• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేత

WGL: మరణించిన పోలీస్ కుటుంబాలకు ఎప్పటికీ అండగా ఉంటామని సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో సందానందం అనే హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో గత సంవత్సరం సెప్టెంబర్ 13న మరణించాడు. ఈక్రమంలో పోలీసు భద్రత విభాగం నుంచి ఆయనకు రూ. 7 లక్షల 89 వేల 920 విలువైన చెక్కు మంజూరయింది. ఈ చెక్కును సీపీ ఈరోజు లబ్ధిదారునికి అందజేశారు.

April 10, 2025 / 10:25 AM IST

వాహనదారులకు అలర్ట్

ములుగు: ఏటూరునాగారానికి చెందిన స్థానికులు అటవీ శాఖ చెక్ పోస్ట్ వద్ద తమ వాహనాలకు ఫాస్టాగ్ మినహాయింపూ కోసం వాహన ఆర్సీ, ఆధార్ కార్డ్ అందజేయాలని అటవీశాఖ (దక్షిణం) రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు వివరాలు అందజేయాలని, లేని పక్షంలో వాహనాలకు ఎలాంటి మినహాయింపూ ఉండదని పేర్కొన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 10, 2025 / 10:08 AM IST

దమ్మపేటలో పోషణ పక్షం అవగాహన సదస్సు

BDK: దమ్మపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో గర్భిణీలకు అవగాహన కార్యక్రమం నిర్వక్షహించారు. ఆరోగ్యవంతమైన జీవనానికి, శారీరక మానసిక ఎదుగుదలకు పుట్టిన తొలి నాళ్లలో మొదటి 1000 రోజులలో తీసుకునే సమతుల్య, పోషకాహారం ఎంతో కీలకం అని జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా తెలిపారు. ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

April 10, 2025 / 08:09 AM IST

ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి: కలెక్టర్

KMM: మెరుగైన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వసతులు, వైద్య కళాశాలలో సౌకర్యాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. టాయిలెట్ల మరమ్మతులు చేయాలని పేర్కొన్నారు.

April 10, 2025 / 07:41 AM IST

కూతురిని చంపి తల్లి సూసైడ్

PDPL: పెద్దపల్లి టీచర్స్ కాలనీలో కూతురిని చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. జూలపల్లి వాసి వేణుగోపాల్ రెడ్డితో రామడుగుకు చెందిన సాహితికి పెళ్లైంది. బుధవారం రాత్రి వేణుగోపాల్ ఇంటికి వచ్చే సరికి కూతురు రితిన్యను చంపి భార్య ఉరేసుకుని కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 10, 2025 / 07:40 AM IST

పోలీసు జాగిలం యామి మృతి

KMM: పోలీస్ శాఖలో 9 ఏళ్లుగా విశేష సేవలందించిన పోలీసు జాగిలం యామి (ఫిమేల్ డాగ్) అనారోగ్యంతో మృతి చెందింది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనల మేరకు పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. యామి (జాగిలం) లబ్రాడార్ రిట్రీవర్ సంతతికి చెందింది.

April 10, 2025 / 04:22 AM IST

నల్లాలకు మోటార్లు బిగిస్తే ₹5వేలు ఫైన్, కనెక్షన్ కట్

HYD: తాగునీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తామని, మోటార్‌ను సీజ్ చేయడంతోపాటు నీటి కనెక్షన్ కట్ చేస్తామని జలమండలి ఎండీ హెచ్చరించారు. నగరంలో తాగునీటి సరఫరాపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 15 నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సూచించారు.

April 9, 2025 / 08:25 PM IST

45 కిలోల నిషేధిత నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

ASF: కాగజ్ నగర్ పట్టణంలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా అవుతున్నాయనే పక్కా సమాచారం మేరకు బుధవారం ట్రాన్స్‌పోర్ట్ దుకాణాలపై దాడులు చేసి 45 కిలోల నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ CI రాణ ప్రతాప్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.1,57,500 ఉంటుందని సీజ్ చేసిన విత్తనాలు కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు పేర్కొన్నారు.

April 9, 2025 / 08:09 PM IST

‘కల్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి’

KMR: కల్లు దుకాణాల్లో ఇకనుంచి విధిగా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని ఎస్సై అనిల్ అన్నారు. బుధవారం మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కల్లు దుకాణం దారులను, డిపో వారిని పిలిపించి ఎస్సై సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసారు. చిన్నపిల్లలను, మైనర్లను కల్లు కాంపౌండ్ లోనికి రానివ్వకూడదని హెచ్చరించారు.

April 9, 2025 / 07:57 PM IST

నర్రా రాఘవరెడ్డి స్మృతి గీతం ఆవిష్కరణ

NLG: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో నర్రా రాఘవరెడ్డి పేరున కవి ఏబూషి నర్సింహా రాసిన పాటల సీడీని బుధవారం ఆవిష్కరించిన సభలో సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. జన హృదయ నేతగానే కాకుండా ప్రజా కళాకారుడిగా ప్రజల సమస్యల పరిష్కారానికి జీవితం అంతా కృషి చేసిన కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి సేవలు మరువలేనివి అని అన్నారు.

April 9, 2025 / 07:38 PM IST

17 నుంచి వీరభద్ర స్వామి జాతర

SRD: రాయికోడ్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి జాతర ఈనెల 17 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

April 9, 2025 / 06:27 PM IST

మడికొండలో బీఆర్ఎస్ పార్టీ సన్నహాకా సమావేశం

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులోని మామిడి తోటలో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నహాకా సమావేశాన్ని కార్పొరేటర్ ఆవాల రాధికా రెడ్డి నేడు ప్రారంభించారు. ఈనెల 27న జరుగు సమావేశానికి భారీగా కార్యకర్తలు తరలిరావాలని దానికి తగినట్లుగా రవాణా భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు కార్పొరేటర్ కార్యకర్తలకు తెలిపారు

April 9, 2025 / 05:11 PM IST

‘మహనీయుల జయంతి మాసోత్సవాలను ఘనంగా నిర్వహించాలి’

HNK: జిల్లా కేంద్రంలోని ఏకశిల పార్కులో నేడు దళిత బహుజన ఫెడరేషన్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మహనీయుల జయంతి మాసోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దళిత బహుజన సాధికారత జాతీయ కార్యదర్శి శంకరన్న కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

April 9, 2025 / 05:08 PM IST

పంటలను పరిశీలించిన ఏఈవో

KMR: మహమ్మద్ నగర్ మండలం గాలిపూర్ గ్రామంలో బుధవారం ఏఈవో రేణుక వరి పంటను పరిశీలించారు. వరి పంటలో దోమపోటు ఉధృతిని గమనించారు. రైతులు దోమపోటు నివారణకు తగిన యాజమాన్య పద్ధతులు నిర్వహించి, ఎకరానికి బుఫ్రోఫెసిన్ 320 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 120 గ్రాములు లేదా డైనోటెఫ్యూరాన్ 80 గ్రాములు ఎకరానికి పిచికారి చేసుకోవాలని సూచించారు.

April 9, 2025 / 04:57 PM IST

మెడల్ సాధించిన క్రీడాకారిణిని సన్మానించిన ఎమ్మెల్యే

HNK: ఇటీవల జరిగిన కేలో ఇండియా యూత్ గేమ్స్ నేషనల్ & ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో ఫెన్సింగ్ స్పోర్ట్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన శ్రీజను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మెడల్ అందజేసి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు.

April 9, 2025 / 04:24 PM IST