• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

​జాన్సీ లింగాపూర్‌లో చేతి పంపులకు మరమ్మతులు

MDK: రామాయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో ఏళ్ల తరబడి పాడైపోయిన చేతి పంపులకు సర్పంచ్ మానెగళ్ళ రామకృష్ణయ్య మరమ్మతులు చేయించారు. వేసవి దృష్ట్యా ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి ప్రత్యేక చొరవ తీసుకొని హ్యాండిల్ బోర్లను బాగు చేయించడంతో పలు వార్డుల ప్రజలకు నీటి కష్టాలు తీరాయి. తమ సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్తులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

March 20, 2026 / 03:44 PM IST

‘పండుగలు సమాజానికి కళాశోభను ఇస్తాయి’

SDPT: పండుగలు సమాజాలను కళావంతం చేస్తాయని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన గీసిన ‘రంజాన్ ముబారక్’ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సోదరభావానికి, సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. సమాజంలో ధనవంతులు పేదవారి ఆకలిని గుర్తించి చేయూతనివ్వాలని కోరారు.

March 20, 2026 / 03:43 PM IST

శాంతియుత వాతావరణంలో రంజాన్ జరుపుకోవాలి: ఎస్పీ

SRPT: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లా ముస్లిం సోదరులకు, ప్రజలకు ఎస్పీ నరసింహ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పండుగను మతాలకు అతీతంగా, సోదరభావంతో జరుపుకోవాలని ఆయన కోరారు. ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహపూర్వక వాతావరణంలో మెలిగి సమాజంలో శాంతి స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

March 20, 2026 / 03:42 PM IST

‘అరెస్టులతో బీజేపీ పోరాటాలను ఆపలేరు’

RR: అరెస్టులతో బీజేపీ పోరాటాలను ఆపలేరని బీజేపీ కొత్తూరు మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలకు నిరసనగా బీజేపీ చేపట్టిన కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అరెస్టులకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా అడ్డగించిన కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామన్నారు.

March 20, 2026 / 03:41 PM IST

ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షల ఫీ నోటిఫికేషన్ విడుదల

NZB: టీయూ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH) 8, 10 వ సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ ఇవాళ తెలిపారు. ఈ నెల 28 లోపు ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు తమ కళాశాలల్లో పరీక్ష ఫీజులు చెల్లించాలని స్పష్టం చేశారు.

March 20, 2026 / 03:41 PM IST

ఈ నెల 24న సోమేశ్వరాలయం హుండీ లెక్కింపు

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 24న మంగళవారం ఉదయం 10:30 గంటలకు హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవదాయ , ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆలయంలోని కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

March 20, 2026 / 03:40 PM IST

సీఎంను కలిసిన ఎమ్మెల్యే వేముల

NLG: కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. వీరేశంతో పాటు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఉన్నారు.

March 20, 2026 / 03:39 PM IST

మంజీరా నదిలో వేలాది చేపల మృత్యువాత

SRD: హత్నూర మండలం పల్పనూర్ శివారులోని మంజీరా నదిలో వేలాది చేపలు మృతి చెంది పైకి తేలడం స్థానికంగా కలకలం రేపింది. కలుషిత జలాల వల్లే చేపలు చనిపోయాయని, దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కోరారు.

March 20, 2026 / 03:38 PM IST

మృతుడి చిత్రపటానికి మాజీ ఎంపీ కవిత నివాళి

MHBD: నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామ మాజీ సర్పంచ్ కొలగాని నాగరాజు తండ్రి రిటైర్డ్ టీచర్ కొలగాని రాజయ్య ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత శుక్రవారం వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 20, 2026 / 03:34 PM IST

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన అదనపు కలెక్టర్

NGKL: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి, గుండాల, కొట్ర గ్రామాల్లో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా పర్యటించారు. పశువుల షెడ్లు, కూరగాయల తోటలు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. తోటల నిర్వహణపై రైతులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. గుండాల శివాలయంలోని శానిటరీ కాంప్లెక్స్ను కూడా తనిఖీ చేశారు.

March 20, 2026 / 03:33 PM IST

ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

PDPL: జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ మంథని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలు, పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం రోగులకు అందుతున్న సేవలపై వివరాలు సేకరించారు. రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. అలాగే పట్టణంలో నిర్మాణంలో ఉన్న సంగీత పాఠశాల, మున్సిపల్ కార్యాలయం, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణ పనులు తనిఖీ చేశారు.

March 20, 2026 / 03:30 PM IST

గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు

KNR: గంగాధర మండలం కాచిరెడ్డిపల్లిలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను ఎస్సై వంశీకృష్ణ ప్రారంభించారు. SI వంశీ కృష్ణ మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించడం, అనుమానాస్పద కదలికలను గుర్తించడం సులభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోలు మమత రాణి, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

March 20, 2026 / 03:30 PM IST

పిచ్చుకల దినోత్సవంపై చిత్రలేఖనం పోటీలు

SRCL: చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఇవాళ ప్రపంచ పిచ్చుక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పిచ్చుకలపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్. రజిత మాట్లాడుతూ.. పిచ్చుకల జాతిని వ్యాప్తి చేయడం ద్వారా జీవవైవిధ్యానికి సహాయపడతాయన్నారు.

March 20, 2026 / 03:30 PM IST

‘బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం చేసింది’

MNCL: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన మంచిర్యాలలో మాట్లాడుతూ.. మొత్తం బడ్జెట్ 3,21,234 కోట్లు కాగా.. బీసీల సంక్షేమానికి కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.

March 20, 2026 / 03:30 PM IST

సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ప్రారంభం

GDWL: కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. గద్వాల మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ ప్రకాష్ రావు సూచనల మేరకు గ్రామంలోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టిని, రోడ్ల పక్కన ఉన్న కంపచెట్లను తొలగించే పనులను శుక్రవారం చేపట్టారు.

March 20, 2026 / 03:30 PM IST