HNK: భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామం కమ్యూనిటీ హాల్లో నేడు మహిళ శిశు సంక్షేమ శాఖ, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సఖి యొక్క ముఖ్య ఉద్దేశాలు, అందించిన సేవలను తెలియజేయుటకు లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి, సఖి సెంటర్ కేస్ వర్కర్ అనూష, శోభారాణి పాల్గొని సఖి సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశాలు వివరించారు.
KMR: పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. కలెక్టరేట్లో ఫోక్సో చట్టంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ హాజరై.. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్కి బ్యాడ్జీలు ప్రధానం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.
MNCL: తాండూర్ మండలం గోపాల్ నగర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో శనివారం పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ బీట్ ఆఫీసర్ గోపికృష్ణ నిర్ధారించడం కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న మంచినీటి బావి వద్ద పులి పాదముద్రలను అధికారులు శనివారం గుర్తించారు. స్థానిక రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
HYD: రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతోందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ ఆరోపించారు. శనివారం విద్యానగర్ లోని బీసీభవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కన్వర్టెడ్ బీసీ అని సీఎం ప్రకటించారు.
KNR: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికే అఖండ మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీశ్రేణులకు, పట్టభద్రులకు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వీ.నరేందర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
SRCL: యువత మేలుకో అంటూ సిరిసిల్ల వైద్య కళాశాల ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్తూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అందరికీ స్ఫూర్తినిచ్చారు.
SRCL: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని 6 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వేములవాడ ప్యాక్స్ డైరెక్టర్ తోట రాజు కృతజ్ఞతలు తెలిపారు.
SRCL: నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో పోలీసులు, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రిచ వచ్చన్నారు.
KNR: పీఎం మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాహుల్ తాత పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ. సోనియా గాంధీ క్రైస్తవురాలు, ఇటలీ దేశస్తురాలు. ఇక రాహుల్ గాంధీకి కులం లేదు.. మతం, జాతి, దేశం లేదు. రాహుల్ కులంపై రేవంత్ ఏం సమాధానం చెప్తారు అని ఎద్దేవా చేశారు.
SRPT: నేరేడుచర్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, గిరిజన నాయకులు మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం సేవాలాల్ కృషి చేశారన్నారు.
KNR: హుజురాబాద్ నియోజకవర్గంలో నూతనంగా వివాహాలు చేసుకున్నపెళ్లి కూతురు తల్లిదండ్రులకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కాంగ్రెస్ మేనిపిస్టో ప్రకారం అందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.. జమ్మికుంట – 200, ఇల్లందకుంట – 58, వీణవంక -50 కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు మొత్తం 308 ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు తెలిపారు..
HYD: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఖైత్లాపూర్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా డెడ్ బాడీ ఉండడం గమనార్హం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
HYD: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్, ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు శనివారంతో ముగుస్తుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు స్థానిక ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఇంటర్వ్యూ తో పాటు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలను కల్పించనున్నారు. ఇతర సందేహాల కొరకు office@des.iith.ac.in మెయిల్ చేయాలన్నారు.
KNR: కొత్త ఆదాయపు పన్ను 2025ను పరిశీలించటానికి లోక్సబ స్పీకర్ ఓం బిర్లా సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటిలో 31 మంది ఎంపీలను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కి చోటు దక్కింది. దీంతో హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
KMM: మధిరలో దళిత జవాన్ మనోజ్పై అగ్రవర్ణుల దాడిని ఖండిస్తూ శనివారం బీఎస్పీ నేతలు చింతకాని పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి నాగేశ్వరరావు స్పందిస్తూ, దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి డిప్యూటీ సీఎం బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.