MDCL: అల్వాల్ పట్టణం కనజగూడలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు దర్శనం కోసం బారులు తీశారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఆలయ అభివృద్ధికి భక్తులు సహకరించాలని నిర్వాహకులు కోరారు.
SRD: నిజాంపేట్ మండల కేంద్రంలో ముస్లింలకు ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నేడు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్స్ అందజేశారు. రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరీమణులను గౌరవించి ఈ తోఫాను అందించినట్లు తెలిపారు. అన్ని మతాలు సమానంగా అందరూ క్షేమంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
PDPL: రామగుండం NTPC- కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్ ఆధ్వర్యంలో యువతీ, యువకులకు కంప్యూటర్ రంగంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు యజమాన్యం ప్రకటించింది. DGCA, GST, ట్యాలీ కోర్సులలో ట్రైనింగ్ ఇస్తామన్నారు. కోర్సులు పూర్తి చేసిన వారు ఉపాధి అవకాశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 9794180335, 8106044670 నంబర్లను సంప్రదించాలన్నారు.
MHBD: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 19న జరగాల్సిన వారాంతపు సంత (తైబజార్) వేలం ఉగాది పండుగ సందర్భంగా వాయిదా పడినట్లు మున్సిపల్ కమిషనర్ దయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్లీ ఈ వేలం పాటను ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి గల వేలందారులు ఈ మార్పును గమనించి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.
MLG: జిల్లా TS MRPS తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా అశోక్ను నియమించినట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ మాదిగ తెలిపారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. జిల్లాలో దళిత జాతి హక్కుల సాధనకు, మాదిగల రిజర్వేషన్ పోరాటానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన జిల్లా, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
KMM: కామేపల్లి మండలం పాత లింగాల గ్రామంలో నూతన సిసి రోడ్డు కు శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి, పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తుందన్నారు.
BDK: ఉగాది పండుగ పురస్కరించుకుని మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని ఇవాళ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో నరేష్ డీఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
NLG: కవులు సమాజంలోని ప్రజలను చైతన్యవంతం చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని పేర్కొన్నారు. యువకులు కూడా సాహిత్యంపై ఆసక్తిని పెంచుకోవాలని అన్నారు. నకిరేకల్ లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించి కవులను సత్కరించారు. ఈ సందర్భంగా సమస్యలు, అభివృద్ధిపై కవులు తమ కవితలను వినిపించారు.
SRCL: ఉగాది పర్వదినం సందర్భంగా వేములవాడలో నిర్వహించిన ఏరువాక పనుల కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలోవైస్ ఛైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కౌన్సిలర్లు తోట రాజు, కొక్కుల బాలకిషన్, కొండ శేఖర్ పాల్గొన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలో గురువారం శ్రీ పరాభావ ఉగాది పండుగను పురస్కరించుకుని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్మెన్ దావ స్వాతి-రమేష్ ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఉగాది ఉత్సవాలు హాజరై మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉగాది ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మేయర్ మమత డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీలో మార్చి 17, 18 తేదీలలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్లో పాలమూరు యూనివర్సిటీకి చెందిన బత్తిని రాము రాష్ట్ర యూనివర్సిటీల కో-కన్వీనర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బత్తిని రామును విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు అభినందించారు. ఆయన విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం కృషి చేస్తానని అన్నారు.
SRD: సదాశివపేట మండలం ఎంకేపల్లి గేటు వద్ద విజయలక్ష్మి(45) అనే మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి గురువారం పాల్పడింది. వెంటనే గమనించిన స్థానికులు 108 కి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఆమెను సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
SRD: రామచంద్రపురం 268వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గ్రామ పురోహితుడు బాలకృష్ణ పంతులు, గ్రామ పెద్దలు, అన్ని కులాల నాయకులతో కలిసి పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
GDWL: మాచర్ల గ్రామంలోని పలు వార్డుల్లో చీకటి సమస్యను తొలగిస్తూ సర్పంచ్ బి.వజ్రమ్మ తిమ్మప్ప ఆధ్వర్యంలో గురువారం కొత్త విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా వెలుతురు లేక ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో ఈ లైట్లను అమర్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుదర్శన్ లైన్మెన్ రవి తదితరులు పాల్గొని విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించారు.