NRPT: ధన్వాడ మండలంలోని ధన్వాడ, మంత్రోనిపల్లి, కంసాన్ పల్లి, కిష్టాపూర్ గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరయ్యాయని సర్పంచులు జ్యోతి రామచంద్రయ్య, రవికుమార్, కొండయ్య గురువారం వెల్లడించారు. మంజూరైన నిధులతో గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణకు కృతజ్ఞతలు తెలిపారు.
SDPT: చిన్నకోడూరులోని గంగమ్మతల్లికి 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మంగళ హారతులు సమర్పించనున్నట్లు గంగపుత్ర సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, భక్తులకు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు.
MDCL: ఉగాది పండుగను పురస్కరించుకుని అల్వాల్లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరం ‘పరాభవ’ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అర్చకులు స్వామివారికి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో మార్మోగింది.
BDK: దమ్మపేట(M) గండుగులపల్లికి చెందిన తాటి కృష్ణకుమారి ప్రసవ వేదనలతో బాధపడుతుండగా 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే దమ్మపేట 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవ వేదనలు ఎక్కువ కావడంతో అంబులెన్స్లోనే ఆమెకు ప్రసవం చేశారు. ఆడ్డ బిడ్డకు జన్మనించింది. మెరుగైన చిక్సిత కోసం ఆసుపత్రికి తరలించారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీలో మార్చి 17, 18 తేదీలలో నిర్వహించిన SFI రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్లో పాలమూరు యూనివర్సిటీకి చెందిన బత్తిని రాము రాష్ట్ర యూనివర్సిటీల కో-కన్వీనర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బత్తిని రామును యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు అభినందించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
SRD: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు రూ.26 వేల రూపాయల వేతనం చెల్లించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.
KMM : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని శ్రీ కామాక్షి ఏకామేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
MNCL: తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 2-టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. సుభాష్ నగర్కు చెందిన వర్షిత తన స్నేహితులకు డబ్బులు అప్పుగా ఇచ్చింది. దీంతో ఇంట్లో చెప్పకుండా డబ్బులు అప్పు ఇవ్వడం ఏంటని తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన వర్షిత ఇవాళ ఉరేసుకుని మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
MNCL: కాసిపేట మండలం, కొండాపూర్ యాప వద్ద బీజేపీ నాయకులు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ధర్మారావుపేట గ్రామానికి చెందిన మండలంలోని తొలి బీజేపీ వార్డు మెంబర్ ముత్యాల నవీన్ కుమార్ యాదవ్ ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది పచ్చడిని అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఈ పరాభవ నామ సంవత్సరం అందరికి సుఖ సంతోషాలను కలిగించాలని ఆకాంక్షించారు.
NLG: చిట్యాల మండలం వెలిమినేడు, బొంగోని చెరువు గ్రామాల్లో ఈ నెల 27న జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను గురువారం సర్పంచులు, గ్రామ పెద్దలు ఆవిష్కరించారు. ఉగాది సందర్భంగా పురోహితులు వావిలాల ప్రభాకర్ శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు. కార్యక్రమంలో గ్రామాల సర్పంచ్లు బొంతల చంద్రారెడ్డి, ఆశయ్య, ఛైర్మన్ సాయికృష్ణ రెడ్డి పాల్గొన్నారు.
MHBD: కొత్తగూడ మండలం గోపాలపురం గ్రామ పరిధిలో గురువారం గబ్బిలాలు విద్యుత్ లైన్లపై పడడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మూడు చోట్ల తీగలు తెగిపోయాయి. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఉప సర్పంచ్ అశోక్ వెంటనే స్పందించి విద్యుత్ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. సరైన యూ-టర్న్ లేకపోవడంతో వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్తున్నారని, అందుకే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
GDWL: ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గద్వాల కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పటేల్ శ్రీనివాస్ రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు వారిని స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
ASF: సిర్పూర్ (టి) మండలం డోర్పల్లి సర్పంచ్ సమీరా ఎన్నికను ఎలక్షన్ ట్రైబ్యునల్ రద్దు చేసింది. నామినేషన్ సమయంలో ఆమెకు కనీస వయస్సు (21 ఏళ్లు) నిండలేదని RDO లోకేశ్వర్రావు నిర్ధారించారు. ఆధార్, పాన్, ఓటర్ ఐడీల్లో తప్పుడు వివరాలతో పోటీ చేసినట్లు రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సర్పంచ్ పదవిని భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.
SRD: ఖేడ్ RTC బస్సు డిపోలో ఉద్యోగుల ఆధ్వర్యంలో శ్రీ పరాభవ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డిపో మేనేజర్ VVS సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా తయారు చేసిన ఉగాది పచ్చడిని ఉద్యోగులకు వితరణ చేశారు. ఈ ఏడాదిలో ఉద్యోగులందరూ సుఖశాంతులతో ఉండాలని డీఎం ఆకాంక్షించారు. ఇందులో AM(T) నర్సింలు, AE(M) శ్రీనివాసు ఉన్నారు.