ్చాడు. పరీక్ష బాగా రాయలేదని మనస్తాపం చెంది తన రూమ్లో ఫ్యానుకు ఉరేసుకున్నాడు.
MNCL: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంగళవారం తాండూర్, కన్నెపల్లి మండలాల్లో పర్యటించనున్నారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 10 గంటలకు తాండూర్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ అనంతరం మండల కేంద్రంలో జై బాబు, జై భీమ్, జై సమ్మిదాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. కన్నెపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.
ADB: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం DOST నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ADB జిల్లా విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్లో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జె. సంగీత తెలిపారు. మే 3 నుంచే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ సెంటర్ను సందర్శించాలన్నారు.
SRPT: సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టే అవకాశం ఉందని సీఐ రఘువీర్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుమలగిరిలో ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల వల్ల భద్రత ప్రమాణాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివారణకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
SRPT: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదు దారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. పిర్యాదుదారులకు భరోసా కల్పించాలని అన్నారు.
SRPT: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్సై అజయ్ కుమార్ అన్నారు. సోమవారం నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురంలో గ్రామంలో సైబర్ నేరాలు, గంజాయిపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని అన్నారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు.
SRPT: వేసవిలో త్రాగు నీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ అన్నారు. మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలతో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో, పంచాయతీ కార్యదర్శులతో ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని అన్నారు. ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉందని దృష్టికి వస్తే వెంటనే స్పందించి ఆసమస్యను పరిష్కరించాలని తెలిపారు.
SRPT: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో 97 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
NZB: ఇందల్వాయి మండల పరిధిలోని గౌరారం సబ్జెస్టేషన్ పరిధిలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించినట్లు ట్రాన్స్కో AE రవీందర్ తెలిపారు. సోమవారం సబ్ స్టేషన్లో రూ.కోటితో అదనంగా ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. గౌరారం, లింగాపూర్, జీకే తండాలో విద్యుత్ సరఫరాలకు ఇబ్బందులు తప్పనున్నాయన్నారు.