ఆసిఫాబాద్: కాగజ్ నగర్ పట్టణంలోని సంతోష్ ఫంక్షన్ హాల్లో మంగళవారం 314 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సిర్పూర్ MLA పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆడబిడ్డ పెళ్లి కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు.
NRML: దిలావర్పూర్ మండలంలో మంగళవారం జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమం అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని కోరారు.
NRML: దిలావర్పూర్ మండలంలోని కాల్వ, న్యూ లోలం, దిలావర్పూర్ గ్రామాలలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను మంగళవారం డీఆర్డీఓ శ్రీనివాస్, ఏపీడీ నాగవర్ధన్లు పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ.. రోజువారి కూలీ, పనికొలతలపై అవగాహన కల్పించారు. ఎండాకాలం వడదెబ్బ తలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎంపీఓ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
KMR: బాన్సువాడ పట్టణంలోని ఎస్ఎంబీ గార్డెన్లో నిర్వహించే సన్నాహక సమావేశానికి ఈనెల 10న రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరుకానున్నట్లు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ మంగళవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లో నిర్వహించే బహిరంగ సభకు నాయకులు పోల్గొన్నాలన్నారు.
NRML: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన సన్న బియ్యం పేద ప్రజలకు వరమని అన్నారు. ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామంలోని లబ్ధిదారుని ఇంట్లో ఆమె మంగళవారం భోజనం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ASF: ఆసిఫాబాద్ మండలంలోని MPDO కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రంని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అదనపు కలెక్టర్, మండల ప్రత్యేక అధికారులతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను పరిశీలించారు. పథకం దరఖాస్తుకు ఈనెల 14 చివరి తేదీ అన్నారు. యువత పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో కేకేఎం ట్రస్ట్ ఛైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ మంగళవారం జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీరామ్ నగర్లో స్ఠానిక నాయకులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పున్నరెడ్డి, బుచ్చిరెడ్డి, పాల్గొన్నారు.
HYD: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్ష విధించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 12 ఏళ్ల తర్వాత తీర్పు రావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ NIA అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
WGL: జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గోవిందరావుపేట మండలం రాంనగర్లో రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి భానోత్ సమ్మక్కకు చెందిన రేకుల ఇల్లు ధ్వంసమైంది. రేకులు సమ్మక్కపై పడడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగాయి, భారీ వృక్షాలు నేలకూలాయి.
NLG: మిర్యాలగూడలోని జనయేత్రీ సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షులు, సామాజిక సేవకులు, డా.మునీర్ అహ్మద్ షరీఫ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ DSP రాజశేఖర్ రాజు పాల్గొని మాట్లాడుతూ.. ఒకరి రక్తదానం వల్ల ముగ్గురి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. యువత స్వచ్ఛంద రక్త దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేపడుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు 1 టౌన్ SHO దేవయ్య తెలిపారు. SHO మాట్లాడుతూ.. సర్వే నం. 170PP ఆక్రమించి ఇల్లు కడుతున్న SK. మహబూబ్ బీ, అమానుల్లా ఖాన్ అనే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారన్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేశామని SHOపేర్కొన్నారు.
SRD: పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఈనెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జానకి దేవి సోమవారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. దరఖాస్తులను www.polycet.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SRD: నారాయణఖేడ్ పట్టణంలోని ZPHSలో వరల్డ్ హెల్త్ డే నిర్వహించారు. ఈ మేరకు ఖేడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత రక్త పరీక్షలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్థానిక లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సంజీవరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు బ్లడ్ గ్రూప్, హిమగ్లోబిన్ రక్త పరీక్షలు చేశారు.
SRPT: పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం నూతనకల్ మండలం బక్కా హేమ్లా తండాలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం ఇస్తుందన్నారు.
HYD: ఇవాళ గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బోర్డు ఛైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన GRMB సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు, ఈఎన్సీలు హాజరయ్యారు. వీటిలో పలు అంశాలపై చర్చించారు.