ADB: జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్గా నియమితులైన సభ్యులు MLA పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షాను జిల్లా కేంద్రంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జంగుబాపు, శశికాంత్, లక్ష్మీకాంత్ తదితరులున్నారు.
KMM: తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో ఉద్రిక్తతలు సృష్టించడం ద్వారా ప్రజల్లో చిచ్చు పెట్టాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. నేడు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతు..ప్రస్తుతం బనకచర్ల-పోలవరం ప్రాజెక్టు కారణం చూపిస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నరన్నారు.
MBNR: రైలు ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సోలిపూర్ గ్రామ సరిహద్దుల్లో గుర్తుతెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఐజాక్ తెలిపారు.
ADB: బోథ్ మండలంలోని కౌట గ్రామంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా సన్మార్గంలో పయనించాలన్నారు. గంజాయి పండించిన, అమ్మిన, సేవించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
HNK: భీమారంలోనీ 55వ డివిజన్లో గురువారం ఎంపీ నిధుల నుంచి రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హల్ భవన నిర్మాణ పనుకులకు వరంగల్ ఎంపీ కడియం కావ్య శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జర్నలిస్ట్ నాయకపు సుభాష్ జ్ఞాపకార్థంగా కమ్యూనిటీ హల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
HNK: హన్మకొండ ఆదాలత్ జంక్షన్ వద్ద ఆగే వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తూ భిక్షాటన చేస్తున్న ట్రాన్స్ జెండర్లకు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న కౌన్సిలింగ్ నిర్వహించారు. జంక్షన్ల వద్ద ఆగి ఉన్న వాహనదారులను ఇబ్బంది పెడుతూ భిక్షాటన చేయవద్దని హెచ్చరించారు. ప్రధానంగా వాహనాలు కదిలే సమయంలో అక్కడ ఉండటం వల్ల ప్రమాదానికి గురవుతారని సూచించారు.
BDK: మణుగూరు మండలంలోని వంద పడకల హాస్పిటల్ నందు కింగ్ డోమ్స్ కల్చర్ మినిస్ట్రీస్ ఆద్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫౌండేషన్ సభ్యులు అంజుమనార బేగం బీటీపీఎస్ నందు ఉద్యోగం చేసుకుంటూ సామాజిక సేవ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు.
KMM: జులై 9 దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఆటో బంద్ చేయాలని INTUC పార్లమెంట్ అధ్యక్షులు పాల్వంచ కృష్ణ పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఆర్థిక సాయం, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో ఆటో, ట్రాన్స్పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.
SRPT: మోతే మండలం విబులాపురం మామిళ్ళగూడెంలని పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేసారు. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే తెలుగు, ఇంగ్లిష్ భాషలలో పట్టు సాధించాలని తెలిపారు. విద్యార్థులను తెలుగు చదివించారు, విద్యార్థులు తెలుగు మంచిగా చదువుతున్నారని కలెక్టర్ మెచ్చుకున్నారు.
PDPL: సుల్తానాబాద్ మున్సిపాలిటీ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టీ.రమేష్ను గురువారం మధ్యాహ్నం సుల్తానాబాద్ మున్సిపల్ బీజేపీ నాయకులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డులలోని సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ADB: జైనద్ మండలం కూర గ్రామంలోని కొత్త కాలనీ తాగునీటి కోసం కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా త్రాగునీటి ట్యాంకు శుభ్రం చేయక నాచు నీరు వస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి త్రాగునీటి ట్యాంకును శుభ్రం చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు. .
SRPT: మునగాలలో మురికినీరు రోడ్డుపై పారుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. మురికినీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
NLG: చిట్యాల మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది.నేరడ గ్రామంలో పొలం పనులు చేస్తుండగా మూర్చ రావడంతో ఓ రైతు మృతి చెందాడు. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాలప్రకారం ఇవాళ సాధారణంగా పొలంలో పని చేస్తున్న సమయంలో రైతుకు అకస్మాత్తుగా మూర్చ వచ్చి మడిలో పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తుంది. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
NLG:- ఈనెల 14న తిరుమలగిరి మండలం మాలిపురంలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సామేలు కోరారు. గురువారం శాలిగౌరారంలో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో గురువారం ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, అలవాట్లలో మంచి మార్పులు తీసుకురావడానికి కార్యక్రమం చేపడుతున్నామని ప్రిన్సిపాల్ ప్రశాంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కరీం, రాజేంద్రప్రసాద్, అయ్యుబ్ ఖాన్, వెంకటేశ్వర్ పాల్గొన్నారు.