NRML: పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కడెం మండల కేంద్రంలోని పెద్దూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల రజిత ఇంటి సమీపంలో పాముకాటుకు గురయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రజిత మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
KMR: వెంటనే స్పందించిన బాన్సువాడ పోలీసులు ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారు. శనివారం అర్థరాత్రి ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు డయల్ 100కు కాల్ వచ్చింది. వెంటనే స్పందించిన పెట్రోలింగ్ కానిస్టేబుల్ భరత్, హోంగార్డు సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని రక్షించారు.
HYD: మెహదీపట్నం సిగ్నల్ వద్ద వాహనదారులు యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. సిగ్నల్ పడినా ఆగకుండా వెళ్లిపోతున్నారు. ఇలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. రూల్స్ పాటించాలని చెబుతున్నారు.
HYD: ఉప్పల్ పరిధిలోని గణేష్ నగర్ కాలనీ వాసులు ఓ ఆన్లైన్ యాప్ ద్వారా కూరగాయలు కొనుగోలు చేశారు. వాటిని కట్ చేసి చూడగా అన్ని పుచ్చులు, కొన్ని ఖరాబై ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సదరు మేనేజ్మెంట్ బృందానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ప్రస్తుతం జనాలు ఆన్లైన్ ద్వారానే ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతున్నారని, ఈ-కార్ట్ సర్వీసులపై తనిఖీలు చేయాలని కోరుతున్నారు.
NZB: రైల్వేస్టేషన్లో బాంబ్ పెట్టినట్లు ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. శుక్రవారం ఓ వ్యక్తి డయల్ 100కి ఫోన్ చేసి రైల్వే స్టేషన్లో బాంబ్ పెట్టినట్లు బెదిరించాడు. దీంతో పోలీసులు స్టేషన్ మొత్తం గాలించారు. అనంతరం విచారణ చేపట్టగా హైదరాబాద్లోని కీసరకు చెందిన ఓ వ్యక్తి ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించారు. అతడిపై శనివారం కేసు నమోదు చేశారు.
HYD: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారి టూర్ షెడ్యూల్ను డీజీపీ జితేందర్ ప్రకటించారు. మే 12-బుద్ధవనం టూర్, మే 13-చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, మే 14 – రామప్ప ఆలయం, మే 15-యాదగిరిగుట్ట, పోచంపల్లి టూర్, మే 16-పిల్లలమర్రి సందర్శన, మే 17-గచ్చిబౌలి స్టేడియం, మే 18-కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం పరిశీలన, మే 20-ఉప్పల్ స్టేడియంలో IPL క్వాలిఫయర్ సందర్శిస్తారు.
MNCL: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శనివారం ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట గ్రామంలో షిరిడీ సాయిబాబు మహిళ సమాఖ్య భూపేట, బిర్సాయిపేట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతు పథకాలను రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
SRD: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 5వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. సమస్యలు అక్కడికి అక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
MBNR: మరికల్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ స్పాట్లో మృతి చెందింది. స్థానికులు తెలిపిన కథనం మేరకు మండల కేంద్రానికి చెందిన తిరుపతమ్మ హోటల్లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తూన్న క్రమంలో వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడే మృతి చెందింది.
SRD: సంగారెడ్డి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం ఈ నెల 21వ తేదీ వరకు దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ అరుణ బాయి శనివారం ప్రకటనలో తెలిపారు. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పారు. 29వ తేదీన సీట్లు కేటా ఇస్తామని, 30వ తేదీన కళాశాలలో చేరాలని పేర్కొన్నారు.
NRML: దిలావర్పూర్ మండలం శ్రీ కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ గా అంగూరి మహేందర్ను నియమిస్తున్నట్లు ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ చైర్మన్గా ఎన్నికైన మహేందర్ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని, తనపై నమ్మకంతో అధ్యక్షునిగా నియమించిన DCC అధ్యక్షులు శ్రీహరి రావు, కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.
MDK: వివేకానంద ఇనిస్ట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మహిళా సశక్తికరణ నైపుణ్య అభివృద్ధి శిక్షణ మూడో విడత కార్యక్రమం కొనసాగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి పర్యవేక్షించడానికి APPC (ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివ్ కౌన్సిల్) ఆఫీసర్ ప్రకాష్, APPC కోఆర్డినేటర్ ఆఫీసర్ సత్యం విచ్చేసి శిక్షణ తీసుకున్న 240 మంది మహిళలకు మిషన్లు పంపిణీ చేస్తామన్నారు.
SRPT: జాజిరెడ్డిగూడెం మండలం అడివెంలకు చెందిన వర్రె శ్రావ్య పది ఫలితాల్లో అర్వపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతూ 562 మార్కులతో మండలంలో టాపర్గా నిలవగా మరో విద్యార్థిని బండారు ఉదయాంజలి 502 మార్కులు సాధించినందుకు శనివారం రేఖ ఫౌండేషన్ చైర్మన్ బోయపల్లి రేణుక అభినందించారు. అనంతరం శ్రావ్యకు రూ. 5016, ఉదయాంజలికి రూ. 3016 అందించారు.
JN: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వేసవి కరాటే ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు సీనియర్ మాస్టర్ పేశారు సారయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 8919237751 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు.
GDWL: జోగులాంబ గద్వాల జిల్లాలో ఈనెల 4వ తేదీ ఆదివారం జరగనున్న నీట్ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ బి.ఎం. సంతోష్ శనివారం తెలిపారు. మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న పరీక్షకు అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చినట్లు చెప్పారు.