• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ రాంప్రసాద్ నేతృత్వంలో పాశాల లింగయ్య ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఈ బియ్యం బయటపడింది. ఈ మేరకు అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 19, 2026 / 02:43 PM IST

ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు

ASF: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలో గురువారం ఉగాది పండగను ఘనంగా జరుపుకున్నారు. శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా తయారుచేసిన ఉగాది పచ్చడిని ప్రజా ప్రతినిధులకు, నాయకులకు పంపిణీ చేసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ ఛైర్మన్ ఎండీ అహ్మద్ పాల్గొన్నారు.

March 19, 2026 / 02:40 PM IST

నాయి బ్రాహ్మణ క్యాలెండర్ ఆవిష్కరణ

BHNG: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నాయి బ్రాహ్మణ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మోటకొండూరు మండల కేంద్రంలో గురువారం ఘనంగా జరిగింది. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మోటకొండూరు సర్పంచ్ భూమండ్ల జయమ్మ, శ్రీనివాస్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

March 19, 2026 / 02:38 PM IST

ఈనెల 24న ఆందునాయక్ తండాలో ఉగాది ఉత్సవాలు

ADB: ఇంద్రవెల్లి మండలం ఆందునాయక్ తండాలోని శ్రీజ్వాలాముఖి దుర్గాభవాని అలయంలో ఈనెల 24న ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి రామ్ సింగ్ మహారాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆయుష్షు, ఆరోగ్యం, సంక్షేమం కోసం నిర్వహించే మహా కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలతో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొననున్నట్లు తెలిపారు.

March 19, 2026 / 02:35 PM IST

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే

MBNR: జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఎమ్మెల్యే తన వేతనం నుంచి రూ. 100000 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన టర్మ్ పూర్తయ్యే వరకు ప్రతినెల ఒక లక్ష సంక్షేమ నిధికి ఇస్తానన్నారు.

March 19, 2026 / 02:35 PM IST

రైతుబంధు అందుకున్న తొలి రైతు మృతి

KNR: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2018 మే 10న రైతుబంధు తొలి చెకును అందుకున్న రైతు మూగల సంజీవరెడ్డి(94) మరణించారు. హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన ఆయన ధర్మరాజుపల్లి ధాన్య విత్తన సంఘం, రైతుసేవా పురుషుల పొదుపు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా, అదేవిధంగా గ్రామ తొలి సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

March 19, 2026 / 02:35 PM IST

మల్లు స్వరాజ్యంకు జోహార్లు అర్పించిన నేతలు

NLG: నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కీలక పాత్ర పోషించారని సీపీఎం నేతలు ప్రశంసించారు. గడీలపై దాడులు చేసి ధాన్యాన్ని పేదలకు పంచడం వంటి ధైర్య సాహసాలను కొనియాడారు. చిట్యాలలో గురువారం ఆమె వర్ధంతి కార్యక్రమంలో నేతలు జోహార్లు అర్పించారు.

March 19, 2026 / 02:33 PM IST

BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా MLA దుస్తుల పంపిణీ

HYD: రంజాన్ మాసం సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముస్లిం పెద్దలు, ఇమామ్‌లు, మోజంలకు బట్టలు పంపిణీ చేశారు. పేదలకు, అర్హులైన కుటుంబాలకు సాయం చేయడం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, మైనారిటీ నాయకులు బద్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

March 19, 2026 / 02:31 PM IST

భార్యపై భర్త గొడ్డలితో దాడి

MHBD: భార్యపై ఓ భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన గురువారం కంబాలపల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన విజయ, నరేష్‌లు భార్యభర్తలు కాగా కుటుంబకలహాల నేపథ్యంలో నరేష్ విజయపై గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటనలో విజయకు తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విజయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

March 19, 2026 / 02:31 PM IST

ఎమ్మెల్యే సహకారంతో తీరిన ‘విద్యుత్’ కష్టాలు

NRPT: దామరగిద్ద మండలంలోని మల్ రెడ్డిపల్లి గ్రామంలో నెలకొన్న లో-వోల్టేజ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గురువారం సర్పంచ్ శ్వేత ఆధ్వర్యంలో గ్రామస్థులు ఈ సమస్యను ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆదేశాలతో రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించారు.

March 19, 2026 / 02:30 PM IST

‘ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా విద్యుత్ మీటర్లు ఇవ్వాలి’

JGL: ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ మీటర్లు ఇవ్వాలని కోరుతూ రాయికల్ పట్టణ వార్డు సభ్యులు భూస గంగ మల్లయ్య, అనుమల్ల రమ రాయికల్ విద్యుత్ ఏఈ నవీన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఇంటి నిర్మాణాలు పూర్తి కావస్తున్నందున, లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ స్తంభాలు వేసి కనెక్షన్లు ఇవ్వాలని కోరారు.

March 19, 2026 / 02:29 PM IST

కదిలి ఆలయంలో ఉగాది వేడుకలు

NRML: దిలావర్పూర్ మండలంలోని ప్రసిద్ధ శ్రీ మాతా అన్నపూర్ణ పాపహరేశ్వర ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమానికి గ్రామస్థులు పోటెత్తారు. వేద పండితులు వినిపించిన నూతన సంవత్సర ఫలితాలను భక్తులు ఆసక్తిగా విన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

March 19, 2026 / 02:28 PM IST

మార్కెట్‌లో శనగలు క్వింటా ధర ఇలా.!

KMR: డోంగ్లీ, మద్నూర్ మండలాల్లోని మార్కెట్‌లో శనగలు ప్రస్తుతం క్వింటాకు రూ.5,250 ధర పలుకుతోందని వ్యాపారులు తెలిపారు. 2 రోజుల్లో క్వింటాకు రూ.50 పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం త్వరలోనే ప్రారంభం కానుంది. రైతులు కొనుగోలు ఈ కేంద్రం ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రైవేటులో కంటే ప్రభుత్వ ధర క్వింటాకు రూ.600 వరకు ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు.

March 19, 2026 / 02:28 PM IST

4 గ్రామాలకు ఎంపీ నిధులు మంజూరు

NRPT: ధన్వాడ మండలంలోని ధన్వాడ, మంత్రోనిపల్లి, కంసాన్ పల్లి, కిష్టాపూర్ గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరయ్యాయని సర్పంచులు జ్యోతి రామచంద్రయ్య, రవికుమార్, కొండయ్య గురువారం వెల్లడించారు. మంజూరైన నిధులతో గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణకు కృతజ్ఞతలు తెలిపారు.

March 19, 2026 / 02:22 PM IST

గంగమ్మ తల్లికి మంగళహారతులు..!

SDPT: చిన్నకోడూరులోని గంగమ్మతల్లికి 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మంగళ హారతులు సమర్పించనున్నట్లు గంగపుత్ర సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, భక్తులకు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు.

March 19, 2026 / 02:20 PM IST