• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల నిరసనలు

HYD: ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ టీపీసీసీ నిరసనలు చేపట్టనుంది. శనివారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగనుంది. ఆదివారం నాడు టీపీసీసీ ఆధ్వర్యంలో జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ పిలుపునిచ్చారు.

December 19, 2025 / 03:25 PM IST

‘రూపాయి ఖర్చు చేయకున్నా సర్పంచ్‌గా గెలిపించారు’

SRCL: గంభీరావుపేట గ్రామ ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారు. ఏ పార్టీ మద్దతు లేకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా పోటీచేసిన మల్లుగారి పద్మ నర్సాగౌడ్‌ను 2,483 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలిపించారు. ‘సేవ చేస్తాను-రూపాయి ఖర్చు పెట్టను’ అంటూ ఎన్నికల బరిలోకి దిగిన పద్మకు 4,109 ఓట్లు పడ్డాయి. బ్యానర్లు, మైకులు లేకుండా సర్పంచ్‌గా పోటీ చేశారు.

December 19, 2025 / 03:24 PM IST

కీసర అటవీప్రాంతంలో మహిళ అస్థిపంజరం లభ్యం

MDCL: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి మల్లన ఆలయం సమీప అటవీప్రాంతంలో గుర్తు తెలియని మహిళ అస్థిపంజరం లభ్యమైంది. కీసర ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందినది మహిళ అని, సంఘటన జరిగి రెండు మూడు నెలలు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. కీసర పోలీసులు కేసు నమోదు చేశారు.

December 19, 2025 / 03:24 PM IST

TU పరిధిలో బీపీఎడ్ పరీక్షల ఫీజు తేదీల విడుదల

NZB: తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిసెంబర్-2026 విద్యా సంవత్సరం బీపీఎడ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైనట్లు పరీక్షల నియంత్రణ అధికారి కే. సంపత్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. బీపీఎడ్​ ఒకటో, మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులుకు, బ్యాక్​లాగ్​ పరీక్ష ఫీజును డిసెంబర్​ 27వ తేదీలోపు చెల్లించాలన్నారు.

December 19, 2025 / 03:20 PM IST

ఈనెల 21న జిల్లా క్రాస్ కంట్రీ పోటీలు

JGL: కథలాపూర్ మండలం ఊట్పల్లిలో ఈనెల 21న జిల్లా క్రాస్ కంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి తెలిపారు. ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీల కోసం జిల్లా స్థాయి సెలక్షన్ కం టోర్నమెంటు, ఊటుపల్లి మాజీ సర్పంచ్ కీ.శే. గాజెల్లీ బుచ్చి రాజం స్మారకార్థం నిర్వహిస్తున్నట్లు ఏలేటి ముత్తయ్య రెడ్డి తెలిపారు.

December 19, 2025 / 03:16 PM IST

కాలుజారి కిందపడి వ్యక్తి మృతి

HYD: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ కాలనీలో వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గండీడ్‌కు చెందిన దామం అంజయ్య (42) ఇంట్లో కాలుజారి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతంలో అంజయ్యకు గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

December 19, 2025 / 03:12 PM IST

సైబర్ నేరాల అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన ఎస్పీ

MHBD: సైబర్ నేరాల నివారణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్లను శుక్రవారం జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. ఆకర్షణీయ ఆఫర్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్‌ను నమ్మవద్దని, అలాంటివి లేవని స్పష్టం చేశారు.

December 19, 2025 / 03:08 PM IST

‘ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలి’

SRCL: గ్రామపంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల కోసం చేసిన ఖర్చుల వివరాలు సమర్పించాలని అధికారులు కోరారు. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులందరికీ ఎంపీడీవో కార్యాలయాల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజులలోగా ఎన్నికల ఖర్చుల సమగ్ర వివరాలను ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేయాలన్నారు.

December 19, 2025 / 03:08 PM IST

గ్రూప్-3లో మాచర్ల యువకుడి ఎంపిక

GDWL :ఇటీవల విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో మండలంలోని మాచర్ల గ్రామానికి చెందిన వినీత్ విజయం సాధించి అధికారిగా ఎంపికయ్యారు. సామాన్య కుటుంబానికి చెందిన వినీత్ పట్టుదలతో శ్రమించి ఉద్యోగం సాధించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం గ్రామంలో ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

December 19, 2025 / 03:07 PM IST

ప్రధాన రోడ్డుపై గుంతలు పూడ్చిన బీజేపీ శ్రేణులు

GDWL: అయిజ కొత్త బస్టాండ్ నుంచి కర్నూలు చౌరస్తా ప్రధాన రోడ్డుపై తెలంగాణ చౌరస్తాలో మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తవ్విన గుంతలు ప్రమాదకరంగా మారాయి. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ కంపాటి భగత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం గుంతలకు గ్రావెల్ వేసి చదును చేశారు. వాహనదారులు వారి సేవలను ప్రశంసించారు.

December 19, 2025 / 03:06 PM IST

స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన DCC అధ్యక్షుడు

BHPL: జిల్లా కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయ సమీపంలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇవాళ స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా DCC జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ హాజరై.. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

December 19, 2025 / 03:02 PM IST

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం: మంత్రి

BDK: కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజాప్రతినిధుల అభినందన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యానికి కాంగ్రెస్‌ పార్టీనే పునాదని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70 శాతానికిపైగా స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ప్రజల నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.

December 19, 2025 / 03:00 PM IST

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలపై కవితకు వినతి

BDK: సింగరేణి ఉత్పత్తిలో పనిచేస్తున్న 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, సంక్షేమంపై స్పందించాలని కోరుతూ IFTU ఆధ్వర్యంలో కార్మికులు కల్వకుంట్ల కవితకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మణుగూరు పర్యటనలో భాగంగా పీకే-2 ఓసీ వద్ద ఆమెను కలిసిన కార్మికులు వేతనాల పెంపు, పెనాల్టీల రద్దు, అనారోగ్య సమయంలో వేతన కోత నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

December 19, 2025 / 02:56 PM IST

చేపల వేటకు వెళ్లి మత్స్య కారుడి మృతి

JGL: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన మల్యాల మండలం నూక పెళ్లి గ్రామంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన దువ్వాక నర్సయ్య అనే మత్స్యకారుడు ఉదయం చేపలు పట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు చేపలవలలో చిక్కుకొని మృతి చెందాడు. నర్సయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూడగా వలలో చిక్కుకొని విగతాజీవిగా మారాడు.

December 19, 2025 / 02:55 PM IST

నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానించిన చిన్నారెడ్డి

WNP: గ్రామపంచాయతీ సర్పంచులుగా ఘన విజయం సాధించిన వారిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సన్మానించి అభినందించారు. జిల్లాలోని చిన్నారెడ్డి స్వగృహం నందు ఆయన నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో లభించిన విజయం కేవలం పదవి మాత్రమే కాదని అది ప్రజలు అప్పగించిన గొప్ప బాధ్యత అని అన్నారు.

December 19, 2025 / 02:50 PM IST