BHNG: జిల్లా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని సోమవారం మెమోరండం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగీశెట్టి క్రిస్టఫర్, అంతటి రవి, కొండాపురం శ్రీను, మంటి లింగయ్య సంగిశెట్టి జనార్ధన్, పరశురాములు పాల్గొన్నారు.
KMR: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరిని గ్రామంలో మతిస్థిమితం లేని దళిత యువకుడిపై దాడి అమానుషమని సోమవారం MRPS కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు భూమయ్య మాదిగ అన్నారు. గుడిలోకి ప్రవేశించడని అజయ్ కుమార్ను కాళ్లు చేతులు కట్టి నగ్నంగా ఊరేగిస్తూ దాడి చేయడం దారుణమని తీవ్రంగా ఖండించారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు.
NZB: భీంగల్ మండలంలోని లింబాద్రిగుట్టపై ఉన్న శ్రీ లింబాద్రి లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు. అనంతరం భీంగల్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి ఉన్నారు.
HYD: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, గౌడ్ సంఘం నేతలు, బీసీ నాయకులు కలిసి, ఖమ్మం పట్టణంలో నిర్మించబోయే గౌడ్ సంఘం భవనానికి నిధుల విషయంలో చర్చించారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఫండ్స్ పొందేందుకు బాధ్యత స్వీకరించనున్నట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. గౌడ్గా పుట్టినందుకు గర్వంగా ఉందని, బీసీలు-గౌడ్స్ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
HYD: రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తుండటంతో జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బహిరంగంగా చెత్త వేసే వారిపై రూ.500 నుంచి 2వేల వరకు ఫైన్ విధించనున్నారు. స్వచ్ఛ నగరమే లక్ష్యమని.. ప్రజల్లో మార్పు తీసుకురావడమే తమ ఉద్దేశ్యమని జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తెలిపారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఆలయ సిబ్బంది తదితరులున్నారు.
WGL: నర్సంపేటలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనగణనతో పాటు కులగణన చేపట్టే చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. పట్టణ బీజేపీ అధ్యక్షుడు గూడూరు సందీప్ నేతృత్వంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. జనగణన దేశ అభివృద్ధికి, కులగణన సామాజిక సమానతకు దోహదపడుతుందన్నారు. డేటా సేకరణ ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.
BHPL: రేగొండ గ్రామ కమిటీ అధ్యక్షుడు బొల్లెపల్లి చంద్రమౌళి గుండెపోటుతో సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, చంద్రమౌళి మృతదేహానికి పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
NRML: ఇందిరమ్మ ఇండ్ల సర్వే తుది జాబితా రెండు రోజులలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వారు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ASF: జిల్లాకు విచ్చేసిన కేంద్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి నీతిన్ గడ్కరీని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం కలిశారు. ఈ సందర్బంగా పలు సమస్యలను మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లారు. NH-63 రహదారి నిర్మాణ వేగవంతం చేయాలని, చెన్నూరు జోడు వాగు ప్రాంత రవాణా సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
HYD: ఉప్పల్ పరిసర ప్రాంతాలలోని వారాంతపు సంతలు, పెద్ద మార్కెట్లలో మట్టికుండలకు గిరాకి అంతంత మాత్రంగానే ఉందని వ్యాపారులు తెలిపారు. వేసవికాలం అయినప్పటికీ హైదరాబాద్లో ఫ్రిడ్జ్, ఇతరత్ర ఆర్టీఫిషియల్ పద్ధతుల్లో నీటిని చల్లగా మార్చుకుంటున్నారు. దీంతో మట్టి కుండల వైపు చూసే వారి సంఖ్య తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది.
NGKL: గుంటనక్క (గోల్డెన్ జాక్) దాడిలో రెండుగేదెలు మృతిచెందిన సంఘటన తిమ్మాజీపేట మండలం చేగుంటకు చెందిన రైతు వినోద్ పొలంలో నిన్నరాత్రి జరిగింది. ఇవాళ ఘటన స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ రేంజ్ అధికారి దేవరాజు మాట్లాడుతూ.. రాత్రివేళల్లో పశువులను పొలాల దగ్గర కాకుండా ఇంటిదగ్గర కట్టివేయాలని సూచించారు. కాగా రెండు గేదెలు మృతిచెందడంతో రైతు బోరున విలపించారు.
MLG: జిల్లా కేంద్రంలో ఆదివారం జై బాపు జై భీమ్ జై సంవిదాన్ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం సమావేశంలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడోయత్ర చేశారని తెలిపారు.
MHBD: కొత్తగూడ మండలం పెగడపల్లి శివారులో ఆదివారం రాత్రి ద్వి చక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో మద్దెల ప్రకాష్ అనే బిఎస్ఎఫ్ జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు.
WGL: మంటల్లో మక్క జొన్న కంకులు కాలిబూడిదైన ఘటన వరంగల్ మొగిలి చెర్లలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన 20 మంది రైతులు తమ చేన్లలో పండించిన మక్కలు, మక్కజొన్న కంకు లను మొగిలిచెర్ల-గీసుగొండ రోడ్డుపై ఆరబోసుకున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు మక్కజొన్న చొప్పుకు నిప్పు పెట్టడంతో గాలికి నిప్పురవ్వలు వచ్చి కంకులు, మక్కలకు అంటుకున్నాయి.