• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బీసీ స్టడీ సర్కిల్లో 15 నుంచి ఉచిత శిక్షణ తరగతులు

KNR: RRB, SSC, BANKING ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 15 నుంచి ప్రారంభం అవుతాయని కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఎంపిక అయిన అభ్యర్థులకు ఈ నెల 14 వరకు ధ్రువపత్రాల పరిశీలన ముగుస్తుందని తెలిపారు. బయోమెట్రిక్ అటెండెన్స్ అమలవుతుందని అన్నారు.

February 14, 2025 / 11:07 AM IST

కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి

NZB: కుంభమేళాకువెళ్లివస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సైసాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.

February 14, 2025 / 11:06 AM IST

వైభవంగా మహా చండీ యాగం

నల్గొండ: మిర్యాలగూడ పట్టణంలోని MVR ఫంక్షన్ హాల్ నందు గుడిపాటి నవీన్ ఆధ్వర్యంలో మహా చండీ యాగం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాధవి హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు, BLR బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు.

February 14, 2025 / 10:27 AM IST

సికింద్రాబాద్‌లో పాడైపోయిన చికెన్

HYD: గత కొన్ని రోజులుగా కోళ్లకు వస్తున్న బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినొద్దంటూ ప్రభుత్వం చెబుతుంటే మరోపక్క పాడైపోయిన చికెన్ అమ్మేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ పరిధిలోని ఓ చికెన్ దుకాణంలో 2 క్వింటాళ్ల వరకు పాడైపోయిన చికెన్‌ను అధికారులు గుర్తించారు. ఈ చికెన్‌ను అమ్మడానికి ప్రయత్నిస్తున్న దుకాణదారుడు పై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

February 14, 2025 / 10:20 AM IST

కాప్రా MRO కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ

మేడ్చల్: కాప్రా ఓల్డ్ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు, తాహశీల్దార్ హాజరు కానున్నారు. కాప్రా మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి చెక్కులు తీసుకోవాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.

February 14, 2025 / 10:06 AM IST

సంధ్య థియేటర్‌లో ‘ఆరెంజ్’ సందడి

HYD: ఈరోజు వాలంటైన్స్ డే సందర్భంగా RTC X రోడ్డులోని సంధ్య థియేటర్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాను ప్రదర్శించారు. భారీ సంఖ్యలో ఈ సినిమా ప్రదర్శనకు హాజరైన ఫ్యాన్స్ థియేటర్ స్క్రీన్ ముందు డాన్సులు చేస్తూ సందడిగా గడిపారు. 2010లో విడుదలైనప్పటి ఈ మూవీ పాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇవాళ కాగితాలు చల్లుతూ ఎంజాయ్ చేశారు.

February 14, 2025 / 09:58 AM IST

నేడు కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

HYD: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేడు కులగణన పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. గాంధీభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమాన్ని PCC చీఫ్ మహేష్ గౌడ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన, SC వర్గీకరణపై పార్టీ నేతలకు అవగాహన కల్పించనున్నారు.

February 14, 2025 / 09:30 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

NZB: జిల్లా బాల్కొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. HYDలోని చింతల్‌కు చెందిన రమేశ్, చంద్రశేఖర్, సాయివిశాల్, శ్రీనివాస్, రజినీకాంత్, సంపత్ కారులో కుంభమేళా వెళ్తున్నారు. చిట్టాపూర్ వద్ద లారీని ఓవర్టేక్ చేస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. సంపత్ అక్కడికక్కడే మృతిచెందారు.

February 14, 2025 / 09:01 AM IST

‘బతికుండగానే చనిపోయానని రూ.10లక్షలు కాజేశారు’

BDK: బతికి ఉన్న తనను చనిపోయినట్లు చిత్రీకరించి రూ.10లక్షలు మాయం చేశారని భుక్యా శ్రీరాములు అనే వ్యక్తి ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం భాస్కర్‌ నగర్‌కు చెందిన ఆయన తనను ఒకరు మోసం చేసి, డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేసి రూ.10లక్షల బీమాను తన భార్య పేరు మీద అక్రమంగా కాజేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాయల దుర్గారావుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

February 14, 2025 / 08:11 AM IST

నేడు ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

NGKL: ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ రఘు తెలిపారు. ఎలాంటి కడుపుకోత లేకుండా 2 నుంచి 5 నిమిషాల్లో ఆపరేషన్ చేసి ఉచితంగా మందులు ఇచ్చి వెంటనే ఇంటికి పంపుతామన్నారు. ఉదయం 11గంటలకు నిర్వహించే ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరాన్ని జిల్లాలోని పురుషులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

February 14, 2025 / 07:53 AM IST

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

NGKL: తాడూర్ మండలం ఐతోల్ గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రంల ట్రాన్స్ ఫార్మర్ బిగించనున్నారు. దీంతో నేడు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్‌ను నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీరాములు, ఏడీఈ శ్రీనివాసులు తెలిపారు. విద్యుత్ ఉండని ప్రాంతాలు ఐతోల్, సిర్సవాడ, పాపగల్, అంతారం, ఏటిదర్పల్లి, పలు ప్రాంతాల్లో నిలిపివేయాలన్నారు. గ్రామ ప్రజలందరూ సహకరించాలని అధికారులు కోరారు.

February 14, 2025 / 07:45 AM IST

నేడు మాజీ ప్రజా ప్రతినిధులతో సమావేశం

KMR: తాజా మాజీ సర్పంచ్లు, జడ్పీటీసీలతో శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ ఘటన అధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్య క్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు.

February 14, 2025 / 05:29 AM IST

సీఎం రేవంత్ రెడ్డికి పిడమర్తి రవి వినతి

HYD: 30 ఏళ్లకు పైగా జరిగిన ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ డా. పిడమర్తి రవి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే మాదిగలపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు.

February 13, 2025 / 08:02 PM IST

కాంగ్రెస్‌పై కుత్‌బుల్లాపూర్ MLA ఆగ్రహం

HYD: సర్వేను సరిగ్గా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన ఎలా అందిస్తుందని ఎమ్మెల్యే KP వివేకానంద గౌడ్ ప్రశ్నించారు. గురువారం బీఆర్ఎస్ భవన్‌లో ఆయన సమావేశమయ్యారు. రూ.200 కోట్లతో చేపట్టిన కులగణన సర్వేతో రెండు కోట్ల మంది బడుగు బలహీన వర్గాలను అవమానించారు. డిప్యూటీ సీఎం భట్టి మాటలతో ప్రభుత్వ వైఫల్యం తేటతెల్లమయ్యిందన్నారు.

February 13, 2025 / 07:52 PM IST

ఖమ్మం నగరంలో మెరుగైన సేవలందించాలి: కలెక్టర్

KMM: నగర కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, తాగునీటి సరఫరా, వ్యాధుల నివారణ, ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ స్థలాల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోజు చెత్త సేకరణను సూచించారు. షాపింగ్ మాల్స్‌లో 15 రోజుల్లో ర్యాంప్‌లు ఏర్పాటు చేయించాలని అధికారులను ఆదేశించారు.

February 13, 2025 / 07:43 PM IST