WGL: వర్ధన్నపేట మండలంలోని కొత్తపెల్లి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. హెచ్ఎం, ఉపాధ్యా యులు ఉండే ఆఫీసును సైతం తరగతి గదిగా మార్చి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఆరుబయటే క్లాసులు చెబుతూ కాలం వెల్లదీస్తుండగా, వర్షాలు కురిస్తే ఒకే గదిలో రెండేసి క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు.
ASF: కాగజ్ నగర్ పట్టణం ESI శిథిలావస్థకు చేరింది. దీంతో కూల్చివేయాలని ఉత్తర్వులు కూడా వచ్చాయి. ప్రభుత్వం ESI కార్పొరేషన్ ఆస్పత్రికి స్థలం కేటాయించకవడం, నిధులు మంజూరు చేయకపోవడంతో ఇంకా శిథిల భవనంలోనే కొనసాగుతోంది. దీంతో కార్మికులకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. రామగుండం తరలించేందుకు సన్నాహాలు చేస్తుండడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
WNP: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఈ నెల 13లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని శుక్రవారం డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. ఆసక్తి కలిగిన ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జులై 13లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
KMM: వాకీ టాకీల వినియోగం ద్వారా వ్యవస్థీకృతంగా డేటాను పొందవచ్చని ఖమ్మం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో 60 డివిజన్లకు చెందిన శానిటరీ జవాన్లకు వాకీ టాకీలు పంపిణీ చేశారు. ప్రతి జవాన్ ఎక్కడ ఉన్నాడో అనే విషయంపై స్పష్టత ఉండటంతో పాటు సమయపాలనపై పర్యవేక్షణ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
KMM: పోక్సో కేసులో మామిడి పాపారావు(30) నిందితుడికి 20 సం.రాల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ FTC-II న్యాయమూర్తి ఉమాదేవి శుక్రవారం తీర్పునిచ్చారు. సత్తుపల్లి (M)కి చెందిన 7 ఏళ్ల బాలిక పై 2023 AUG 13న ఇంటి బయట అడుకుంటున్న చిన్నారిపై పాపారావు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులకు ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో గల దర్గా చెరువు శిఖంలో జేసీబీ ద్వారా కొందరు అక్రమంగా మట్టిని తవ్వి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో సాగు చేయడానికి సర్వే నంబర్ల 489/5, 489/6, 489/7భూములలో తమకు హక్కులు ఇచ్చారని గ్రామానికి చెందిన దళిత రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. తవ్వకాలను నిలిపివేయాలని వారు డిమాండ్
WGL: మహానగరంలో ముంపు ప్రాంతాలు ఏటేటా పెరుగుతున్నాయని, నాలాల కబ్జా, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో చినుకుపడితే నగరవాసులు జంకుతున్నారని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం GWMC కమిషనర్కు బీజేపీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు.
KMM: ఆర్ధికంగా వెనుకబడి, న్యాయ సహాయం కొరకు ధనాన్ని వెచ్చించ లేని వారి కోసం అందించే అందించే ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని లా కాలేజీలో నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. లా విద్యార్థులకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గురించి వివరించారు.
MLG: విద్యార్థులను చదువుతో పాటు కళాత్మక రంగాలలో ప్రోత్సహించాలని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలల కాళేశ్వరం జోనల్-1 అధికారిని అరుణ కుమారి అన్నారు. జనవరిలో కాళేశ్వరం జోనల్ లోవర్ డ్రాయింగ్ అర్హత పోటీలలో ములుగు సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన 30మంది విద్యార్థిలు ఉత్తీర్ణత సాధించారు. శుక్రవారం పాఠశాల సందర్శన వచ్చిన అరుణ వారిని అభినందించి, పథకాలు అందించారు
HYD: వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా బాలాజీ నగర్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వంగవీటి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, భరత్ కుమార్, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
NGKL: నాగర్కర్నూల్ జిల్లాలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వెంకట్ రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన భూ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో ఎంతో మంది రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వాటి పరిష్కారానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు.
WNP: కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ ఇవ్వాలని సీపీఐ పట్టణ కార్యదర్శి రవీందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం అమారచింత మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, భాస్కర్, శ్యాం సుందర్, పలువురు పాల్గొన్నారు.
KMR: గాంధారి మండలంలోని వివిధ పెస్టిసైడ్ షాప్లలో శుక్రవారం ఎల్లారెడ్డి వ్యవసాయ శాఖ అధికారి నదీమ్, మండల వ్యవసాయ అధికారి రాజలింగం, స్థానిక ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ.. అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
MBNR: మిడ్జిల్ మండలం రాణిపేట్లో డ్రైడే-ఫ్రైడే కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి సుదర్శన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్, అంగన్వాడీ టీచర్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
WGL: సంగెం మండలం గవిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను కలెక్టర్ సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల పంట రుణాల వివరాలు తెలుసుకుని ఒక్క రైతుకు ఎన్ని బస్తాలు యూరియా ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. యూరియా బస్తాలను ఎమ్మార్పీ ధరకే విక్రయించాలి స్టాక్ ఎప్పటికప్పుడు అందుబాటులోకి ఉంచుకోవాలని సూచించారు.